బాలీవుడ్ భామ మృణాల్ ఠాకూర్ తన కెరీర్లో ఎన్ని సినిమాలైనా చేయనీ.. సీతారామం చిత్రంలో ఆమె పోషించిన సీతామాలక్ష్మి పాత్ర మాత్రం చాలా చాలా స్పెషల్. అదొక కల్పిత పాత్ర అయినా.. ఆమె సినిమాలో మాత్రమే సీతామాలక్ష్మి అయినా.. నిజంగా అలాంటి ఓ అమ్మాయి ఉన్నట్లు, రామ్ దూరం కావడంతో ఆమెకు తీవ్ర అన్యాయం జరిగినట్లు ఫీలైపోతుంటారు జనం.లె
జెండరీ డైరెక్టర్ రాఘవేంద్రరావు సైతం.. ఒక సందర్భంలో రామ్, సీత దూరం కావడం గురించి బాధ పడుతూ, ఈ సినిమాకు సీక్వెల్ తీసి ఇద్దరినీ కలిపేయండని ఈ చిత్ర బృందాన్ని కోరడం గమనార్హం. తాజాగా సీతారామంలో ఆర్మీ మేజర్ విష్ణు శర్మగా కీలక పాత్ర చేసిన సుమంత్.. ఆ సినిమాలో సీతామాలక్ష్మికి చేసిన అన్యాయానికి గాను మృణాల్ ఠాకూర్కు స్టేజ్ మీది నుంచి సారీ చెప్పాడు. మృణాల్ కథానాయికగా నటించిన డెకాయిట్ సినిమా ప్రి రిలీజ్ ఈవెంట్కు అతిథిగా వచ్చిన సుమంత్.. సీతారామం ప్రస్తావన తెచ్చాడు.
ఆ సినిమాలో రామ్ను దూరం చేసినందుకు గాను తాను సీతకు క్షమాపణలు చెప్పానని.. ఆ నేపథ్యంలో ఒక సన్నివేశం తీశారని.. కానీ ఎడిటింగ్లో భాగంగా, తప్పనిసరి పరిస్థితుల్లో ఆ సన్నివేశం తీసేశారని సుమంత్ వెల్లడించాడు. కాబట్టి ఆ సినిమాలో సీతకు క్షమాపణలు చెప్పలేకపోయినందుకు.. ఇప్పుడు ఈ స్టేజ్ మీది నుంచి సీతకు మనస్ఫూర్తిగా సారీ చెబుతున్నానని సుమంత్ వ్యాఖ్యానించాడు.
అంతే కాక.. సీతారామంలో చేసిన అన్యాయానికి బదులుగా తన చెల్లెలు సుప్రియ ప్రొడ్యూస్ చేసిన డెకాయిట్ మూవీలో మృణాల్కు అవకాశం ఇప్పించానని కూడా సుమంత్ వ్యాఖ్యానించాడు. సీతారామం లాగే డెకాయిట్ సైతం మృణాల్ కెరీర్లో మైల్స్టోన్ మూవీగా నిలుస్తుందని సుమంత్ ధీమా వ్యక్తం చేశాడు.
ఇక తన చెల్లెలు సుప్రియ గురించి మాట్లాడుతూ.. ఆమెను అందరూ వైలెంట్ ప్రొడ్యూసర్ అనుకుంటారని.. కానీ అది నిజం కాదని, ఆమె మనసు వెన్న అని సుమంత్ పేర్కొన్నాడు. డెకాయిట్ ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే.
This post was last modified on April 8, 2026 9:30 am
అది ఢిల్లీ హైకోర్టు. ప్రధాన న్యాయమూర్తి ఓ కేసు విచారణను ఆన్లైన్లో ప్రారంభించారు. కొన్ని నిమిషాలు జరిగాయి. వర్చువల్ విచారణలో…
టీడీపీ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం ఘనంగా జరిగింది. ఇటీవల పార్టీలో జాతీయ, రాష్ట్ర స్థాయి కార్యవర్గాలతోపాటు.. పొలిట్ బ్యూరోను…
మెగా ఫ్యాన్స్ కళ్ళలో ఒత్తులు వేసుకుని ఎదురు చూస్తున్న శుభ వార్త పెద్ది విడుదల తేది. ఏప్రిల్ 30 నుంచి…
కేరళంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సుదీర్ఘ విరామం తర్వాత.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తోందా? అంటే.. ఔననే అంటు న్నాయి……
ఈశాన్య రాష్ట్రం అస్సాంలో బీజేపీ తన పట్టును వరుసగా మూడో సారి కూడా నిలబెట్టుకుంటోందని సర్వే సంస్థలు తేల్చి చెప్పాయి.…
దీదీనా-మోదీనా నినాదంతో జరిగిన పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల పోటీలో మోదీదే పైచేయి అని బీజేపీనే విజయం దక్కించు కుంటుందని…