అనిల్ రావిపూడి సినిమాలో ఛాన్స్ అంటే తెలుగులో అంతకుమించిన బంపరాఫర్ లేదన్నట్లే. హిట్ మెషీన్గా పేరు తెచ్చుకున్న అనిల్.. ఇప్పటిదాకా అపజయం అన్నదే లేకుండా సాగిపోతున్నాడు. ఒక్క ‘ఎఫ్-3’ మాత్రమే ఓ మోస్తరు ఫలితంతో సరిపెట్టుకుంది కానీ.. ఇప్పటిదాకా అనిల్ తీసిన మిగతా సినిమాలన్నీ హిట్లు, సూపర్ హిట్లు, బ్లాక్బస్టర్లే. ఆయన సినిమాలో నటిస్తే ఒక సక్సెస్ జమ అయినట్లే.
అందులోనూ చాలా ఏళ్లుగా హిట్ అన్నదే లేక ఇబ్బంది పడుతున్న ఆర్టిస్టులకు అనిల్ ఛాన్స్ ఇస్తే వాళ్ల ఆనందానికి అవధులు ఉండవు. ఇప్పుడు కన్నడ భామ కృతి శెట్టి ఇదే ఆనందంలో ఉంది. విక్టరీ వెంకటేష్, నందమూరి కళ్యాణ్ రామ్ కలయికలో అనిల్ తీయబోతున్న కొత్త సినిమాలో కృతిని ఒక కథానాయికగా ఎంచుకున్నట్లు ఇంతకుముందే వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడా విషయం అధికారికం అయింది.
కృతి కథానాయికగా నటించిన తమిళ చిత్రం ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’ తెలుగు ప్రి రిలీజ్ ఈవెంట్కు అతిథిగా వచ్చిన అనిల్.. తన తర్వాతి చిత్రంలో కృతి నటించనున్న విషయాన్ని ధ్రువీకరించాడు. ప్రచారంలో ఉన్నట్లే కళ్యాణ్ రామ్కు జోడీగా కృతి కనిపించనున్నట్ల కూడా అనిల్ వెల్లడించాడు. దీంతో ఇక ఈ చిత్రంలో వెంకీ సరసన ఎవరన్నదే తేలాల్సి ఉంది. ఈ పాత్రకు కీర్తి సురేష్ పేరు వినిపిస్తున్న సంగతి తెలిసిందే.
తెలుగులో ‘ఉప్పెన’ లాంటి బ్లాక్ బస్టర్ మూవీతో కథానాయికగా పరిచయం అయి.. ఆ తర్వాత శ్యామ్ సింగరాయ్, బంగార్రాజు లాంటి సక్సెస్ ఫుల్ చిత్రాల్లో నటించిన కృతికి.. ఆపై వరుసగా ఫ్లాపులే ఎదురయ్యాయి. ఆమె ఫ్లాపుల పరంపర ఇప్పటికే అరడజనుకు చేరుకుంది.
‘ఎల్ఐకే’ అయినా హిట్ అందిస్తుందేమో అని ఆమె ఎదురు చూస్తోంది. వరుసగా రెండు సంక్రాంతి పండుగలకు ‘సంక్రాంతికి వస్తున్నాం’, ‘మన శంకర వరప్రసాద్ గారు’ చిత్రాలతో భారీ విజయాలందుకున్న అనిల్.. ఇప్పుడు తీయబోయే సినిమాతో మరోసారి సంక్రాంతినే టార్గెట్ చేయబోతున్నాడు.
This post was last modified on April 6, 2026 1:23 pm
రెండేళ్ల క్రితం 'ప్రేమలు' విడుదలైనప్పుడు అందులో హీరోకన్నా ఎక్కువ పేరు వచ్చింది మమిత బైజుకే. హుషారైన నటన, జెన్ జీని…
సినీ రంగంలో తమకు అవకాశాలు ఇచ్చిన వాళ్ల మీద కొందరు ఎంతో అభిమానం, కృతజ్ఞత చూపిస్తుంటారు. అందులో ఒక్కొక్కరు ఒక్కో…
చిన్న సినిమాలకు రిలీజ్ రోజు కంటే ఒకటి రెండు రోజుల ముందే పెయిడ్ ప్రిమియర్స్ ఎప్పట్నుంచో చూస్తున్నాం. ఐతే పెద్ద…
బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ(టీఎంసీ) అధినేత్రి మమతా బెనర్జీకి పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచార సమయంలో నిద్రలేదు.…
ప్రస్తుతం నైజామ్ సింగల్ స్క్రీన్లలో పర్సెంటెజ్ విధానం తీసుకురావడం గురించి టాలీవుడ్ ప్రొడ్యూసర్లు, డిస్ట్రిబ్యూటర్లు రెండుగా చీలిపోయిన సంగతి తెలిసిందే.…
తెలుగు సినిమా చరిత్రలో ఎంతోమంది దిగ్గజ దర్శకులున్నారు. వారిలో సింగీతం శ్రీనివాసరావుది ప్రత్యేకమైన శైలి. ఆయన చేసినన్ని ప్రయోగాలు ఇండియన్…