టాలీవుడ్ చరిత్రలోనే అతి పెద్ద స్టార్లలో ఒకడైనప్పటికీ చాలా సింపుల్ గా ఉంటాడు పవన్ కళ్యాణ్. తనో పెద్ద స్టార్ అని బిల్డప్ ఇవ్వడం, హడావిడి చెయ్యడం పవన్ దగ్గర కనిపించవు. కలెక్షన్లు, రికార్డుల పిచ్చి ఉండదు. తన సినిమాలను పెద్దగా ప్రమోట్ కూడా చెయ్యడు. రాజకీయాల్లోకి వచ్చాక ప్రమోషన్ మరీ తగ్గిపోయింది. తన సినిమాల ఈవెంట్లకు వచ్చినా చాలా తక్కువ మాట్లాడతాడు. ఫాన్స్ కోరుకున్నట్లుగా గూస్ బంప్స్ మూమెంట్స్ ఏమి ఉండవు పవన్ ఈవెంట్లలో.
ఇప్పుడు ఏపీ డిప్యూటీ సీఎం కూడా కావడంతో ఇంకా కామ్ అయిపోయాడు పవన్. నిన్నటి ఉస్తాద్ భగత్ సింగ్ ఈవెంట్లోనూ అంతే. చాలా సింపుల్ గా ఉన్నది. ప్రసంగం కూడా అలాగే సాగింది. ఈ విషయంలో పవన్ ఫ్యాన్స్ ఒకింత నిరాశ కూడా వ్యక్తం చేస్తున్నారు సోషల్ మీడియాలో.
ఐతే గత ఏడాది ఓజీ సినిమా ఈవెంట్లో మాత్రం పవన్ చాలా భిన్నంగా కనిపించాడు. బహుశా తన కెరీర్ మొత్తంలో పవన్ ఎక్కువ హంగామా చేసింది అంటే ఆ ఈవెంట్లోనే అని చెప్పొచ్చు. ఆ వేడుకలో పవన్ ఓజీ సినిమాలో వాడిన కత్తి పట్టుకుని వేదిక మీదికి రావడం విశేషం. ఆ కత్తితో కలియ తిరుగుతూ.. పోజులు ఇస్తూ. అభిమానులకు గూస్ బంప్స్ ఇచ్చాడు పవర్ స్టార్.
వేదిక మీద జనాలను కంట్రోల్ చెయ్యడం, సినిమాల్లో మాత్రమే కనిపించే ఒక రకమైన యాటిట్యూడ్ చూపించడం.. ఇలా చాలా హంగామానే నడిచింది ఆ ఈవెంట్లో. వర్షం వల్ల ఆ ఈవెంట్ కొంచెం దెబ్బతింది కానీ లేదంటే పవన్ కెరీర్ మొత్తంలో చాలా స్పెషల్ గా చెప్పుకోదగ్గ కార్యక్రమం అది. పవన్ అలా చెయ్యడానికి ఓజీ పాత్ర అంత ఇన్స్పైర్ చేసి ఉండొచ్చు. ఈ విషయంలో పవన్ ను దర్శకుడు సుజీత్ ఎలా ఒప్పించాడో అని ఇప్పటికీ ఫ్యాన్స్ ఆశ్చర్యపోతున్నారు. నిన్నటి ఈవెంట్ తర్వాత ఆ వీడియోలు తీసుకొచ్చి పోస్ట్ చేస్తున్నారు.
సీనియర్లలో ఎక్కువ వేగంగా సినిమాలు చేస్తున్న హీరోల్లో మొదటి స్థానం బాలకృష్ణకే ఇవ్వాలి. ఎందుకంటే భోళాశంకర్ తర్వాత చిరంజీవి ఏకంగా…
ఇప్పటి వరకు ఒక లెక్క.. ఇక నుంచి మరో లెక్క.. అన్నట్టుగా వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ పరిస్థితి…
పెద్ది మొదటి వారం పూర్తి చేసుకుని సెకండ్ వీక్ లో అడుగు పెట్టింది. మూడు వందల యాభై కోట్ల వైపు…
ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తన పేరు వెనుక ఉన్న ఆసక్తికరమైన కథను వెల్లడించారు. జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో…
పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం నేపథ్యంలో ఇందన పొదుపు దిశగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కీలక సూచనలు చేశాక… మన…
ఏపీ ప్రభుత్వ పాఠశాలల్లో ప్రముఖ ప్రవచ కర్త చాగంటి కోటేశ్వరరావు ప్రసంగాలను పాఠ్యాంశాలుగా ప్రవేశ పెడుతున్నట్టు ప్రకటించింది. దీనికి సంబంధించి…