కేరళ నటి హనీ రోజ్ ఒక షాపింగ్ మాల్ ఓపెనింగ్ కోసం వెళ్ళినప్పుడు జరిగిన ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది. ఈ ఈవెంట్లో అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఆ సమయంలో నటితో సెల్ఫీ తీసుకోవాలనే ఉత్సాహంలో కొంతమంది వ్యక్తులు ఆమెకు చాలా దగ్గరగా వచ్చారు. ఒక వ్యక్తి ఆమెకు తెలియకుండానే నడుముపై చేయి వేశాడు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు ఇంటర్నెట్లో విపరీతంగా షేర్ అవుతోంది, దీనిపై నెటిజన్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఈ వీడియోలో హనీ రోజ్ ఆ సమయంలో పెద్దగా ఇబ్బంది పడినట్లు కనిపించలేదు. ఆమె చాలా ప్రశాంతంగా, చిరునవ్వుతోనే అక్కడి నుంచి వెళ్ళిపోయారు. కానీ, అభిమానం పేరుతో ఇలాంటి పనులు చేయడం చాలా తప్పు అని చాలామంది కామెంట్స్ చేస్తున్నారు. ఒక హీరోయిన్కు ప్రైవసీ, పర్సనల్ స్పేస్ అవసరమని గుర్తు చేస్తున్నారు. ఆమెకు అసౌకర్యం కలగకపోయినా, చుట్టూ ఉన్న మగవారు ఆమె శరీరాన్ని తాకడానికి ప్రయత్నించడం కరెక్ట్ కాదు.
హీరోయిన్లను ఈవెంట్లకు పిలిచినప్పుడు సరైన భద్రతా చర్యలు తీసుకోవడం చాలా ముఖ్యం. రద్దీగా ఉండే ప్రదేశాలలో బౌన్సర్లను ఏర్పాటు చేసినా, ఒక్కోసారి వారి నియంత్రణ కూడా కష్టమవుతుంది. అభిమానులు తమ ఇష్టమైన నటులను దగ్గరగా చూడాలనుకోవడం సహజమే. కానీ, ఆ ఉత్సాహంలో పరిధులు దాటి ప్రవర్తించడం సరికాదు. ఫోటోలు, సెల్ఫీల కోసం ఆరాటపడుతూ సెలబ్రిటీల పర్సనల్ స్పేస్ను గౌరవించకపోవడం చాలా తప్పు.
గతంలో కూడా ఇలాంటి సంఘటనలు చాలాసార్లు జరిగాయి. ఆ మధ్య ‘రాజా సాబ్’ ప్రమోషన్స్ సమయంలో హీరోయిన్ నిధి అగర్వాల్ ఒక మాల్కి వెళ్ళినప్పుడు ఫ్యాన్స్ ఆమెను అసభ్యంగా తాకడంతో తీవ్ర ఇబ్బంది పడ్డారు. ఇలాంటి ఘటనలు తరచూ జరుగుతుండటంతో మహిళా సెలబ్రిటీల భద్రత అంశం మరోసారి తెరపైకి వచ్చింది.
అభిమానం అనేది హద్దుల్లో ఉంటేనే అందం, లేదంటే అది ఇతరులకు ఇబ్బందిగా మారుతుందనే విషయాన్ని గ్రహించాలనే కామెంట్స్ వస్తున్నాయి. ఇక హనీ రోజ్ ఈ మధ్యకాలంలో షాపింగ్ మాల్స్ ఓపెనింగ్స్ లో తరచుగా పాల్గొంటున్నారు. సినిమాలు చేస్తోంది తక్కువే అయినా, సోషల్ మీడియాలో కూడా ఆమెకు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.
వైసీపీలో పొలిటికల్ అఫైర్స్ కమిటీ (పీసీఏ)ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. గత ఎన్నికల్లో పరాజయం తర్వాత.. జగన్.. పీఏసీకి…
రెండు వారాల క్రితం రణ్వీర్ సింగ్ ని మూడేళ్ళ పాటు బ్యాన్ చేస్తున్నట్టు ఫెడరేషన్ అఫ్ వెస్ట్రన్ సినీ ఎంప్లొయీస్…
పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఇంధనం, బంగారం దిగుమతులపై కేంద్ర ప్రభుత్వం భారీ స్థాయిలో విదేశీ మారకద్రవ్యాన్ని వెచ్చిస్తున్న విషయం…
అతిలోకసుందరిగా తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్న హీరోయిన్ శ్రీదేవి. కాలం చేసి సంవత్సరాలు గడుస్తున్నా ఆవిడ వేసిన…
అమరావతిలో పొట్టి శ్రీరాములు స్మృతి వనాన్ని సందర్శించిన అనంతరం జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కీలక…
పవన్ వ్యాఖ్యలపై అందరూ మాట్లాడేశారు.. ఇక మిగిలింది తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వంతే! రెండు రోజుల నుంచి తెలుగు…