మెగా కుటుంబంలో అన్నదమ్ముల మధ్య ఉండే అనుబంధం గురించి కొత్తగా చెప్పక్కర్లేదు. చిరంజీవి అంటే తమ్ముళ్లు నాగబాబు, పవన్ కల్యాణ్ కు ఎంత గౌరవమో చాలా సందర్భాల్లో చూశాం. అయితే ఈ అనుబంధం కేవలం అన్నదమ్ముల మధ్యనే కాదు, ఆ ఇంటి కోడళ్లకు కూడా చిరు అంటే అంతే ఇష్టం అని లేటెస్ట్ గా పవన్ భార్య అన్నా కొణిదల పెట్టిన పోస్ట్ చూస్తే అర్ధమవుతుంది. నిన్ననే ఈ సోషల్ మీడియాలోకి వచ్చిన అన్నా మొదట భర్త పవన్ కళ్యాణ్ ఫొటో పోస్ట్ చేశారు. ఇప్పుడు అన్నయ్య అంటూ మెగా బ్రదర్స్ ఫొటోలను షేర్ చేయడం విశేషం.
ఇక దాదాపు పదిహేనేళ్ల క్రితం ఈ కుటుంబంలోకి అడుగుపెట్టిన అన్నా.. మెగా బ్రదర్స్ తో తనకున్న బాండింగ్ గురించి సోషల్ మీడియాలో చాలా ఎమోషనల్ గా రాసుకొచ్చారు. తను ఈ ఫ్యామిలీలోకి వచ్చిన కొత్తలో ఎవరిని ఎలా పిలవాలో తెలియక తన భర్త పవన్ కల్యాణ్ నే అడిగి తెలుసుకున్నానని అన్నా పేర్కొన్నారు. పవన్ తన అన్నయ్యలను ఎలా పిలుస్తారో, తను కూడా అలాగే పిలవడం మొదలుపెట్టారట. చిరంజీవిని ‘అన్నయ్య’ అని, నాగబాబును ‘చిన్న అన్నయ్య’ అని పిలవడం అప్పట్లో మొదలైందని చెప్పుకొచ్చారు.
మొదట్లో ఏదో పిలవాలి కాబట్టి జాగ్రత్తగా పిలిచినా, కాలక్రమేణా ఆ పిలుపు వెనుక ఉన్న అర్థం తనకి అర్థమైందని, ఇప్పుడు అది కేవలం ఒక మాట మాత్రమే కాదు.. తన ఫీలింగ్ అని అన్నా ఎంతో అద్భుతంగా వివరించారు. నిజానికి వరుసల ప్రకారం చూస్తే చిరంజీవి అన్నాకు బావగారు అవుతారు. ఆ విషయం తనకు తర్వాత తెలిసినా కూడా తన మనసు మాత్రం బావగారు అని పిలవడానికి ఇష్టపడలేదని ఆమె తెలిపారు.
తనకు సొంత అన్నదమ్ములు లేరని, అందుకే జీవితం తనకు చిరంజీవి, నాగబాబు రూపంలో ఇద్దరు అన్నయ్యలను ప్రసాదించిందని ఆమె చాలా ఎమోషనల్ గా తన మనసులో మాటను బయటపెట్టారు. ఇన్ స్టాగ్రామ్ లో ఆమె షేర్ చేసిన ఫోటోలో చిరంజీవి ఎంతో ఆప్యాయంగా అన్నా బుగ్గలు నిమురుతూ ఉండగా, పక్కనే పవన్ నవ్వుతూ కనిపిస్తున్నారు.
ఈ ఫోటో చూస్తుంటే మెగా ఫ్యామిలీలో ఉండే ప్రేమాభిమానాలు ఎలా ఉంటాయో అర్థం చేసుకోవచ్చు. బయట పవన్ కల్యాణ్ పాలిటిక్స్ లో ఎంత బిజీగా ఉన్నా, ఫ్యామిలీ మ్యాటర్స్ వచ్చేసరికి అన్నదమ్ములంతా ఒకటిగానే ఉంటారు. అన్నా లెజినోవా పెట్టిన ఈ పోస్ట్ కి నెటిజన్లు కూడా ఫిదా అవుతున్నారు. ఒక విదేశీ వనిత అయి ఉండి కూడా మన తెలుగు ఇంటి సంస్కృతిని, అన్నయ్య అనే పిలుపులోని మాధుర్యాన్ని ఆమె అర్థం చేసుకున్న తీరును మెగా ఫ్యాన్స్ తెగ మెచ్చుకుంటున్నారు.
This post was last modified on March 26, 2026 3:03 pm
తిరువీర్ అంటే రెగ్యులర్ సినిమాలు చూసే ప్రేక్షకులకు సుపరిచితుడే కానీ సెలెక్టివ్ గా థియేటర్లకు వెళ్లే వాళ్లకు మాత్రం కొంచెం…
తెలుగు నేల విభజన తర్వాత రాజధాని లేకుండానే ఆంధ్ర ప్రదేశ్ తన ప్రస్థానాన్ని మొదలుపెట్టాల్సి వచ్చింది. ఓ వైపు రాజధాని లేమి,…
మార్కాపురం జిల్లాలో జరిగిన ఘోర బస్సు ప్రమాదం తీరని విషాదాన్ని మిగిల్చిన విషయం తెలిసిందే. అయితే ఇదే ప్రమాదంలో మరోవైపు…
పశ్చిమ ఆసియాలో యుద్ధం ముదురుతున్న కొద్దీ భారత్ తన ఇంధన అవసరాల కోసం వ్యూహాలను వేగవంతం చేస్తోంది. చమురు, గ్యాస్…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా ముందు అనుకున్న ప్రకారం అయితే ఈ గురువారం ప్రేక్షకుల ముందుకు రావాల్సింది. కానీ…
వందే భారత్ ఎక్స్ప్రెస్లో ప్రయాణికులకు అందించే భోజనం నాణ్యతపై మరోసారి పెద్ద వివాదం రాజుకుంది. పాట్నా నుంచి టాటానగర్ వెళ్లే…