మొన్న శుక్రవారం తమిళంతో పాటు తెలుగులో కూడా లీడర్ అనే సినిమా రిలీజయ్యింది. బైకర్, రాకాస హడావిడిలో మనోళ్లు పట్టించుకోలేదు కానీ ఇంకా థియేటర్లలో ఆడుతోందంటే ఆశ్చర్యమనిపించినా ఇది నిజం. తమిళనాడు వ్యాపారవేత్త శరవణన్ హీరోగా నటించిన ఈ యాక్షన్ డ్రామాకు మూడు రోజుల్లో పాతిక కోట్ల వసూళ్లు వచ్చాయని నిర్మాతలు అధికారికంగా ప్రకటించడం చూసి మీడియా నివ్వెరపోయింది. ఎందుకంటే ఇవి ఒక టయర్ 2 హీరో హిట్ మూవీకి వచ్చే కలెక్షన్లు.
కోలీవుడ్ ట్రేడ్ ప్రకారం లీడర్ వీకెండ్ వరకు వసూలు చేసిన సొమ్ము అయిదు కోట్లలోపేనట. సరే పాతిక కోట్లు వేస్తే వేసుకున్నారు కానీ ఇంకో పెద్ద కామెడీ ఏంటంటే త్వరలో వంద కోట్ల క్లబ్బులోకి అడుగు పెట్టబోతున్నట్టు అందులోనే పేర్కొనడం. సెటైరిక్ గా ఇలా నెంబర్ వేసుకున్నారా లేక నిజంగా వచ్చాయనే భ్రమలో ఉన్నారా అనే దాని మీద చెన్నై వర్గాల్లో చర్చ జరుగుతోంది. రజినీకాంత్ జైలర్ రేంజ్ లో దీనికి టీజర్ కట్ చేసినప్పటి నుంచే ట్రోలింగ్ మొదలయ్యింది.
విచిత్రం ఏమిటంటే లీడర్ తెలుగు వెర్షన్ ని మేకర్స్ అస్సలు పట్టించుకోకపోవడం. కనీస ప్రమోషన్లు చేయలేదు. అసలు వస్తున్న సంగతే ప్రేక్షకులకు రిజిస్టర్ కాలేదు. పాయల్ రాజ్ పుత్, కిక్ శ్యాం, లాల్, వీటి గణేష్, కాలకేయ ప్రభాకర్ లాంటి మనకు పరిచయమున్న ఆరిస్టులు ఉన్నా సరే వాళ్ళను కూడా పబ్లిసిటీలో భాగం చేయలేదు. దీంతో లీడర్ కాస్తా బ్లండర్ గా మారిపోయి త్వరగా థియేటర్ల నుంచి మాయమైపోయేలా ఉంది. దొరై సెంథిల్ కుమార్ దీనికి దర్శకత్వం వహించారు.
ఇంత జరిగిన తర్వాత లీడర్ కథేంటో తెలుసుకోవాలనే ఆసక్తి ఉంటుందిగా. ఒక మెకానిక్ షెడ్ లో డ్రైవర్ గా పని చేసే హీరో గతంలో రా ఏజెంట్ గా గొప్ప పనులు చేసుంటాడు. వాటిలో భార్యనే హత్య చేసిన సూపర్ ట్విస్టు కూడా ఉంటుంది. తర్వాత కూతుర్ని తీసుకొచ్చి వేరే చోట ప్రశాంతంగా బ్రతుకుతూ ఉంటాడు. అయినా విలన్ వల్ల మళ్ళీ బయటికి రావాల్సి వస్తుంది. దేశాన్ని భగ్నం చేసే వాళ్ళ కుట్రలను ఛేదించే క్రమంలో వచ్చే ట్విస్టులను తెరమీద చూసి ధరించాలి. పాతిక కోట్ల సినిమానా మజాకా.
ఇప్పటి వరకు ఒక లెక్క.. ఇక నుంచి మరో లెక్క.. అన్నట్టుగా వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ పరిస్థితి…
పెద్ది మొదటి వారం పూర్తి చేసుకుని సెకండ్ వీక్ లో అడుగు పెట్టింది. మూడు వందల యాభై కోట్ల వైపు…
ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తన పేరు వెనుక ఉన్న ఆసక్తికరమైన కథను వెల్లడించారు. జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో…
పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం నేపథ్యంలో ఇందన పొదుపు దిశగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కీలక సూచనలు చేశాక… మన…
ఏపీ ప్రభుత్వ పాఠశాలల్లో ప్రముఖ ప్రవచ కర్త చాగంటి కోటేశ్వరరావు ప్రసంగాలను పాఠ్యాంశాలుగా ప్రవేశ పెడుతున్నట్టు ప్రకటించింది. దీనికి సంబంధించి…
ఒక విడాకుల కేసుకు సంబంధించి కోర్టు ఇచ్చిన తీర్పుపై ఇప్పుడు పెద్ద ఎత్తున డిబేట్ జరుగుతోంది. సోషల్ మీడియాలో దీనిపై…