భారత దేశంలో కులం, మతం వంటి విషయాలకు చాలా ప్రాధాన్యత ఉంటుంది. విద్య, ఉద్యోగం, సామాజిక హోదాలకు కులం, మతం ప్రాతిపదిక. అయితే, ఒక కులం నుంచి మరో కులంలోకి మారిన సందర్భంలో ఎదురయ్యే సమస్యల గురించి చాలాకాలంగా చర్చ జరుగుతోంది. ముఖ్యంగా క్రిస్టియానిటీలోకి మారిన షెడ్యూల్ కులాలకు చెందిన వ్యక్తులకు ఎస్సీలకు లభించే హక్కులు లభించడంపై చాలా ఏళ్లుగా పెద్ద చర్చ జరుగుతోంది. ఈ క్రమంలోనే ఆ వ్యవహారంపై సుప్రీం కోర్టు చరిత్రాత్మక తీర్పునిచ్చింది.
క్రిస్టియానిటీలోకి మారిన ఎస్సీలు ఎస్సీ హక్కులు పొందలేరని సుప్రీంకోర్టు సంచలన తీర్పునిచ్చింది. హిందూ, బౌద్ధం, సిక్కు మతాలకు కాకుండా ఇతర మతాల్లోకి మారిన వారు ఎస్సీ హక్కులు కోల్పోతారని దేశపు అత్యున్నత న్యాయస్థానం తేల్చి చెప్పింది. ఎస్సీలు క్రైస్తవ మతంలోకి మారితే ఎస్సీ హోదా రద్దవుతుందని స్పష్టం చేసింది. ఈ వ్యవహారంపై ఏపీ హైకోర్టు గతంలో ఇచ్చిన తీర్పును సుప్రీం కోర్టు సమర్థించింది. ఏపీ హైకోర్టు తీర్పుపై దాఖలైన పిటిషన్ ను విచారణ జరిపిన జస్టిస్ పీకే మిశ్రా, జస్టిస్ అంజరియా ధర్మాసనం సంచలన ఆదేశాలు జారీ చేసింది.
అదే సమయంలో మతం మారితే కుల సర్టిఫికెట్ రద్దు కాకపోయినా చట్టం వర్తించదని స్పష్టం చేసింది. సర్టిఫికెట్ ఉంది కనుక రక్షణ కల్పించలేమని క్లారిటీనిచ్చింది. పాస్టర్ ఆనంద్ పాల్ కేసు విచారణ సందర్భంగా సుప్రీం కోర్టు ఈ తీర్పునిచ్చింది. ఆనంద్ పాల్ దశాబ్దానికి పైగా క్రిస్టియన్ గా ఉన్నారని, తిరిగి ఎస్సీ కమ్యూనిటీలో చేరలేదని చెప్పింది. ఒకవేళ ఆయన ఎస్సీ కమ్యూనిటీలో తిరిగి చేరారని నిరూపిస్తే పాత హోదా సాధ్యం అవుతుందని తెలిపింది.
దశాబ్దానికి పైగా సమయం దాటిపోయినా అక్కినేని మూడో తరం వారసుడు అఖిల్ కు ఇంకా సాలిడ్ బ్లాక్ బస్టర్ పడలేదు.…
వైసీపీ ఏపీలో డీలా పడిన విషయం తెలిసిందే. గత 2024 ఎన్నికల వరకు 151 మంది ఎమ్మెల్యేలతో కళకళ లాడిన…
ఏది జరిగినా మంచికే అని పెద్దలు ఊరికే అనలేదు. సమంతకు ఇది ప్రత్యక్షంగా అనుభవంలోకి వస్తోంది. ఖుషి తర్వాత బాగా…
హీరోలు నిర్మాతలు కావడం కొత్తేమి కాదు. చిరంజీవి పీక్స్ లో ఉన్నప్పుడే అంజనా ప్రొడక్షన్స్ స్థాపించారు. కార్డు నాగబాబు పేరు…
వినుకొండ మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత బొల్లా బ్రహ్మనాయుడుపై భూకబ్జా ఆరోపణలు వచ్చిన వైనం ఇరు తెలుగు రాష్ట్రాలలో సంచలనం…
వైసీపీ అధినేత జగన్పై ఇప్పటికే ఆదాయానికి మించిన ఆస్తుల కేసు ఉంది. వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్య మంత్రిగా ఉన్న సమయంలో…