ఒకప్పుడు తెలుగులో సీక్వెల్స్, ఫ్రాంఛైజీ సినిమాలనే మాటే ఉండేది కాదు. ‘మనీ’ లాంటి ఒకటీ అరా సినిమాలకు మాత్రమే సీక్వెల్స్ వచ్చాయి. కానీ ఇప్పుడు అంతా మారిపోయింది. సినిమా హిట్టయినా కాకపోయినా సీక్వెల్స్ అనౌన్స్ చేసేస్తున్నారు. ‘బాహుబలి’ తర్వాత ఊపందుకున్న ట్రెండ్ ఇది. ఇదే బాటలో వేరే ఇండస్ట్రీలు కూడా నడుస్తున్నాయి.
హిందీలో ముందు నుంచి సీక్వెల్, ఫ్రాంఛైజీ సినిమాల ట్రెండ్ ఉండగా.. అది గత దశాబ్ద కాలంలో మరింత ఊపందుకుంది. హాలీవుడ్లో ఎప్పటినుండో ఈ ట్రెండు ఉన్న సంగతి తెలిసిందే. ఒక హిట్ సినిమాకు సీక్వెల్ వస్తే హైప్ మామూలుగా ఉండట్లేదు. భారీ ఓపెనింగ్స్ వస్తున్నాయి. టాక్ బాగుంటే ఆ సినిమా రేంజే వేరుగా ఉంటోంది.
బాహుబలి, కేజీఎఫ్, పుష్ప లాంటి చిత్రాల సీక్వెల్స్ బాక్సాఫీస్ దగ్గర ఎంతటి సంచలనం రేపాయో తెలిసిందే. ఇప్పుడు ‘దురంధర్’ సైతం అదే బాటలో సాగుతోంది. బుధవారం ఈవెనింగ్ షోలతో మొదలైన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ప్రభంజనం సాగిస్తోంది.
విశేషం ఏంటంటే.. ‘దురంధర్-2’ థియేటర్లలో విధ్వంసం సృష్టిస్తున్న సమయంలోనే అనేక సీక్వెల్స్ వెండితెరల్లో సందడి చేస్తున్నాయి. ప్రస్తుతం హైదరాబాద్ సంగతే తీసుకుంటే.. హాలీవుడ్ ఫ్రాంఛైజీ మూవీస్ అయిన జుటోపియా-2, డెమాన్ స్లేయర్: కిమెట్సు నో యైబా-ఇన్ఫినిటీ క్యాజిల్ ప్రస్తుతం థియేటర్లలో ఆడుతున్నాయి. ఇవి రిలీజ్ అయి చాలా రోజులైనా సరే.. ఇప్పటికీ మంచి వసూళ్లు రాబడుతున్నాయి.
మరోవైపు హిందీ చిత్రం ‘లవ్ మాక్టైల్-3’తో పాటు ‘కేరళ స్టోరీ-2’ కూడా ప్రస్తుతం థియేటర్లలో నడుస్తున్నాయి. మరోవైపు మలయాళ సీక్వెల్ అయిన ‘ఆడు-3’ సైతం ఇప్పుడు థియేటర్లలో ఆడుతోంది. హైదరాబాద్లో కూడా దీనికి షోలు నడుస్తున్నాయి. మొత్తంగా ఆరు సీక్వెల్-ఫ్రాంఛైజీ సినిమాలు ప్రస్తుతం థియేటర్లలో నడుస్తుండడం విశేషం. దీన్ని బట్టి ఇప్పుడు సీక్వెల్, ఫ్రాంఛైజీ సినిమాలు ఏ స్థాయిలో పెరిగిపోయాయో అర్థం చేసుకోవచ్చు.
This post was last modified on March 20, 2026 5:10 pm
కూటమిలో భాగస్వామి అయిన జనసేన పార్టీ ఎమ్మెల్యే పనితీరుపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అసంతృప్తి వ్యక్తం చేశారు. పనితీరు బాగోలేని…
ఏపీ వాసులకు బీపీ పెరిగిపోతుంది.. దాంతోపాటు మధుమేహ వ్యాధి కూడా..! రాష్ట్రంలో అసంక్రమిత వ్యాధులను ముందుగానే గుర్తించి సకాలంలో చికిత్స…
సినిమా షూటింగ్ లో భాగంగా ఆర్టిస్టులు కొన్నిసార్లు రిస్కీ స్టంట్లు చెయ్యాల్సి ఉంటుంది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా సరే కొన్నిసార్లు…
తెలంగాణా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒక్కొక్కరే ఢిల్లీకి చేరుకుంటున్నారు. కొండా సురేఖ కూతురు సుస్మిత కామెంట్స్ పెట్టిన చిచ్చు, చిన్నారెడ్డి…
సెన్సార్ విషయంలో నానా ఇబ్బందులు పడిన రంభ ఊర్వశి మేనక ఎట్టకేలకు అడ్డంకిని తొలగించుకుని యు/ఏ సర్టిఫికెట్ తో సెప్టెంబర్…
వందో సినిమా సంబరానికి రెడీ అవుతున్న నాగార్జున కింగ్ 100 కోసం అభిమానులు పిచ్చ వెయిటింగ్ లో ఉన్నారు. నా…