Movie News

థియేటర్లలో ద్విచిత్రం

ఒకప్పుడు తెలుగులో సీక్వెల్స్, ఫ్రాంఛైజీ సినిమాలనే మాటే ఉండేది కాదు. ‘మనీ’ లాంటి ఒకటీ అరా సినిమాలకు మాత్రమే సీక్వెల్స్ వచ్చాయి. కానీ ఇప్పుడు అంతా మారిపోయింది. సినిమా హిట్టయినా కాకపోయినా సీక్వెల్స్ అనౌన్స్ చేసేస్తున్నారు. ‘బాహుబలి’ తర్వాత ఊపందుకున్న ట్రెండ్ ఇది. ఇదే బాటలో వేరే ఇండస్ట్రీలు కూడా నడుస్తున్నాయి.

హిందీలో ముందు నుంచి సీక్వెల్, ఫ్రాంఛైజీ సినిమాల ట్రెండ్ ఉండగా.. అది గత దశాబ్ద కాలంలో మరింత ఊపందుకుంది. హాలీవుడ్లో ఎప్పటినుండో ఈ ట్రెండు ఉన్న సంగతి తెలిసిందే. ఒక హిట్ సినిమాకు సీక్వెల్ వస్తే హైప్ మామూలుగా ఉండట్లేదు. భారీ ఓపెనింగ్స్ వస్తున్నాయి. టాక్ బాగుంటే ఆ సినిమా రేంజే వేరుగా ఉంటోంది.

బాహుబలి, కేజీఎఫ్, పుష్ప లాంటి చిత్రాల సీక్వెల్స్ బాక్సాఫీస్ దగ్గర ఎంతటి సంచలనం రేపాయో తెలిసిందే. ఇప్పుడు ‘దురంధర్’ సైతం అదే బాటలో సాగుతోంది. బుధవారం ఈవెనింగ్ షోలతో మొదలైన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ప్రభంజనం సాగిస్తోంది.

విశేషం ఏంటంటే.. ‘దురంధర్-2’ థియేటర్లలో విధ్వంసం సృష్టిస్తున్న సమయంలోనే అనేక సీక్వెల్స్ వెండితెరల్లో సందడి చేస్తున్నాయి. ప్రస్తుతం హైదరాబాద్ సంగతే తీసుకుంటే.. హాలీవుడ్ ఫ్రాంఛైజీ మూవీస్ అయిన జుటోపియా-2, డెమాన్ స్లేయర్: కిమెట్సు నో యైబా-ఇన్ఫినిటీ క్యాజిల్ ప్రస్తుతం థియేటర్లలో ఆడుతున్నాయి. ఇవి రిలీజ్ అయి చాలా రోజులైనా సరే.. ఇప్పటికీ మంచి వసూళ్లు రాబడుతున్నాయి.

మరోవైపు హిందీ చిత్రం ‘లవ్ మాక్‌టైల్-3’తో పాటు ‘కేరళ స్టోరీ-2’ కూడా ప్రస్తుతం థియేటర్లలో నడుస్తున్నాయి. మరోవైపు మలయాళ సీక్వెల్ అయిన ‘ఆడు-3’ సైతం ఇప్పుడు థియేటర్లలో ఆడుతోంది. హైదరాబాద్‌లో కూడా దీనికి షోలు నడుస్తున్నాయి. మొత్తంగా ఆరు సీక్వెల్-ఫ్రాంఛైజీ సినిమాలు ప్రస్తుతం థియేటర్లలో నడుస్తుండడం విశేషం. దీన్ని బట్టి ఇప్పుడు సీక్వెల్, ఫ్రాంఛైజీ సినిమాలు ఏ స్థాయిలో పెరిగిపోయాయో అర్థం చేసుకోవచ్చు.

Kumar

Recent Posts

పట్టు వదలకుండా పరిగెత్తాలి పెద్ది

పెద్ది మొదటి వారం పూర్తి చేసుకుని సెకండ్ వీక్ లో అడుగు పెట్టింది. మూడు వందల యాభై కోట్ల వైపు…

55 seconds ago

పవన్ పేరు ఎందుకు మారింది?

ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తన పేరు వెనుక ఉన్న ఆసక్తికరమైన కథను వెల్లడించారు. జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో…

5 hours ago

ఏపీ పాఠ‌శాల‌ల్లో చాగంటి పాఠ్యాంశాలు..!

ఏపీ ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల్లో ప్ర‌ముఖ ప్ర‌వ‌చ క‌ర్త చాగంటి కోటేశ్వ‌ర‌రావు ప్ర‌సంగాల‌ను పాఠ్యాంశాలుగా ప్ర‌వేశ పెడుతున్నట్టు ప్ర‌క‌టించింది. దీనికి సంబంధించి…

6 hours ago

జ‌న‌’సేన’ జాగ్ర‌త్త ప‌డాలా?

ఏపీలో కూటమిగా ఏర్పడిన టిడిపి, జనసేన, బిజెపిలు అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు పూర్తయింది. ఈ క్రమంలో కూటమికి నేతృత్వం…

8 hours ago

మీనాక్షి ఇష్యూ కాంగ్రెస్ ను ‘హర్ట్’ చేసింది!

ఓ రాజకీయ పార్టీ తనను వేధించిన విషయంపై అలుపెరగని పోరాటం చేసి తీరుతుంది. అలా చేయకుంటే… అది రాజకీయ పార్టీ…

10 hours ago

మోదీ రికార్డును బద్దలుకొట్టడం కష్టమే!

భారత దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ బుధవారం ఓ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు. దేశానికి అత్యధిక కాలం…

10 hours ago