వరస బ్లాక్ బస్టర్లతో విజయాలను వదలని విక్రమార్కుడిలా దూసుకుపోతున్న దర్శకుడు అనిల్ రావిపూడి నెక్స్ట్ వెంకటేష్ – కళ్యాణ్ రామ్ కాంబినేషన్ లో కొత్త సినిమా మొదలుపెట్టనున్న సంగతి తెలిసిందే. రెగ్యులర్ షూటింగ్ ఇంకా పూర్తి స్థాయిలో స్టార్ట్ కాక ముందే బిజినెస్ వర్గాల్లో హాట్ కేక్ గా మారిపోయింది. ప్యాన్ ఇండియా మూవీసే ఓటిటి అమ్మకాల కోసం కిందా మీద పడుతుంటే వెంకీ అనిల్ 5 కాంబో ఆల్రెడీ క్రేజీ ధరకు సోల్డవుట్ అయిపోయిందని డిజిటల్ వర్గాల కథనం.
దీన్నలా ఉంచితే అనిల్ రావిపూడి త్వరలో ఒక యానిమేషన్ మూవీ హ్యాండిల్ చేయబోతున్నాడనే లీక్ కొద్దివారాల క్రితం బయటికి వచ్చిన సంగతి తెలిసిందే. జన నాయకుడు, టాక్సిక్ నిర్మాణ సంస్థ కెవిఎన్ ప్రొడక్షన్స్ తీయబోతున్న ఈ గ్రాండియర్ బ్యాక్ డ్రాప్ ఏంటనేది ఇప్పటిదాకా బయటికి రాలేదు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఇది రామాయణలోని ఒక ముఖ్యమైన ఘట్టం లేదా ఆ ఎపిక్ మీద ఆధారపడి రూపొందేలా ఉంటుందట. అదేంటనేది మాత్రం సస్పెన్స.
అధికారిక ప్రకటన లేదు కాబట్టి దీనికి సంబంధించి ఇంతకన్నా వివరాలు ప్రస్తుతానికి లేవు. అయితే కామెడీ పండించడంలో సిద్ధహస్తుడైన అనిల్ రావిపూడి ఇలాంటి పురాణాలను ఎలా హ్యాండిల్ చేస్తాడనే అనుమానం రావడం సహజం. దానికి సమాధానం దొరకాలంటే ఇంకొంత కాలం వెయిట్ చేయాలి. మహావతార్ నరసింహ బ్లాక్ బస్టర్ తర్వాత యానిమేషన్ కంటెంట్ మీద దర్శక నిర్మాతల ఫోకస్ పెరిగింది. ఇది కూడా అందులో భాగమే అనుకోవాలి.
అయినా ఒక జానర్ కే కట్టుబడకూండా ఇలాంటి ప్రయోగాలు చేయడం అనిల్ కు అవసరమే. ఆ మాటకొస్తే పటాస్ నుంచే మాస్ ఎలిమెంట్స్ తన పట్టు చూపిస్తూ వచ్చిన రావిపూడికి సీరియస్ డ్రామాలు కూడా నడిపించడం వచ్చని తెలియడం మంచిదే. పైగా హాస్యానికి మాత్రమే ఫిక్స్ అయితే మార్కెట్ తెలుగు రాష్ట్రాలు దాటి బయటికి పోదు. అనిల్ ఇన్ని సూపర్ హిట్లు కొట్టినా అవేవి హిందీలో రీమేక్ కాలేదు. సో నార్త్ మార్కెట్ టార్గెట్ చేయాలంటే ఇలాంటి ఎక్స్ పరిమెంట్లు కావాలి.
దర్శకుడు పూరి జగన్నాథ్ కు ఒక స్టైల్ ఉంది. ఇడియట్ నుంచి ఇస్మార్ట్ శంకర్ వరకు దాన్ని గమనించవచ్చు. హీరోయిజంని…
ఆంధ్రుల హక్కు-విశాఖ ఉక్కు నినాదంతో ఊరూవాడలను ఏకం చేసిన ఉద్యమం నుంచి పుట్టిన విశాఖ ఉక్కు కర్మాగారం.. గత రెండు…
విడుదల తేదీ కోసం ఎదురు చూస్తున్న కొరియన్ కనకరాజుకి మోక్షం దొరికేసింది. ఆగస్ట్ 7 రిలీజ్ కు రంగం సిద్ధం…
గత వారం భారీ అంచనాల మధ్య ప్రేక్షెకుల ముందుకు వచ్చిన పెద్ది సినిమా తొలి వీకెండ్లో అంచనాలకు తగ్గట్లే భారీ…
జాతీయ పార్టీలు కాంగ్రెస్, బీజేపీల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంత పరిస్థితి. అలాంటిది కాంగ్రెస్ మంత్రితో బీజేపీ ఎంపీ భేటీ…
ఏపీలో కూటమి సర్కారు కొలువుదీరి రెండేల్లు అవుతోంది. మూడు పార్టీల కలయికతో ఏర్పడిన కూటమి… 2024 ఎన్నికల్లో అత్యంత కష్టతరమైన…