‘దురంధర్: ది రివెంజ్’ సినిమా రిలీజైనపుడు ఇండియన్ బాక్సాఫీస్ షేకైపోతుందని ముందు నుంచి ఉన్న అంచనానే. ఐతే ఇప్పుడీ సినిమా ప్రభంజనం చూస్తుంటే అంచనాలను మించిపోయినట్లే కనిపిస్తోంది. రోజువారీ బాక్సాఫీస్ నంబర్లు చూసి ట్రేడ్ పండిట్లకు కూడా దిమ్మదిరిగిపోతోంది.
ఈ చిత్రం కేవలం మూడు రోజుల్లోనే రూ.500 కోట్ల గ్రాస్ కలెక్షన్లు రాబట్టడం విశేషం. ముందు రోజు ప్రిమియర్లతో కలిపితే డే 1 ఈ సినిమా వరల్డ్ వైడ్ రూ.230 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. రెండో రోజు వసూళ్లు కొంతమేర తగ్గాయి. కానీ శనివారం వీకెండ్ కావడం, రంజాన్ సెలవు కూడా కలిసి రావడంతో వరల్డ్ వైడ్ వసూళ్ల మోత మోగించేసింది ‘దురంధర్ 2’.
శుక్రవారంతో పోలిస్తే శనివారం వసూళ్లు 40 శాతానికి పైగా పెరిగాయి. ఈ ఒక్క రోజే ‘దురంధర్ 2’ రూ.160 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టడం విశేషం. తొలి రెండు రోజుల్లో తెలుగు, తమిళ వెర్షన్లు రిలీజ్ కాని సంగతి తెలిసిందే. శనివారం మధ్యాహ్నం నుంచి ఇవి కూడా అందుబాటులోకి రావడంతో వసూళ్లు మరింత పెరిగాయి.
ఆదివారం కూడా ‘దురంధర్ 2’ భారీ వసూళ్లతో సాగిపోతోంది. మ్యాట్నీల నుంచి మెజారిటీ షోలు హౌస్ ఫుల్స్తో నడుస్తున్నాయి. నాలుగో రోజు కూడా ఈ సినిమా వంద కోట్లకు తగ్గకుండా కలెక్షన్లు రాబట్టే సంకేతాలు కనిపిస్తున్నాయి.
ఎక్స్టెండెడ్ వీకెండ్లో ఈ సినిమా రూ.600 కోట్ల మైలురాయిని అందుకోబోతోంది. ఒక హిందీ సినిమాకు ఈ స్థాయిలో వసూళ్లు రావడం ఇప్పటిదాకా ఎన్నడూ జరగలేదు. ‘దురంధర్’ పార్ట్ 1 ఫుల్ రన్లో రూ.1400 కోట్ల వసూళ్లు రాబట్టగా ‘దురంధర్ 2’ ఏకంగా రూ.2 వేల కోట్ల మైలురాయిని అందుకుంటుందని రిలీజ్ ముంగిట ట్రేడ్ పండిట్లు అంచనా వేశారు.
వీకెండ్ వరకు ఈ సినిమా ప్రభంజనం చూస్తే అదేమీ కష్టమైన టార్గెట్ కాదనే అనిపిస్తోంది. రెండో వీకెండ్ అయ్యేసరికి ఈ చిత్రం రూ.1000 కోట్ల మైలురాయిని అందుకోవడం లాంఛనమే.
టాలీవుడ్లో బండ్ల గణేష్ విచిత్రమైన పర్సనాలిటీ. చిన్న చిన్న కామెడీ వేషాలు వేసుకునే అతను.. నిర్మాతగా మారి పవన్ కళ్యాణ్,…
బాహుబలి తర్వాత రాజమౌళి ఆర్ఆర్ఆర్ తీశారు. ఆస్కార్ వేదిక మీద తన బృందానికి అవార్డు వచ్చేలా చేశారు. వారణాసిని ఇంటర్నేషనల్…
టాలీవుడ్లో ప్రస్తుతం మోస్ట్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్లలో అనిల్ రావిపూడి ఒకడు. రాజమౌళి కాకుండా ఇండస్ట్రీలో ఫెయిల్యూర్ లేని దర్శకుడు…
విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ ఈ మధ్య కాస్త స్క్రీన్ మీద తగ్గినట్టు కనిపించినా అవకాశాలకు ఏ లోటు లేదు.…
అసలు ఈ ఏడాది విడుదలవుతుందా లేదాని అనుమాన పడుతున్న టాక్సిక్ హఠాత్తుగా బాంబు వేసింది. ఆగస్ట్ 26 విడుదల చేయబోతున్నట్టు…
విజయవాడ కృష్ణలంక పోలీసు స్టేషన్ సీఐ నాగరాజుపై ప్రభుత్వం విచారణకు ఆదేశించి.. ఆయనను సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. అయితే..…