సంక్రాంతికి విడుదలైన ది రాజా సాబ్ పేరు వింటే చాలు ప్రభాస్ అభిమానులకు ఎక్కడ లేని కోపం వచ్చేస్తుంది. వీళ్ళ ట్రోలింగ్ దెబ్బకే దర్శకుడు మారుతీ, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఎస్కెఎన్ కొంత కాలం సోషల్ మీడియాకు దూరంగా ఉన్నారు. డిజాస్టర్లు అందరూ తీస్తారు కానీ రిలీజ్ కు ముందు వీళ్ళు చేసిన హంగామా అంచనాలను అమాంతం పెంచేయడం, వాటిని కనీసం సగం కూడా మ్యాచ్ చేయలేని స్థితిలో సినిమా డిజాస్టర్ కావడం ఊహించని పరిణామాలు. ఇదంతా గతం.
శ్రీరామనవమి సందర్భంగా మారుతీ తిరిగి రీ ఎంట్రీ ఇచ్చారు. కొత్త స్క్రిప్ట్ పనులు అయిపోయాయని, ప్రతిదీ నేర్చుకునే పాఠమని చెబుతూ త్వరలోనే షూటింగ్ మొదలుపెట్టబోతున్న సంకేతం పూజ రూపంలో ఇచ్చారు. హీరో తదితర వివరాలు ఏమీ చెప్పలేదు కానీ మెగా కాంపౌండ్ కథానాయకుడనే టాక్ అయితే బలంగా ఉంది. హ్యాపీ పొంగల్ టైటిల్ తో వేగంగా పూర్తి చేసి 2027 సంక్రాంతి బరిలో దింపి హిట్టు కొట్టి తానేంటో చూపించాలనేది మారుతీ ప్లానింగ్ గా కనిపిస్తోంది.
రాజా సాబ్ ఒకటే కాదు మారుతీ అంతకు ముందు ట్రాక్ రికార్డు కూడా ఏమంత ఆశాజనకంగా లేదు. గోపీచంద్ పక్కా కమర్షియల్ కనీసం యావరేజ్ కాలేదు. అంతకు ముందు సంతోష్ శోభన్ తో చేసిన మంచి రోజులు వచ్చాయి సైతం నిరాశపరిచింది. చివరి హిట్టు ఎనిమిదేళ్ల క్రితం 2019లో సాయి ధరమ్ తేజ్ ప్రతిరోజు పండగేతో దక్కింది. సో ఇప్పుడు సాలిడ్ హిట్టు చాలా అవసరం. ముఖ్యంగా రాజా సాబ్ తో పడిన ముద్ర పోవాలంటే చాలా కష్టపడాలి.
ఒకవేళ రాజా సాబ్ బ్లాక్ బస్టర్ అయ్యుంటే ఈపాటికి మారుతీ ప్యాన్ ఇండియా డైరెక్టర్ లిస్టులో చేరిపోయేవారు. కానీ ఛాన్స్ మిస్సయ్యింది. తప్పు ఎక్కడ జరిగింది అనేది పక్కనపెడితే బాధితుడు మాత్రం ఈయనే. ప్రభాస్ వేరే ప్రాజెక్టులతో బిజీ అయిపోయాడు. ఫ్యాన్స్ ఇంకో హిట్టు రాగానే పాతవి మర్చిపోతారు. కానీ మారుతీకి అలా కాదు. సాలిడ్ గా ప్రూవ్ చేయాలి. మళ్ళీ మంచి రోజులు వచ్చాయని నిరూపించాలి. మరి పొంగల్ తో అది సాధ్యమవుతుందేమో.
This post was last modified on March 27, 2026 9:21 pm
టాలీవుడ్ బాక్సాఫీస్ కు ఏప్రిల్ అంటే చాలా స్పెషల్. ఎందుకంటే చరిత్రలో చెప్పుకోదగిన ఎన్నో బ్లాక్ బస్టర్లు ఈ నెలలోనే…
కొన్ని కథలు ముగిసిపోవడాన్ని ప్రేక్షకులు అంతగా ఇష్టపడరు. వాటికి కొనసాగింపు ఉంటేనే బాగుంటుందని ఆశిస్తారు. వాటి మేకర్స్ కూడా ఆ…
దేవర పార్ట్ 2 ఉంటుందో లేదోననే అనుమానాలు ఇంకా కొనసాగుతుండగానే దర్శకుడు కొరటాల శివ బాలకృష్ణతో ఒక ప్రాజెక్టు లాక్…
తెలంగాణ అధికార పార్టీ కాంగ్రెస్లో వన్ మ్యాన్ `ఆర్మీ`గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కనిపిస్తున్నారు. గత ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి…
ఉత్తరాంధ్ర రాజకీయాల్లో ఒకప్పుడు దూకుడుగా ఉన్న వైసీపీ ఇప్పుడు పెద్దగా కనిపించడం లేదన్న టాక్ వినిపిస్తోంది. కీలక నాయకులు ఉన్నప్పటికీ..…
ఏపీ సీఎం చంద్రబాబుపై ప్రతిపక్ష(ప్రధాన కాదు) నాయకుడు, వైసీపీ అధినేత జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు రాష్ట్రంలో అన్యాయంగా…