ఒకప్పుడు చాలా వరకు ఒక సినిమాకు ఒకే సంగీత దర్శకుడు పాటలతో పాటు నేపథ్య సంగీతం అందించేవాడు. కానీ ఇప్పుడు ట్రెండు మారిపోతోంది. ఒక సంగీత దర్శకుడు పాటలు అందిస్తే.. ఇంకో మ్యూజిక్ డైరెక్టర్ నేపథ్య సంగీతం సమకూరుస్తున్నాడు. బాలీవుడ్లో అయితే ఒకే సినిమాకు పలువురు సంగీత దర్శకులు పాటలు సమకూర్చే సంస్కృతి కూడా ఉంది. కానీ దక్షిణాదిన మాత్రం చాలా వరకు ఒకే మ్యూజిక్ డైరెక్టర్ అన్ని పనులూ చూసుకోవడమే జరుగుతుంటుంది.
ఈ మధ్య కొన్ని పెద్ద చిత్రాలకు నేపథ్య సంగీతం వేరొకరితో చేయించుకునే సంస్కృతి పెరుగుతోంది. ఇటీవల ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రానికి బీజీఎం పని కోసం తమన్ రంగంలోకి దిగాడు. దేవిశ్రీ ప్రసాద్ పాటల వరకే పరిమితం అయ్యాడు. దీని మీద చాలా చర్చ జరగ్గా.. సినిమాను ప్రిపోన్ చేయడం, దేవి బిజీగా ఉండడం వల్లే తమన్తో పని చేయించుకోవాల్సి వచ్చిందని, అంతకుమించి ఏమీ లేదని దర్శకుడు హరీష్ శంకర్ స్పష్టం చేశాడు.
ఐతే త్వరలో ఇంకో పెద్ద సినిమాకు ఇలా వేరే మ్యూజిక్ డైరెక్టర్ బీజీఎం అందిస్తే ఆశ్చర్యమేమీ లేదనే చర్చ జరుగుతోంది. ఆ చిత్రమే.. పెద్ది. ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే. ఆయన పాటలు, బీజీఎం కోసం నెలల తరబడి సమయం తీసుకుంటారన్న సంగతి తెలిసిందే. ఐతే సినిమా మొదలు కావడానికి ముందే చాలా కాలం రెహమాన్తో కలిసి కూర్చుని పాటలు చేయించుకున్నాడు దర్శకుడు బుచ్చిబాబు.
ఆయన పెట్టిన ఎఫర్ట్ మంచి పాటలు కూడా తయారయ్యాయి. ఐతే ఈ సినిమాకు రెహమాన్ బీజీఎం పని కూడా ముందే మొదలుపెట్టినప్పటికీ.. మొత్తం కంటెంట్ ఆయన చేతికి చేరడానికి టైం పట్టేలా ఉంది. ఏప్రిల్ 30 సినిమా రిలీజ్ కావాల్సి ఉండగా.. ఇంకా షూట్ పూర్తి కాలేదు. రెహమానేమో రంజాన్ టైంలో పెద్దగా పని చేయరు. ఆల్రెడీ పూర్తయిన సన్నివేశాలకు కూడా ఇంకా బీజీఎం పూర్తి చేయలేదని తెలుస్తోంది.
ఇంకా కొత్తగా వచ్చే కంటెంట్కు నిర్దిష్ట సమయంలో రెహమాన్ వర్క్ పూర్తి చేస్తారా లేదా అన్న సందేహాలున్నాయి. ఒకవేళ రెహమాన్ టైంకి ఔట్ పుట్ ఇవ్వకపోతే.. సినిమా విడుదలను మరోసారి వాయిదా వేయాల్సి వస్తుంది. అలాంటి పరిస్థితే వస్తే బీజీఎం తమన్ లేదా మరో సంగీత దర్శకుడితో చేయించుకుందామని ప్లాన్-బితో టీం రెడీగా ఉన్నట్టు ఇండస్ట్రీలో వార్త చక్కర్లు కొడుతుంది. కాబట్టి ‘పెద్ది’కి కూడా పాటలు ఒకరు, బీజీఎం ఒకరు చేస్తే ఆశ్చర్యమేమీ లేదు.
This post was last modified on March 21, 2026 12:19 am
ఇప్పుడు చాలా మంది మూవీ లవర్స్ మదిలో మెదులుతున్న ప్రశ్న ఇదే. నిజానికి దురంధర్ ది రివెంజ్ కి విపరీతమైన…
గత మూణ్నాలుగు నెలలుగా ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో అత్యంత చర్చనీయాంశం అయిన సినిమా అంటే.. దురంధర్యే. గత ఏడాది డిసెంబరు…
గాడ్ ఆఫ్ వార్.. ఇప్పటిదాకా ఫ్యామిలీ, యాక్షన్ ఎంటర్టైనర్లే తీస్తూ వచ్చిన అగ్ర దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తొలిసారిగా పాన్…
దివంగత మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి కుటుంబంలో ఆస్తుల వివాదం రోజురోజుకూ కొత్త మలుపులు తిరుగుతోంది. ఇటీవల వై.ఎస్.…
వైసీపీ అధినేత జగన్కు కొన్ని జాగ్రత్తలు సూచిస్తూ.. ఓ అపరిచిత ఐఏఎస్ లేఖ రాసినట్టు వైసీపీ నాయకులు చెబుతున్నారు. అయితే..…
ఒకప్పుడు తెలుగులో సీక్వెల్స్, ఫ్రాంఛైజీ సినిమాలనే మాటే ఉండేది కాదు. ‘మనీ’ లాంటి ఒకటీ అరా సినిమాలకు మాత్రమే సీక్వెల్స్…