ఇటీవల విడుదలైన ఉస్తాద్ భగత్ సింగ్ ఫలితం విషయంలో అభిమానులు ఎంత మాత్రం హ్యాపీగా లేరన్నది వాస్తవం. వింటేజ్ పవన్ కళ్యాణ్ ని చూపించారనే ఆనందం కొంతమేర ఉన్నా కమర్షియల్ గా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ప్రభావం చూపించలేకపోవడాన్ని వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇలా రొటీన్ కంటెంట్లతో నిరాశ పరచడం కన్నా సుదీర్ఘమైన బ్రేక్ తీసుకుని పూర్తిగా రాజకీయాల మీద దృష్టి పెట్టమని సలహాలు ఇచ్చేస్తున్నారు. కథల ఎంపికను తప్పుబడుతున్నారు.
ఇక్కడ ఫ్యాన్స్ అయినా మరెవరైనా మర్చిపోకూడని విషయాలు కొన్నున్నాయి. పవన్, మహేష్, ప్రభాస్ లాంటి హీరోల స్టార్ డమ్ మార్కెట్ క్యాలికులేషన్లకు అతీతంగా ఉంటుంది. ఒక్క బ్లాక్ బస్టర్ పడితే అరిచిన నోళ్లే పొగడ్తల వర్షం కురిపిస్తాయి. ఇది అర్థం కావాలంటే కొన్ని ఉదాహరణలు చూడాలి. 1990 టైంలో స్వర్గీయ ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో మూడు సినిమాలు ప్లాన్ చేసుకున్నారు. అవి బ్రహ్మర్షి విశ్వామిత్ర, సామ్రాట్ అశోక, శ్రీనాథ కవిసార్వభౌమ. అన్నీ డిజాస్టర్లే.
ఇంకేం ఎన్టీఆర్ ని జనం చూసేందుకు ఇష్టపడటం లేదని మీడియా తీర్పిచ్చింది. రకరకాల కథనాలు రాసింది. కట్ చేస్తే కేవలం నాలుగేళ్ల గ్యాప్ మేజర్ చంద్రకాంత్ రూపంలో అదిరిపోయే గొప్ప విజయాన్ని అందుకున్నారు. 1996 టైంలో చిరంజీవి ఫ్లాపుల మీద నెగటివ్ క్యాంపైన్ నడిచింది. హిట్లర్ తో కంబ్యాక్ అంటే ఏంటో చూపించారు. బాలయ్య చేసిన రూలర్, ఎన్టీఆర్ బయోపిక్స్ కనీసం బ్రేక్ ఈవెన్ కూడా చేరలేదు. తర్వాత అఖండ నుంచి బ్యాక్ టు బ్యాక్ నాలుగు బ్లాక్ బస్టర్స్ కొట్టేశారు.
ఇలాంటి ఫేజులు అందరు హీరోలు చవి చూశారు. పవన్ కు కొత్తేమీ కాదు. గబ్బర్ సింగ్ ముందు ఫ్లాపులే ఉన్నాయి. ఓజి ముందు హరిహర వీరమల్లు ఏం చేసిందో మర్చిపోలేదుగా. సో ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ వల్ల జరిగే డ్యామేజీ ఏమీ ఉండదు. రేపు సురేందర్ రెడ్డి కోరుకున్న హిట్ ఇస్తే ఇదే అభిమానులు వాహ్ అన్నా అంటారు. దేనికైనా టైం రావాలి. పార్టీ, ప్రజాసేవ కోసమే సినిమాలు చేయక తప్పని పవన్ కళ్యాణ్ ఎప్పటిలాగే కుదుపులకు భయపడకుండా రెండు పడవల ప్రయాణం చేయాల్సిందే.
This post was last modified on March 25, 2026 9:50 pm
లోక్ సభ, అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన ఖరారైన నేపథ్యంలో దేశంలోని అన్ని ప్రాంతాల ప్రజలు ఆయా పరిణామాలపై ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. ఈ…
నేటి తరం కుర్ర హీరోల్లో సంతోష్ శోభన్, సంగీత్ శోభన్ సోదరులకు ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది. అయితే వీరిద్దరి…
ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మార్కాపురం జిల్లాలోని రాయవరం సమీపంలో పలకల క్వారీల వద్ద ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు…
ఓ ముప్పై ఏళ్ళు వెనక్కు వెళ్తే చిరంజీవి, బాలకృష్ణ లాంటి స్టార్ల ప్రభంజనం ఉదృతంగా ఉన్న టైంలో తెలుగు భాష…
గత ఏడాది కుంభమేళాలో పూసలు అమ్ముకుంటూ సోషల్ మీడియా దృష్టిలో పడి వైరల్ అయిన మోనాలిసా.. ఇటీవల తాను ప్రేమించిన…
ప్రధాన మంత్రినరేంద్ర మోడీతో సీనియర్ నాయకురాలు, బీజేపీ ఏపీ మాజీ అధ్యక్షురాలు, ప్రస్తుత రాజమండ్రి ఎంపీ దగ్గుపాటి పురందేశ్వరి, వెంకటేశ్వరరావు…