రామాయణ టీజర్ మీద సోషల్ మీడియాలో ఎంత నెగటివిటీ నడుస్తుందో తెలిసిందే. విజువల్స్ బాగానే ఉన్నప్పటికీ వాటి ప్రెజెంటేషన్, క్వాలిటీ మీద నెటిజెన్లు చాలా కంప్లయింట్స్ చేస్తున్నారు. దీనికి హృతిక్ రోషన్ స్పందిస్తూ ఇన్స్ టాలో సుదీర్ఘమైన మెసేజ్ పంచుకున్నాడు. విఎఫ్ఎక్స్ ని విమర్శించే ముందు దాని పట్ల కనీస అవగాహన ఉండాలని, కొన్ని వందల వేల మంది శ్రమతో కల్కి, బాహుబలి, రామాయణ లాంటి గ్రాండియర్స్ రూపొందుతాయాని వివరంగా చెప్పుకొచ్చాడు.
ఇదంతా బాగానే ఉంది కానీ హృతిక్ మిస్సవుతున్న కొన్ని పాయింట్లున్నాయి. మొదటిది ప్రేక్షకులకు టీమ్ ఎంత కష్టపడిందనేది ఎప్పుడూ అనవసరం. టికెట్ డబ్బులకు న్యాయం చేకూరిందా లేదాని మాత్రమే వాళ్ళు చూసుకుని దాన్నే అభిప్రాయం రూపంలో బయటికి చెబుతారు. నిర్మాత నమిత్ మల్హోత్రా చెప్పినట్టు నాలుగు వేల కోట్లతో రామాయణ రూపొందితే మతిపోయే స్థాయిలో కంటెంట్ కనిపించాలి. అప్పుడు జనాలు వద్దన్నా వాహ్ అంటూ పొగడ్తల వర్షం కురిపిస్తారు.
అంతెందుకు ఎప్పుడో ముప్పై సంవత్సరాల క్రితం వచ్చిన అమ్మోరులో గ్రాఫిక్స్ ఇప్పుడు చూసినా ఆశ్చర్యం కలిగిస్తాయి. అంజి ఫెయిల్ అయినా దాని క్లైమాక్స్ ఎపిసోడ్ ని తలదన్నేవి చాలా తక్కువగా వచ్చాయి. దేవి, అరుంధతిలో ప్రధాన పాత్ర పోషించింది విఎఫ్ఎక్సే. వందల కోట్ల బడ్జెట్ లు లేని టైంలోనే దర్శకుడు కోడి రామకృష్ణ ఈ అద్భుతాలను సృష్టించారు. ఈయనే త్రినేత్రం, అవతారం లాంటి డిజాస్టర్లు కూడా ఇచ్చారు. సో కంటెంట్, విఎఫెక్స్ రెండూ బ్యాలన్స్ అవ్వాల్సిందే.
సానుభూతితో ఎవరూ టికెట్లు కొనరు. అయ్యో ఇంత కష్టపడ్డారు కదాని ఆడియన్స్ థియేటర్లకు రారు. వాళ్ళను మెప్పించే అంశాలు ఏవో ఉన్నాయనే నమ్మకం కలిగినప్పుడు వర్షంలో గొడుగులు వేసుకుని మరీ టికెట్ల కోసం క్యూ కడతారు. ఇది చరిత్ర ఎన్నోసార్లు ఋజువు చేసింది. వార్ 2 గురించి నిజాయితీగా పూర్ విఎఫ్ఎక్స్ అని ఒప్పుకున్న హృతిక్ రోషన్ ఇప్పుడు రామాయణకు మద్దతు ఇవ్వడం మంచిదే కానీ ఇదే సపోర్ట్ ఆదిపురుష్ టైంలో ఎందుకు ఇవ్వలేదనే డౌట్ వస్తోంది.
తాను చేసే మాస్ మసాలా సినిమాల విషయంలో ఎవరెన్ని విమర్శలు చేసినా, పట్టించుకోకుండా చాలా ఏళ్ల పాటు అదే రూట్లో…
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) ఇంచార్జీ మీనాక్షి నటరాజన్ పోరాటం బరిలోకి దిగకుండానే ముగిసిపోయింది. కాంగ్రెస్ పార్టీ ఆమెకు…
కొన్నేళ్ల గ్యాప్ తర్వాత మొదలైన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొత్త ఇన్నింగ్స్లో అభిమానుల ఆకాంక్షలు, అంచనాలకు తగ్గ సినిమాలు…
ఈ రోజుల్లో సోషల్ మీడియా నెగెటివిటీ సినిమాలకు ఎంత నష్టం చేకూరుస్తుందో తెలిసిందే. ఫ్యాన్ వార్స్ తీవ్ర స్థాయికి చేరుకుని,…
ఐపీఎల్లో సిక్సర్ల సునామీతో అందరినీ ఆశ్చర్యపరిచిన 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ, ఇండియా A జట్టు తరఫున ఆడుతూ ఇప్పుడిప్పుడే…
ఏపీలో వెలుగు చూసిన మద్యం కుంభకోణం తవ్వుతున్న కొద్దీ సరికొత్త విషయాలు బయటకు వస్తున్నాయి. దాదాపుగా రూ.3 వేల కోట్లకు…