తెలుగులో పెద్ద స్టార్ల సినిమాలను పక్కన పెడితే.. ప్రేక్షకులు తన చిత్రాల కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూసేలా చేసే హీరోల్లో అడివి శేష్ ఒకడు. ‘క్షణం’ సినిమా నుంచి అతడి కెరీర్ మారిపోయింది. రైటింగ్, మేకింగ్లోనూ ఇన్వాల్వ్ అవుతూ క్వాలిటీ సినిమాలు అందిస్తూ.. తన మీద ప్రేక్షకులకు బాగా గురి కుదిరేలా చేసుకున్నాడు శేష్. కాకపోతే రైటింగ్, మేకింగ్.. ఇలా ప్రతి విషయంలోనూ తన టీమ్స్ చాలా టైం తీసుకుంటాయి కాబట్టి సినిమాలు ఆలస్యం అవుతుంటాయి.
2022లో హిట్-2తో పలకరించిన శేష్ నుంచి.. మళ్లీ ఇప్పుడే హీరోగా సినిమా వస్తోంది. అదే.. డెకాయిట్. ఈ శుక్రవారమే ఈ చిత్రం విడుదల కానుంది. ఐతే శేష్ చేతిలో ఉన్న వాటిలో దీన్ని మించి ఎక్కువ ఆసక్తి రేకెత్తిస్తున్న చిత్రం.. జీ2. ‘గూఢచారి’కి సీక్వెల్గా భారీ బడ్జెట్లో ఈ చిత్రాన్ని తీర్చిదిద్దుతున్నారు.
‘గూఢచారి’ పెద్ద హిట్ అయిన నేపథ్యంలో సీక్వెల్ మీద ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. ఈ సినిమాను నిజానికి గత ఏడాదే రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ ఆలస్యం అయింది. ‘డెకాయిట్’ రిలీజయ్యాకు కొన్ని నెలల గ్యాప్లో ఈ సినిమా కూడా వచ్చేస్తుందని ప్రేక్షకులు ఆశిస్తుండగా.. అలాంటి ఆశలు పెట్టుకోవద్దని చెప్పేశాడు శేష్.
‘గూఢచారి-2’ ఈ ఏడాది చివర్లోనే రిలీజవుతుందని స్పష్టం చేశాడు శేష్. షూట్ మొదలైనపుడు ఈ చిత్రాన్ని గత ఏడాది ఆఖర్లో రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ ఇంకో ఏడాది తర్వాత కానీ సినిమా విడుదల కావట్లేదు. తన కాలికి గాయం కావడం వల్ల మూడు నెలల పాటు చిత్రీకరణల్లో పాల్గొనలేదని.. అందుకే ‘డెకాయిట్’తో పాటు ‘జీ-2’ కూడా ఆలస్యం అయిందని శేష్ వెల్లడించాడు.
తాను చాలా లేటుగా సినిమాలు చేస్తాననే కంప్లైంట్ ఉందని.. తన నుంచి వరుసగా సినిమాలు రావాలంటే తాను రైటింగ్లో ఇన్వాల్వ్ కాకూడదని శేష్ అన్నాడు. డెకాయిట్, జీ-2 తర్వాత తాను రెండు సినిమాలకు రైటింగ్లో జోక్యం చేసుకోనని.. చకచకా ఆ రెండు చిత్రాలు పూర్తి చేస్తానని.. తన నుంచి ఫక్తు తెలుగు సినిమా ఒకటి వస్తుందని చెప్పాడు శేష్.
‘మేజర్’ సినిమా తర్వాత బాలీవుడ్ నుంచి తనకు అరడజను ఆఫర్లు వచ్చాయని.. అందులో నాలుగు వార్ ఫిలిమ్స్ కాగా, రెండు బయోపిక్స్ అని.. కానీ అందులో ఏ చిత్రాన్నీ అంగీకరించలేదని.. ‘మేజర్’ తన డ్రీమ్ ప్రాజెక్టు కావడంతో అది చేశాక, అలాంటి సినిమాలు ఇంకేవీ చేయకూడదని ఫిక్సయ్యానని శేష్ తెలిపాడు.
This post was last modified on April 7, 2026 8:05 pm
వైసీపీ హయాంలో విశాఖపట్నంలోని రుషికొండపై దాదాపు 500 కోట్ల రూపాయల ప్రజాధనం వ్యయంతో విలాసవంతంగా నిర్మించిన ప్యాలెస్ను ఏం చేయాలన్న…
కేరళం ఎన్నికల సందర్భంగా అక్కడ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రచారం చేసేందుకు వెళ్లిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. సీనియర్…
అన్ని రసాల్లోకి హాస్య రసం పండించడం చాలా కష్టమంటారు. అందులో అతిశయోక్తి ఏమీ కాదు. నవ్వించడం అన్నది అత్యంత కష్టమైన…
ఒకప్పుడు ఒక పెద్ద సినిమాకు రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తే.. చివరి దాకా దానికి కట్టుబడే ఉండేవారు. చెప్పిన డేటుకే…
దేశంలోని ఓ ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారం హోరాహోరీగా సాగుతోంది. అందులో కమ్యూనిస్టు పాలనలో ఉన్న కేరళలోనూ ఎన్నికలు జరుగుతున్నాయి. ఆ…
నిజమేనండోయ్...కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. రోడ్డు ప్రమాదంలో మరణించిన…