స్థానిక ఎన్నికలకు మరో మూడు నాలుగు నెలలే ఉన్నాయి. ఎప్పుడో 2029లో జరిగే ఎన్నికలపై దృష్టి పెట్టిన వైసీపీ అధినేత జగన్.. స్థానికంలో విజయం పై మాత్రం పెద్దగా స్పందించడం లేదు. 2021లో జరిగిన స్థానిక ఎన్నికల్లో అప్పట్లో అధికారంలో ఉన్న కారణంగా వైసీపీ భారీ విజయం దక్కించుకుంది. కొన్నికొన్ని జిల్లాల్లోని కార్పొరేషన్లు, మునిసిపాలిటీల్లో అసలు వేరే పార్టీ నాయకులను నామినేషన్ కూడా వేయకుండా అడ్డుకున్నారన్న చర్చ ఉంది.
ఫలితంగా మెజారిటీ మునిసిపాలిటీలు, కార్పొరేషన్లు కూడా గుండుగుత్తగా వైసీపీకి చిక్కాయి. అయితే ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఒకవైపు టీడీపీ, జనసేన భారీ ఎత్తున స్థానిక ఎన్నికల్లో విజయం పై కసరత్తును ముమ్మరం చేశాయి. ఎట్టి పరిస్థితిలోనూ విజయం దక్కించుకుని తీరాలని నిర్ణయించాయి. తద్వారా విజయం తమ సొంతం అవుతుందని భావిస్తున్నాయి. ముఖ్యంగా కూటమి కట్టుబాటు విషయంలో మరింత గట్టిగా ముందుకు సాగుతున్నారు.
నాయకులు కలివిడిగా ఉండాల్సిందేనని.. ఎట్టి పరిస్థితిలోనూ స్థానిక ఎన్నికల్లో విజయం దక్కించుకుని తీరాలని కూడా చెబుతున్నారు. తద్వారా క్షేత్రస్థాయిలో వైసీపీకి గెలుపు అంత ఈజీ కాదన్నది స్పష్టమవుతోంది. పైగా పెట్టుబడులు, సంక్షేమం వంటి విషయాలపై ప్రజలకు అవగాహన పెంచడం ద్వారా కూటమికి సానుకూల పవనాలు వీచేలా కూడా చేస్తున్నారు. దీంతో విజయం పై ధీమాతోనే కూటమి పార్టీలు ఉన్నాయి.
ఈ నేపథ్యంలో స్థానికంలో వైసీపీ విజయం దక్కించుకోవాలంటే బలమైన పోరాటం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అంతేకాదు ప్రతి విషయాన్ని కూలంకషంగా చర్చించాల్సిన అవసరం ఉంది. నాయకులను బలోపేతం చేయడం, పార్టీలో అంతర్గత కుమ్ములాటలను తగ్గించడం, నాయకులను ఉత్తేజ పరచడం వంటివి పార్టీకి ఇప్పుడు తక్షణ అవసరాలుగా మారాయి. కానీ జగన్ మాత్రం వచ్చే సార్వత్రిక ఎన్నికలపైనే ఎక్కువగా దృష్టి పెట్టారు. మరి స్థానికంపై ఎప్పుడు ఆలోచన చేస్తారో చూడాలి.
This post was last modified on March 30, 2026 1:50 pm
టాక్సిక్ విడుదల వల్ల చాలా చోట్ల ఇరుముడి థియేటర్లు ఉన్నట్టుండి తగ్గిపోయాయి. ఇది ముందస్తుగా జరిగిన ఒప్పందంలో భాగమే అయినా…
టాక్సిక్ టాక్స్, రివ్యూస్ పక్కనపెడితే ఇవాళ ఈ సినిమాకు వచ్చిన ఓపెనింగ్స్, అడ్వాన్స్ బుకింగ్స్ ఒక విషయాన్ని స్పష్టం చేశాయి.…
మెగాస్టార్ చిరంజీవి ఒకప్పుడు లెక్కలేసుకుని సినిమాలు చేసేవారు. కానీ ఈ మధ్య ఆయన తీరు మారిపోయింది. ఇమేజ్ ఛట్రం నుంచి…
సందీప్ రెడ్డి వంగా.. ఏదైనా మాట్లాడితే ఆ మాటను చుట్టూ తిప్పే రకం కాదు. రోమాంచకం ట్రైలర్ ఈవెంట్లో స్పిరిట్,…
అమెరికా వెళ్లాలనుకునే వారికి షాకింగ్ న్యూస్. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అమెరికా ఎంబసీలు, కాన్సులేట్లలో వీసా అపాయింట్మెంట్లను తాత్కాలికంగా నిలిపివేసినట్లు తాజా…
సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కోదాడ మండలం ద్వారకుంట వద్ద ఆగి ఉన్న లారీని ప్రైవేట్ ట్రావెల్స్…