బాలీవుడ్ భామ మృణాల్ ఠాకూర్ తన కెరీర్లో ఎన్ని సినిమాలైనా చేయనీ.. సీతారామం చిత్రంలో ఆమె పోషించిన సీతామాలక్ష్మి పాత్ర మాత్రం చాలా చాలా స్పెషల్. అదొక కల్పిత పాత్ర అయినా.. ఆమె సినిమాలో మాత్రమే సీతామాలక్ష్మి అయినా.. నిజంగా అలాంటి ఓ అమ్మాయి ఉన్నట్లు, రామ్ దూరం కావడంతో ఆమెకు తీవ్ర అన్యాయం జరిగినట్లు ఫీలైపోతుంటారు జనం.లె
జెండరీ డైరెక్టర్ రాఘవేంద్రరావు సైతం.. ఒక సందర్భంలో రామ్, సీత దూరం కావడం గురించి బాధ పడుతూ, ఈ సినిమాకు సీక్వెల్ తీసి ఇద్దరినీ కలిపేయండని ఈ చిత్ర బృందాన్ని కోరడం గమనార్హం. తాజాగా సీతారామంలో ఆర్మీ మేజర్ విష్ణు శర్మగా కీలక పాత్ర చేసిన సుమంత్.. ఆ సినిమాలో సీతామాలక్ష్మికి చేసిన అన్యాయానికి గాను మృణాల్ ఠాకూర్కు స్టేజ్ మీది నుంచి సారీ చెప్పాడు. మృణాల్ కథానాయికగా నటించిన డెకాయిట్ సినిమా ప్రి రిలీజ్ ఈవెంట్కు అతిథిగా వచ్చిన సుమంత్.. సీతారామం ప్రస్తావన తెచ్చాడు.
ఆ సినిమాలో రామ్ను దూరం చేసినందుకు గాను తాను సీతకు క్షమాపణలు చెప్పానని.. ఆ నేపథ్యంలో ఒక సన్నివేశం తీశారని.. కానీ ఎడిటింగ్లో భాగంగా, తప్పనిసరి పరిస్థితుల్లో ఆ సన్నివేశం తీసేశారని సుమంత్ వెల్లడించాడు. కాబట్టి ఆ సినిమాలో సీతకు క్షమాపణలు చెప్పలేకపోయినందుకు.. ఇప్పుడు ఈ స్టేజ్ మీది నుంచి సీతకు మనస్ఫూర్తిగా సారీ చెబుతున్నానని సుమంత్ వ్యాఖ్యానించాడు.
అంతే కాక.. సీతారామంలో చేసిన అన్యాయానికి బదులుగా తన చెల్లెలు సుప్రియ ప్రొడ్యూస్ చేసిన డెకాయిట్ మూవీలో మృణాల్కు అవకాశం ఇప్పించానని కూడా సుమంత్ వ్యాఖ్యానించాడు. సీతారామం లాగే డెకాయిట్ సైతం మృణాల్ కెరీర్లో మైల్స్టోన్ మూవీగా నిలుస్తుందని సుమంత్ ధీమా వ్యక్తం చేశాడు.
ఇక తన చెల్లెలు సుప్రియ గురించి మాట్లాడుతూ.. ఆమెను అందరూ వైలెంట్ ప్రొడ్యూసర్ అనుకుంటారని.. కానీ అది నిజం కాదని, ఆమె మనసు వెన్న అని సుమంత్ పేర్కొన్నాడు. డెకాయిట్ ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే.
This post was last modified on April 8, 2026 9:30 am
సీఎం రేవంత్ రెడ్డిపై మంత్రి కొండా సురేఖ తనయురాలు కొండా సుష్మిత చేసిన కామెంట్లు తెలంగాణ రాజకీయాల్లో వేడి రాజేశాయి.…
ఇప్పటికే పైరసీని ఎలా అణచాలో అర్థం కాక నిర్మాతలు తలలు పట్టుకోవడం చూస్తున్నాం. టెక్నాలజీ ఇంత అభివుద్ది చెందిన తర్వాత…
కరుప్పు / వీరభద్రుడు, విశ్వనాథ్ అండ్ సన్స్ విజయాలతో సూర్య మంచి ఊపు మీద ఉన్నాడు. గత కొన్నేళ్లుగా సరైన…
ఫ్యాన్ బేసులకు అతీతంగా అందరు హీరోల అభిమానులు అధిక శాతం ఇష్టపడే హీరో రవితేజ. ఆరు పదుల వయసుకు దగ్గరగా…
స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కార్యకర్తలు, నాయకులకు కీలక…
తిరుమల అటవీ ప్రాంతాల్లో వన్యప్రాణుల కదలికలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించడంతోపాటు, భక్తుల భద్రతను మరింత పటిష్టం చేసేందుకు టీటీడీ ఆధునిక సాంకేతిక…