గత ఏడాది గేమ్ ఛేంజర్ విడుదల తేదీ ప్రకటించే సమయంలో విశ్వంభర కోసం లాక్ చేసుకున్న సంక్రాంతి డేట్ ని తమకు ఇచ్చినందుకు నిర్మాత దిల్ రాజు థాంక్స్ చెబుతూ ఒక చిన్న వీడియో చేశారు. ఫ్యాన్స్ నిజమేనేమో అనుకున్నారు. తీరా చూస్తే అసలు మెగా మూవీకి అప్పటికీ చాలా పనులు పెండింగ్ ఉన్నాయి. ఒక స్పెషల్ సాంగ్ షూట్ బ్యాలన్స్ ఉంది. ఇవన్నీ ఉండి కూడా ఏదో త్యాగం చేసినట్టు విశ్వంభరని వాడుకున్నారనే కామెంట్స్ సోషల్ మీడియాలో కనిపించాయి.
ట్విస్ట్ ఏంటంటే ఇది జరిగి పదిహేను నెలలు దాటేసినా విశ్వంభర రిలీజ్ డేట్ ఫిక్స్ కాలేదు. అచ్చం ఇదే తరహాలో మరో సంఘటన కనిపిస్తోంది. పెద్ది ఏప్రిల్ 30 వస్తుంది కాబట్టి లెనిన్ కి మే 26కి వాయిదా వేస్తున్నామని నిన్న అన్నపూర్ణ స్టూడియోస్, సితార ఎంటర్ టైన్మెంట్స్ ప్రకటించాయి. ఒకవేళ ఇదే నిజం అనుకుంటే ఇప్పుడు పెద్ది వాయిదా వార్తలు వస్తున్నాయి కాబట్టి లెనిన్ ని త్వరగా తీసుకురమ్మని అక్కినేని ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు.
అసలు విషయం ఏంటంటే లెనిన్ పనులు ఇంకా పూర్తి కాలేదు. ఆ కారణంగానే కొంచెం దూరం వెళ్లిపోయారు. పెద్దిని సాకుగా చూపించారు తప్పించి నిజం అది కాదనేది అఖిల్ అభిమానుల వాదన. మధ్యలో నాగవంశీని కొందరు కార్నర్ చేస్తున్న వైనం ఎక్స్ లో చూడొచ్చు. విపరీతమైన ఆలస్యానికి నోచుకున్న లెనిన్ ఇప్పుడు పెద్ది పోస్టు పోన్ వార్తల వల్ల చిక్కుల్లో పడిందనే చెప్పాలి. దీనికి ప్రొడక్షన్ హౌస్ ఏమంటుందో కానీ జనాల చర్చ గట్టిగానే ఉంది.
అర్థం కాని మ్యాటర్ ఏంటంటే గ్రాఫిక్స్ ఎక్కువగా డిమాండ్ చేయని పెద్ది, లెనిన్ లాంటివి కూడా ఇంత ఆలస్యానికి గురి రావడం. కారణాలు ఎన్ని ఉన్నా ఇలాంటి జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత దర్శక నిర్మాతలదే. ఫలానా డేట్ కి సినిమా చూస్తామని ఫ్యాన్స్ ఫిక్స్ అయినప్పుడు దాన్ని పదే పదే మారిస్తే వాళ్ళ ఆగ్రహానికి దారి తీస్తుంది. ఇలా జరగడంలో చరణ్, అఖిల్ ప్రమేయం ఉన్నా లేకపోయినా అభిమానులు మాత్రం కలవరపడుతున్నారు. అయినా టాలీవుడ్ లో ఇలాంటివి కొత్త కాదుగా.
This post was last modified on March 30, 2026 1:23 pm
కరణం బలరామకృష్ణమూర్తి.. రాజకీయ ఉద్ధండుడిగా పేరొందిన ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన నేత. కుమారుడు కరణం వెంకటేష్ను ఎమ్మెల్యేగా చూసుకోవాలన్న…
నియోజకవర్గాల పునర్విభజన అనూహ్య పరిణామాల నేపథ్యంలో అలా వెనక్కెళ్లిపోయింది. దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాలకు తీరని అన్యాయం అంటూ కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా…
బ్లాక్ బస్టర్ సినిమాల వెనుక కొన్ని వేల మంది కష్టం దాగి ఉంటుంది. కాకపోతే ప్రేక్షకులకది అనవసరం. థియేటర్ లో…
ప్రతి నెల ఒకటో తారీకు కోసం ఉద్యోగులు ఎదురు చూడడం సహజం. కారణం నెలంతా కష్టపడితే జీవితాలు అకౌంట్ లో…
తెలంగాణలో కొత్త పార్టీ పెట్టేందుకు రెడీ అయిన మాజీ సీఎం, బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్.. తనయ కవిత.. నిన్న…
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగిసింది. ఎన్నికల సంఘం నిబంధనల మేరకు మంగళవారం సాయంత్రం 5 గంటలకే అన్ని పార్టీలు..…