వరస బ్లాక్ బస్టర్లతో విజయాలను వదలని విక్రమార్కుడిలా దూసుకుపోతున్న దర్శకుడు అనిల్ రావిపూడి నెక్స్ట్ వెంకటేష్ – కళ్యాణ్ రామ్ కాంబినేషన్ లో కొత్త సినిమా మొదలుపెట్టనున్న సంగతి తెలిసిందే. రెగ్యులర్ షూటింగ్ ఇంకా పూర్తి స్థాయిలో స్టార్ట్ కాక ముందే బిజినెస్ వర్గాల్లో హాట్ కేక్ గా మారిపోయింది. ప్యాన్ ఇండియా మూవీసే ఓటిటి అమ్మకాల కోసం కిందా మీద పడుతుంటే వెంకీ అనిల్ 5 కాంబో ఆల్రెడీ క్రేజీ ధరకు సోల్డవుట్ అయిపోయిందని డిజిటల్ వర్గాల కథనం.
దీన్నలా ఉంచితే అనిల్ రావిపూడి త్వరలో ఒక యానిమేషన్ మూవీ హ్యాండిల్ చేయబోతున్నాడనే లీక్ కొద్దివారాల క్రితం బయటికి వచ్చిన సంగతి తెలిసిందే. జన నాయకుడు, టాక్సిక్ నిర్మాణ సంస్థ కెవిఎన్ ప్రొడక్షన్స్ తీయబోతున్న ఈ గ్రాండియర్ బ్యాక్ డ్రాప్ ఏంటనేది ఇప్పటిదాకా బయటికి రాలేదు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఇది రామాయణలోని ఒక ముఖ్యమైన ఘట్టం లేదా ఆ ఎపిక్ మీద ఆధారపడి రూపొందేలా ఉంటుందట. అదేంటనేది మాత్రం సస్పెన్స.
అధికారిక ప్రకటన లేదు కాబట్టి దీనికి సంబంధించి ఇంతకన్నా వివరాలు ప్రస్తుతానికి లేవు. అయితే కామెడీ పండించడంలో సిద్ధహస్తుడైన అనిల్ రావిపూడి ఇలాంటి పురాణాలను ఎలా హ్యాండిల్ చేస్తాడనే అనుమానం రావడం సహజం. దానికి సమాధానం దొరకాలంటే ఇంకొంత కాలం వెయిట్ చేయాలి. మహావతార్ నరసింహ బ్లాక్ బస్టర్ తర్వాత యానిమేషన్ కంటెంట్ మీద దర్శక నిర్మాతల ఫోకస్ పెరిగింది. ఇది కూడా అందులో భాగమే అనుకోవాలి.
అయినా ఒక జానర్ కే కట్టుబడకూండా ఇలాంటి ప్రయోగాలు చేయడం అనిల్ కు అవసరమే. ఆ మాటకొస్తే పటాస్ నుంచే మాస్ ఎలిమెంట్స్ తన పట్టు చూపిస్తూ వచ్చిన రావిపూడికి సీరియస్ డ్రామాలు కూడా నడిపించడం వచ్చని తెలియడం మంచిదే. పైగా హాస్యానికి మాత్రమే ఫిక్స్ అయితే మార్కెట్ తెలుగు రాష్ట్రాలు దాటి బయటికి పోదు. అనిల్ ఇన్ని సూపర్ హిట్లు కొట్టినా అవేవి హిందీలో రీమేక్ కాలేదు. సో నార్త్ మార్కెట్ టార్గెట్ చేయాలంటే ఇలాంటి ఎక్స్ పరిమెంట్లు కావాలి.
This post was last modified on April 6, 2026 9:05 pm
ఏపీలో కీలక ఘట్టానికి కూటమి ప్రభుత్వం తెరదీయనుంది. `గూగుల్ డేటా` కేంద్రానికి కొబ్బరికాయ కొట్టేందుకు సిద్ధమైంది. గత ఏడాది ఈ…
రంగబలి తర్వాత నాగశౌర్య తెరమీద కనిపించి రెండేళ్లు దాటిపోయింది. వరస డిజాస్టర్లతో మార్కెట్ డ్యామేజ్ అయిన టైంలో సరైన కంబ్యాక్…
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను గెలిపించుకున్న పిఠాపురం ప్రజలు... ఇప్పుడు అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నారు. నియోజకవర్గంలోని దాదాపుగా అన్ని…
టాలీవుడ్లో పెద్ద కుటుంబాల నుంచి వచ్చిన యువ కథానాయకుల్లో అత్యంత ఆడంబరంగా జరిగిన అరంగేట్రం అక్కినేని నాగచైతన్యదే అని చెప్పొచ్చు. టాలీవుడ్లో నంబర్…
తమిళనాడులోని:సాతాంకుళం లాకప్ డెత్ కేసులో మదురైలోని ఫస్ట్ అడిషనల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. 2020లో…
నాగరిక సమాజంలో మర్యాద అన్నది ప్రాథమికం. నిత్యం నాగరిత గురించి భారీ ఎత్తున లెక్చర్లు ఇచ్చే అమెరికన్ల తీరుకు భిన్నంగా…