ఏజెంట్ డిజాస్టర్ దెబ్బకు చాలా కాలంగా అజ్ఞాతంలో ఉన్న దర్శకుడు సురేందర్ రెడ్డి తిరిగి బయటికి వచ్చేది పవన్ కళ్యాణ్ సినిమా మొదలైనప్పుడే. దాదాపు ఈ ప్రాజెక్టు కన్ఫర్మ్ అయినప్పటికీ షూటింగ్ స్టార్ట్ అయ్యేదాకా ఫ్యాన్స్ ఏదీ ఖరారుగా తీసుకోవడం లేదు. పవన్ గెటప్, గెడ్డం అన్నీ మార్చేసింది ఈ మూవీ కోసమేననేది ఫిలిం నగర్ వర్గాల్లో వినిపిస్తున్న టాక్. సూరికి ఇది గోల్డెన్ ఛాన్స్. వర్కౌట్ అయితే మళ్ళీ టయర్ 1 లిస్టులోకి వెళ్లిపోవచ్చు. అంత పేరు తెచ్చుకోవచ్చు.
అసలు మ్యాటర్ ఇది కాదు. సురేందర్ రెడ్డి మూడు రీ రిలీజులు ఏప్రిల్, మే నెలల్లో సందడి చేయబోతున్నాయి. ఏప్రిల్ 8 అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా ‘రేసు గుర్రం’ని పెద్ద ఎత్తున విడుదల చేస్తున్నారు. ఫ్యాన్స్ సెలబ్రేషన్స్ ఓ రేంజ్ లో ఉండబోతున్నాయి. హైదరాబాద్ భుజంగ థియేటర్ లో వెయ్యి కేజీల పేపర్లతో పాటు బాణాసంచా, డీజేలతో భారీ సందడి చేయబోతున్నారు. ఏపీ తెలంగాణలోని ఇతర రాష్ట్రాల్లోనూ ఇదే తరహా సంబరాలు ఉంటాయని టాక్.
మే 20 జూనియర్ ఎన్టీఆర్ బర్త్ డేకి ‘ఊసరవెల్లి’ రీ రిలీజ్ ఉంటుంది. అప్పట్లో ఇది అంచనాలు అందుకోలేక ఫ్లాప్ గా నిలిచింది. అయితే తారక్ పెర్ఫార్మన్స్, పాటలు తర్వాత రోజుల్లో దీన్నో డీసెంట్ వాచ్ గా మార్చేశాయి. ఆరెంజ్ తరహాలో ఇది కూడా వర్కౌట్ అవ్వొచ్చనే నమ్మకం ఫ్యాన్స్ లో ఉంది. మే 29 మహేష్ బాబు ‘అతిథి’ని దించుతున్నారు. ఇది ఏడాది కాలంగా వాయిదా పడుతూ ఫైనల్ గా మోక్షం దక్కించుకుంది. దీనికీ అభిమానుల హల్చల్ గట్టిగా ఉండనుంది.
సో రీ రిలీజ్ సౌండ్ అంతా సురేందర్ రెడ్డిదే ఉండబోతోందన్న మాట. ఇక్కడ ఆయన గుర్తించాల్సిన విషయం ఒకటుంది. ఇప్పటికీ తన మూవీస్ కి ఎంత ఫాలోయింగ్ ఉందనేది అర్థం చేసుకుంటే ఏజెంట్ లాంటివి రిపీట్ కావు. రవితేజ ‘కిక్’ ఇప్పటికీ మూవీ లవర్స్ కి హాట్ ఫేవరేట్. కళ్యాణ్ రామ్ కెరీర్ బెస్ట్ లో మొదటి స్థానం ‘అతనొక్కడే’ సినిమాదే. ‘అశోక్’కి సైతం కల్ట్ ఫాలోయింగ్ ఉంది. ‘సైరా’ కమర్షియల్ గా డీసెంట్ అయ్యింది. సో ఈ ట్రాక్ రికార్డుని మరింత బలపరుచుకునే బాధ్యత సూరి మీదే ఉంది.
This post was last modified on March 28, 2026 10:45 pm
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…
తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…