బాలీవుడ్ భామ మృణాల్ ఠాకూర్ తన కెరీర్లో ఎన్ని సినిమాలైనా చేయనీ.. సీతారామం చిత్రంలో ఆమె పోషించిన సీతామాలక్ష్మి పాత్ర మాత్రం చాలా చాలా స్పెషల్. అదొక కల్పిత పాత్ర అయినా.. ఆమె సినిమాలో మాత్రమే సీతామాలక్ష్మి అయినా.. నిజంగా అలాంటి ఓ అమ్మాయి ఉన్నట్లు, రామ్ దూరం కావడంతో ఆమెకు తీవ్ర అన్యాయం జరిగినట్లు ఫీలైపోతుంటారు జనం.లె
జెండరీ డైరెక్టర్ రాఘవేంద్రరావు సైతం.. ఒక సందర్భంలో రామ్, సీత దూరం కావడం గురించి బాధ పడుతూ, ఈ సినిమాకు సీక్వెల్ తీసి ఇద్దరినీ కలిపేయండని ఈ చిత్ర బృందాన్ని కోరడం గమనార్హం. తాజాగా సీతారామంలో ఆర్మీ మేజర్ విష్ణు శర్మగా కీలక పాత్ర చేసిన సుమంత్.. ఆ సినిమాలో సీతామాలక్ష్మికి చేసిన అన్యాయానికి గాను మృణాల్ ఠాకూర్కు స్టేజ్ మీది నుంచి సారీ చెప్పాడు. మృణాల్ కథానాయికగా నటించిన డెకాయిట్ సినిమా ప్రి రిలీజ్ ఈవెంట్కు అతిథిగా వచ్చిన సుమంత్.. సీతారామం ప్రస్తావన తెచ్చాడు.
ఆ సినిమాలో రామ్ను దూరం చేసినందుకు గాను తాను సీతకు క్షమాపణలు చెప్పానని.. ఆ నేపథ్యంలో ఒక సన్నివేశం తీశారని.. కానీ ఎడిటింగ్లో భాగంగా, తప్పనిసరి పరిస్థితుల్లో ఆ సన్నివేశం తీసేశారని సుమంత్ వెల్లడించాడు. కాబట్టి ఆ సినిమాలో సీతకు క్షమాపణలు చెప్పలేకపోయినందుకు.. ఇప్పుడు ఈ స్టేజ్ మీది నుంచి సీతకు మనస్ఫూర్తిగా సారీ చెబుతున్నానని సుమంత్ వ్యాఖ్యానించాడు.
అంతే కాక.. సీతారామంలో చేసిన అన్యాయానికి బదులుగా తన చెల్లెలు సుప్రియ ప్రొడ్యూస్ చేసిన డెకాయిట్ మూవీలో మృణాల్కు అవకాశం ఇప్పించానని కూడా సుమంత్ వ్యాఖ్యానించాడు. సీతారామం లాగే డెకాయిట్ సైతం మృణాల్ కెరీర్లో మైల్స్టోన్ మూవీగా నిలుస్తుందని సుమంత్ ధీమా వ్యక్తం చేశాడు.
ఇక తన చెల్లెలు సుప్రియ గురించి మాట్లాడుతూ.. ఆమెను అందరూ వైలెంట్ ప్రొడ్యూసర్ అనుకుంటారని.. కానీ అది నిజం కాదని, ఆమె మనసు వెన్న అని సుమంత్ పేర్కొన్నాడు. డెకాయిట్ ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే.
This post was last modified on April 8, 2026 9:30 am
ఒక సినిమా రిలీజైన రెండు మూడేళ్ల తర్వాత కూడా దాని కలెక్షన్ల గురించి విపరీతమైన చర్చ జరగడం అరుదు. ‘దేవర’ విషయంలో ఇదే…
అక్కినేని యువ కథానాయకుడు అఖిల్ హీరోగా స్టార్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి రూపొందించిన ‘ఏజెంట్’ టాలీవుడ్ చరిత్రలోనే అతి పెద్ద…
కేంద్ర విద్యా శాఖకు నూతన మంత్రిగా బీజేపీ సీనియర్ నేత, కేంద్ర కేబినెట్ లో కీలక శాఖల మంత్రిగా కొనసాగుతున్న ప్రహ్లాద్ జోషి నియమితులయ్యారు.…
బాక్సాఫీస్ దగ్గర పోటీ ఉన్నప్పుడు కొన్ని ఆసక్తికరమైన పరిణామాలు జరుగుతాయి. ఇది అలాంటిదే. కేవలం ఒక్క రోజు గ్యాప్ తో…
ప్రపంచవ్యాప్తంగా కోట్లాది అభిమానులను సొంతం చేసుకున్న స్పైడర్ మ్యాన్ సిరీస్ లోని కొత్త సినిమా బ్రాండ్ న్యూ డే జూలై…
ఏపీ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్ కొత్త లాజిక్ మాట్లాడుతున్నారు. నైతిక బాధ్యత వహిస్తూ…