వరస బ్లాక్ బస్టర్లతో విజయాలను వదలని విక్రమార్కుడిలా దూసుకుపోతున్న దర్శకుడు అనిల్ రావిపూడి నెక్స్ట్ వెంకటేష్ – కళ్యాణ్ రామ్ కాంబినేషన్ లో కొత్త సినిమా మొదలుపెట్టనున్న సంగతి తెలిసిందే. రెగ్యులర్ షూటింగ్ ఇంకా పూర్తి స్థాయిలో స్టార్ట్ కాక ముందే బిజినెస్ వర్గాల్లో హాట్ కేక్ గా మారిపోయింది. ప్యాన్ ఇండియా మూవీసే ఓటిటి అమ్మకాల కోసం కిందా మీద పడుతుంటే వెంకీ అనిల్ 5 కాంబో ఆల్రెడీ క్రేజీ ధరకు సోల్డవుట్ అయిపోయిందని డిజిటల్ వర్గాల కథనం.
దీన్నలా ఉంచితే అనిల్ రావిపూడి త్వరలో ఒక యానిమేషన్ మూవీ హ్యాండిల్ చేయబోతున్నాడనే లీక్ కొద్దివారాల క్రితం బయటికి వచ్చిన సంగతి తెలిసిందే. జన నాయకుడు, టాక్సిక్ నిర్మాణ సంస్థ కెవిఎన్ ప్రొడక్షన్స్ తీయబోతున్న ఈ గ్రాండియర్ బ్యాక్ డ్రాప్ ఏంటనేది ఇప్పటిదాకా బయటికి రాలేదు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఇది రామాయణలోని ఒక ముఖ్యమైన ఘట్టం లేదా ఆ ఎపిక్ మీద ఆధారపడి రూపొందేలా ఉంటుందట. అదేంటనేది మాత్రం సస్పెన్స.
అధికారిక ప్రకటన లేదు కాబట్టి దీనికి సంబంధించి ఇంతకన్నా వివరాలు ప్రస్తుతానికి లేవు. అయితే కామెడీ పండించడంలో సిద్ధహస్తుడైన అనిల్ రావిపూడి ఇలాంటి పురాణాలను ఎలా హ్యాండిల్ చేస్తాడనే అనుమానం రావడం సహజం. దానికి సమాధానం దొరకాలంటే ఇంకొంత కాలం వెయిట్ చేయాలి. మహావతార్ నరసింహ బ్లాక్ బస్టర్ తర్వాత యానిమేషన్ కంటెంట్ మీద దర్శక నిర్మాతల ఫోకస్ పెరిగింది. ఇది కూడా అందులో భాగమే అనుకోవాలి.
అయినా ఒక జానర్ కే కట్టుబడకూండా ఇలాంటి ప్రయోగాలు చేయడం అనిల్ కు అవసరమే. ఆ మాటకొస్తే పటాస్ నుంచే మాస్ ఎలిమెంట్స్ తన పట్టు చూపిస్తూ వచ్చిన రావిపూడికి సీరియస్ డ్రామాలు కూడా నడిపించడం వచ్చని తెలియడం మంచిదే. పైగా హాస్యానికి మాత్రమే ఫిక్స్ అయితే మార్కెట్ తెలుగు రాష్ట్రాలు దాటి బయటికి పోదు. అనిల్ ఇన్ని సూపర్ హిట్లు కొట్టినా అవేవి హిందీలో రీమేక్ కాలేదు. సో నార్త్ మార్కెట్ టార్గెట్ చేయాలంటే ఇలాంటి ఎక్స్ పరిమెంట్లు కావాలి.
This post was last modified on April 6, 2026 10:41 pm
ఏంటో జెన్ జీ ఆడియన్స్ మహా విచిత్రంగా ఉన్నారు. కొన్ని కొత్త సినిమాలను అస్సలు పట్టించుకోరు. కొన్ని రీ రిలీజులకేమో…
సినిమా నటులు ఎందరో రాజకీయ నాయకులయ్యారు. అయితే ప్రజల మనసులో బలమైన ముద్ర వేసిన వాళ్ళు మాత్రం కొందరే ఉంటారు.…
మూడ్ ఆఫ్ ది నేషన్ పేరుతో ఇండియా టుడే సీ ఓటర్ చేసిన సర్వే తమిళనాడు టీవీకే, కాంగ్రెస్ కాపురం…
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ( SIR ) చిక్కుముడిగా మారింది.…
కూటమిలో భాగస్వామి అయిన జనసేన పార్టీ ఎమ్మెల్యే పనితీరుపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అసంతృప్తి వ్యక్తం చేశారు. పనితీరు బాగోలేని…
ఏపీ వాసులకు బీపీ పెరిగిపోతుంది.. దాంతోపాటు మధుమేహ వ్యాధి కూడా..! రాష్ట్రంలో అసంక్రమిత వ్యాధులను ముందుగానే గుర్తించి సకాలంలో చికిత్స…