Movie News

‘వారణాసి’ ట్రాక్‌లోనే ఉన్నట్లే..

ఇప్పుడు ఇండియన్ సినిమాలో తెరకెక్కుతున్న చిత్రాల్లో మోస్ట్ అవైటెడ్ అంటే.. ‘వారణాసి’నే. ఎన్నడూ లేని విధంగా ఒక ఇండియన్ సినిమా కోసం హాలీవుడ్ ప్రముఖులు కూడా ఎదురు చూడడం ఈ చిత్రానికే జరుగుతోంది. ‘ఆర్ఆర్ఆర్’తో ఇంటర్నేషనల్ ఆడియన్స్‌ను మెప్పించడం ద్వారా తన కొత్త చిత్రంపై వాళ్లూ అంచనాలు పెట్టుకునేలా చేశాడు రాజమౌళి. రామాయణ గాథ జరిగిన త్రేతాయుగానికి.. భవిష్యత్ కాలమానానికి.. ఇంకా అనేక అంశాలకు ముడిపెడుతూ వెండితెరపై ఒక అద్భుతాన్ని ఆవిష్కరించేలా ఉన్నాడు జక్కన్న.

ఇలాంటి భారీ చిత్రంలో విలన్ పాత్ర చేసే అవకాశం మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్‌ను వరించింది. ఈ చిత్రంలో అతను కుంభా అనే పాత్రలో కనిపించనున్న సంగతి తెలిసిందే. గత ఏడాది రిలీజ్ చేసిన తన ఫస్ట్ లుక్ మిశ్రమ స్పందన తెచ్చుకున్నప్పటికీ.. రాజమౌళి ఈ పాత్రను ఆషామాషీగా తీర్చిదిద్ది ఉండడనే భావిస్తున్నారు. ఈ సినిమా విడుదలకు ఏడాది సమయం ఉండగానే పృథ్వీరాజ్ పాత్రకు సంబంధించి చిత్రీకరణ పూర్తి కావడం విశేషం.

ఈ విషయాన్ని స్వయంగా పృథ్వీరాజే ఇన్‌స్టాగ్రామ్ పోస్టు ద్వారా వెల్లడించాడు. తన పాత్రకు సంబంధించిన షెడ్యూల్ పూర్తయిందని వెల్లడించిన పృథ్వీరాజ్.. ఇక తాను చీట్ మీల్ తినడానికి సమయం ఆసన్నమైందంటూ ఈ చిత్ర నిర్మాత కేఎల్ నారాయణ ఏర్పాటు చేసిన విందుకు సంబంధించిన ఫొటోను షేర్ చేసి ఆయనకు థ్యాంక్స్ చెప్పాడు. పృథ్వీరాజ్ ఇచ్చిన అప్‌డేట్.. ‘వారణాసి’ రిలీజ్ డేట్ అందుకునేలా ట్రాక్‌లోనే ఉందనడానికి ఇండికేషన్‌లా భావించవచ్చు.

‘వారణాసి’ భారీగా విజువల్ ఎఫెక్ట్స్‌తో ముడిపడ్డ చిత్రం. కాబట్టి పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలకు చాలా టైం పడుతుంది. ఈ పాటికే వీఎఫెక్స్ పని మొదలు కాగా.. వాటిని సమయానికి ఒక కొలిక్కి తేవాలటే, మిగతా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలనీ ప్లాన్ ప్రకారం నడవాలి అంటే.. సినిమా విడుదలకు కనీసం ఆరు నెలల ముందు షూట్ మొత్తం పూర్తి చేసి ఉండాలి. ఆ లక్ష్యం దిశగా పక్కా ప్రణాళికతో అడుగులు వేస్తున్నాడు జక్కన్న. ఈ ఏడాది ఆగస్టుకల్లా షూట్ పూర్తి కావచ్చని అంచనా వేస్తున్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్ 7న ‘వారణాసి’ విడుదల కానున్న సంగతి తెలిసిందే.

This post was last modified on April 8, 2026 4:05 pm

Share

Recent Posts

శాశ్వత సెలవు తీసుకున్న షావుకారు జానకి

దక్షిణాది లెజండరీ నటీనటులు ఇటీవలి కాలంలో కన్ను మూయడం సినీ ప్రియులను బాధిస్తోంది. భాగ్యరాజ్ గారి హఠాన్మరణం ఇంకా మర్చిపోక…

56 minutes ago

సింగిల్ సింహం అంటారు… ఇదేం రాజకీయం జగన్?

ప్రచార హోరులో తానే సింగిల్ సింహం అని, కృష్ణుడిని, అర్జునుడిని అంటూ గొప్పలు చెప్పుకోవడం రాజకీయాల్లో సాధారణమే. కానీ, ప్రజాసమస్యలపై…

1 hour ago

వివేకా కేసులో ముగియని సునీత పోరాటం

వివేకా హత్య కేసు విచారణ ఏళ్ల తరబడి కొనసాగుతున్న వైనంపై వివేకా తనయురాలు సునీత అసహనం వ్యక్తం చేస్తున్న సంగతి…

1 hour ago

రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన రద్దు… లండన్ నుంచే ఇండియాకు..

విదేశాంగ శాఖ అనుమతి నిరాకరించడంతో తెలంగాణా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన రద్దయ్యింది. ముందుగా నిర్ణయించుకున్న షెడ్యూల్ ప్రకారం…

2 hours ago

కాంగ్రెస్ లో కొండా కార్చిచ్చు

సీఎం రేవంత్ రెడ్డిపై మంత్రి కొండా సురేఖ తనయురాలు కొండా సుష్మిత చేసిన కామెంట్లు తెలంగాణ రాజకీయాల్లో వేడి రాజేశాయి.…

4 hours ago

చంద్రబాబు విజనరీ గ్రేట్… దక్షిణాది సీఎంల ప్రశంసలు

కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా అధ్యక్షతన చెన్నై లో జరిగిన దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ మండలి సమావేశంలో…

5 hours ago