2026 విడుదలైన కాబోతున్న ప్యాన్ ఇండియా మూవీస్ లో హైప్ అంతకంతా పెంచుకుంటూ పోవడమే తప్ప తగ్గించుకోలేకపోయిన సినిమా ఏదైనా ఉందంటే అది పెద్దినే. మొదటి టీజర్, రెండు పాటలు, తాజాగా రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా వదిలిన పెహల్వాన్ వీడియో ఒకదాన్ని మించి మరొకటి బ్లాక్ బస్టరయ్యాయి. ఒక్కసారి కూడా నెగిటివిటీ రాలేదు. యాంటీ ఫ్యాన్స్ కి దర్శకుడు బుచ్చిబాబు ఒక్క శాతం ఛాన్స్ ఇవ్వలేదు. అంత సాలిడ్ కంటెంట్ ఇచ్చాడు.
అసలు శంకర్ వల్లే కానిది బుచ్చిబాబుకు ఎలా సాధ్యమయ్యిందనే ప్రశ్న రావడం సహజం. ఇక్కడ గమనించాల్సిన ముఖ్యమైన పాయింట్ ఒకటుంది. అదే సాలిడ్ కంటెంట్. బుచ్చిబాబు ఆషామాషీ రెగ్యులర్ కథను రాసుకోలేదు. పల్లెటూరిలో రకరకాల ఆటలు ఆడే ఒక మాములు కూలీని హీరోగా మార్చి అతని మీద బలమైన బ్యాక్ గ్రౌండ్ సెట్ చేసుకున్నాడు. విలేజ్ నుంచి ఇంటర్నేషనల్ మైలేజ్ దాకా ఒక కుర్రాడి ప్రయాణం ఎలా జరిగిందనే దాని మీద అదిరిపోయే సబ్జెక్టు సిద్ధం చేసుకున్నాడు.
ఇంత మంచి కాన్వాస్ కి రామ్ చరణ్ లాంటి హీరో దొరికే సరికి ఎంత వాడుకోవాలో అంతకన్నా ఎక్కువే పిండేసుకున్నాడు. బయటికి వదలుతున్న ప్రతి విజువల్ ని ఆడియన్స్ ఇష్టపడేలా చేసుకున్నాడు. ఇంకా వేరే పాత్రలను రివీల్ చేయలేదు. జాన్వీర్ కపూర్, శివరాజ్ కుమార్, జగపతిబాబు, దివ్యెందు శర్మ క్యారెక్టర్లను వీడియో రూపంలో పరిచయం చేయలేదు. వాళ్లందరినీ ట్రైలర్ కట్ కోసం దాచి పెట్టాడు. అది బయటికి వచ్చాక ప్యాన్ ఇండియా బజ్ పెరుగుతుంది.
దీంట్లో క్రికెట్ ఒకటే కాదు రకరకాల గేమ్స్ ఉన్నాయని రివీల్ చేయడం ద్వారా ఆసక్తిని మరింత పెంచాడు బుచ్చిబాబు. సుకుమార్ శిష్యులు అంటే ఆయనలో సగం కాదు ఆయనకు డబుల్ అనే స్థాయిలో క్వాలిటీ ఇవ్వడం అయితే పెరుగుతోంది. ఇక అసలైన టాస్క్ ముందు ఉంది. ఐటెం సాంగ్ పూర్తి చేసి, రీ రికార్డింగ్, పోస్ట్ ప్రొడక్షన్ చూసుకుంటూనే ప్రమోషన్ల మీద దృష్టి పెట్టాలి. ఈ నెలా మినహాయిస్తే చేతిలో ఉన్న ముప్పై రోజులు చాలా కీలకంగా మారబోతున్నాయి.
పిల్లలు సంపద అని సీఎం చంద్రబాబు మరోసారి స్పష్టం చేశారు. తాను చెప్పిన మాటకే కట్టుబడి ఉన్నానని తెలిపారు. దీనిని…
వియత్నాంలో విహార యాత్రకు వెళ్లిన భారతీయుల కుటుంబాల్లో విషాదం నెలకొంది. ఊహించని ప్రమాదంలో చిక్కుకుని 15 మంది భారతీయులు మృతి…
తన సినిమాకు పని చేసిన టెక్నీషియన్ను ఒక నిర్మాత సైకోగా అభివర్ణించడం ఎప్పుడైనా చూశారా? సితార ఎంటర్టైన్మెంట్స్ అధినేత నాగవంశీ…
శుక్రవారం విడుదలైన లెనిన్ దూకుడు బాక్సాఫీస్ వద్ద కొనసాగుతోంది. తొలి రోజు పదమూడు కోట్లకు పైగా వసూలు చేసి శని…
ఏపీ రాజధాని అమరావతిలో శనివారం తెల్లవారు జాము నుంచి పోలీసులు అధికారులు పెద్ద ఎత్తున మోహరించారు. ఈ ప్రాంతంలో రాజధాని…
సంగీత ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురి చేస్తూ గాన కోకిల ఎస్ జానకి చివరి శ్వాస తీసుకున్నారు. గత కొంత కాలంగా…