2026 విడుదలైన కాబోతున్న ప్యాన్ ఇండియా మూవీస్ లో హైప్ అంతకంతా పెంచుకుంటూ పోవడమే తప్ప తగ్గించుకోలేకపోయిన సినిమా ఏదైనా ఉందంటే అది పెద్దినే. మొదటి టీజర్, రెండు పాటలు, తాజాగా రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా వదిలిన పెహల్వాన్ వీడియో ఒకదాన్ని మించి మరొకటి బ్లాక్ బస్టరయ్యాయి. ఒక్కసారి కూడా నెగిటివిటీ రాలేదు. యాంటీ ఫ్యాన్స్ కి దర్శకుడు బుచ్చిబాబు ఒక్క శాతం ఛాన్స్ ఇవ్వలేదు. అంత సాలిడ్ కంటెంట్ ఇచ్చాడు.
అసలు శంకర్ వల్లే కానిది బుచ్చిబాబుకు ఎలా సాధ్యమయ్యిందనే ప్రశ్న రావడం సహజం. ఇక్కడ గమనించాల్సిన ముఖ్యమైన పాయింట్ ఒకటుంది. అదే సాలిడ్ కంటెంట్. బుచ్చిబాబు ఆషామాషీ రెగ్యులర్ కథను రాసుకోలేదు. పల్లెటూరిలో రకరకాల ఆటలు ఆడే ఒక మాములు కూలీని హీరోగా మార్చి అతని మీద బలమైన బ్యాక్ గ్రౌండ్ సెట్ చేసుకున్నాడు. విలేజ్ నుంచి ఇంటర్నేషనల్ మైలేజ్ దాకా ఒక కుర్రాడి ప్రయాణం ఎలా జరిగిందనే దాని మీద అదిరిపోయే సబ్జెక్టు సిద్ధం చేసుకున్నాడు.
ఇంత మంచి కాన్వాస్ కి రామ్ చరణ్ లాంటి హీరో దొరికే సరికి ఎంత వాడుకోవాలో అంతకన్నా ఎక్కువే పిండేసుకున్నాడు. బయటికి వదలుతున్న ప్రతి విజువల్ ని ఆడియన్స్ ఇష్టపడేలా చేసుకున్నాడు. ఇంకా వేరే పాత్రలను రివీల్ చేయలేదు. జాన్వీర్ కపూర్, శివరాజ్ కుమార్, జగపతిబాబు, దివ్యెందు శర్మ క్యారెక్టర్లను వీడియో రూపంలో పరిచయం చేయలేదు. వాళ్లందరినీ ట్రైలర్ కట్ కోసం దాచి పెట్టాడు. అది బయటికి వచ్చాక ప్యాన్ ఇండియా బజ్ పెరుగుతుంది.
దీంట్లో క్రికెట్ ఒకటే కాదు రకరకాల గేమ్స్ ఉన్నాయని రివీల్ చేయడం ద్వారా ఆసక్తిని మరింత పెంచాడు బుచ్చిబాబు. సుకుమార్ శిష్యులు అంటే ఆయనలో సగం కాదు ఆయనకు డబుల్ అనే స్థాయిలో క్వాలిటీ ఇవ్వడం అయితే పెరుగుతోంది. ఇక అసలైన టాస్క్ ముందు ఉంది. ఐటెం సాంగ్ పూర్తి చేసి, రీ రికార్డింగ్, పోస్ట్ ప్రొడక్షన్ చూసుకుంటూనే ప్రమోషన్ల మీద దృష్టి పెట్టాలి. ఈ నెలా మినహాయిస్తే చేతిలో ఉన్న ముప్పై రోజులు చాలా కీలకంగా మారబోతున్నాయి.
This post was last modified on March 27, 2026 9:04 pm
నియోజకవర్గాల పునర్విభజన అనూహ్య పరిణామాల నేపథ్యంలో అలా వెనక్కెళ్లిపోయింది. దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాలకు తీరని అన్యాయం అంటూ కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా…
బ్లాక్ బస్టర్ సినిమాల వెనుక కొన్ని వేల మంది కష్టం దాగి ఉంటుంది. కాకపోతే ప్రేక్షకులకది అనవసరం. థియేటర్ లో…
ప్రతి నెల ఒకటో తారీకు కోసం ఉద్యోగులు ఎదురు చూడడం సహజం. కారణం నెలంతా కష్టపడితే జీవితాలు అకౌంట్ లో…
తెలంగాణలో కొత్త పార్టీ పెట్టేందుకు రెడీ అయిన మాజీ సీఎం, బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్.. తనయ కవిత.. నిన్న…
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగిసింది. ఎన్నికల సంఘం నిబంధనల మేరకు మంగళవారం సాయంత్రం 5 గంటలకే అన్ని పార్టీలు..…
ఈటీవీ విన్.. పోస్టర్ మీద ఈ లోగో ఉంటే చాలు.. అది సినిమా అయినా, వెబ్ సిరీస్ అయినా అందులో…