‘దురంధర్: ది రివెంజ్’ సినిమా రిలీజైనపుడు ఇండియన్ బాక్సాఫీస్ షేకైపోతుందని ముందు నుంచి ఉన్న అంచనానే. ఐతే ఇప్పుడీ సినిమా ప్రభంజనం చూస్తుంటే అంచనాలను మించిపోయినట్లే కనిపిస్తోంది. రోజువారీ బాక్సాఫీస్ నంబర్లు చూసి ట్రేడ్ పండిట్లకు కూడా దిమ్మదిరిగిపోతోంది.
ఈ చిత్రం కేవలం మూడు రోజుల్లోనే రూ.500 కోట్ల గ్రాస్ కలెక్షన్లు రాబట్టడం విశేషం. ముందు రోజు ప్రిమియర్లతో కలిపితే డే 1 ఈ సినిమా వరల్డ్ వైడ్ రూ.230 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. రెండో రోజు వసూళ్లు కొంతమేర తగ్గాయి. కానీ శనివారం వీకెండ్ కావడం, రంజాన్ సెలవు కూడా కలిసి రావడంతో వరల్డ్ వైడ్ వసూళ్ల మోత మోగించేసింది ‘దురంధర్ 2’.
శుక్రవారంతో పోలిస్తే శనివారం వసూళ్లు 40 శాతానికి పైగా పెరిగాయి. ఈ ఒక్క రోజే ‘దురంధర్ 2’ రూ.160 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టడం విశేషం. తొలి రెండు రోజుల్లో తెలుగు, తమిళ వెర్షన్లు రిలీజ్ కాని సంగతి తెలిసిందే. శనివారం మధ్యాహ్నం నుంచి ఇవి కూడా అందుబాటులోకి రావడంతో వసూళ్లు మరింత పెరిగాయి.
ఆదివారం కూడా ‘దురంధర్ 2’ భారీ వసూళ్లతో సాగిపోతోంది. మ్యాట్నీల నుంచి మెజారిటీ షోలు హౌస్ ఫుల్స్తో నడుస్తున్నాయి. నాలుగో రోజు కూడా ఈ సినిమా వంద కోట్లకు తగ్గకుండా కలెక్షన్లు రాబట్టే సంకేతాలు కనిపిస్తున్నాయి.
ఎక్స్టెండెడ్ వీకెండ్లో ఈ సినిమా రూ.600 కోట్ల మైలురాయిని అందుకోబోతోంది. ఒక హిందీ సినిమాకు ఈ స్థాయిలో వసూళ్లు రావడం ఇప్పటిదాకా ఎన్నడూ జరగలేదు. ‘దురంధర్’ పార్ట్ 1 ఫుల్ రన్లో రూ.1400 కోట్ల వసూళ్లు రాబట్టగా ‘దురంధర్ 2’ ఏకంగా రూ.2 వేల కోట్ల మైలురాయిని అందుకుంటుందని రిలీజ్ ముంగిట ట్రేడ్ పండిట్లు అంచనా వేశారు.
వీకెండ్ వరకు ఈ సినిమా ప్రభంజనం చూస్తే అదేమీ కష్టమైన టార్గెట్ కాదనే అనిపిస్తోంది. రెండో వీకెండ్ అయ్యేసరికి ఈ చిత్రం రూ.1000 కోట్ల మైలురాయిని అందుకోవడం లాంఛనమే.
This post was last modified on March 23, 2026 10:12 am
ఒకప్పుడు ఇంగ్లీష్ సినిమాలకు మన దేశంలో తెగ క్రేజ్ ఉండేది. జురాసిక్ పార్క్ నుంచి ఇది విపరీతంగా పెరిగిపోయింది. దానికి…
గత వారం విడుదలైన ‘చెన్నై లవ్ స్టోరీ’ సినిమా ఫుల్ పాజిటివ్ టాకేమీ తెచ్చుకోలేదు. ప్రిమియర్స్ నుంచే డివైడ్ టాక్ మొదలైంది.…
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని విష్ణుమూర్తి అవతారంగా ప్రముఖ బాలివుడ్ నటుడు సుదేష్ బెర్రీ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో…
బలమైన కంబ్యాక్ కోసం ఎదురు చూస్తున్న మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఆశలన్నీ కొరియన్ కనకరాజు మీదే ఉన్నాయి. ఆగస్ట్…
జంతర్ మంతర్ ఆందోళనలో ప్రధాని మోదీపై విమర్శలు చేయడం కన్నీళ్లు తెప్పించిందని, పండ్లు కాసే చెట్టుపైకి రాళ్లేస్తారని, దేశం కోసం…
బారత ప్రధానిగా పదవీ బాధ్యతలు చేపట్టిన నరేంద్ర మోదీ... వరుసబెట్టి మూడు పర్యాయాలు దేశ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు. అంతేకాకుండా దేశానికి అత్యధిక…