ఏప్రిల్ 30 ఎంతో దూరం లేదు. కేవలం నలభై నాలుగు రోజులే బ్యాలన్స్. షూట్, పోస్ట్ ప్రొడక్షన్, రీ రికార్డింగ్, ప్రమోషన్ అన్నీ ఇందులోనే అయిపోవాలి. ట్విస్ట్ ఏంటంటే ఇంకా స్పెషల్ సాంగ్ తీయలేదు. దర్శకుడు బుచ్చిబాబు హీరోయిన్ల కోసం తెగ ట్రై చేస్తున్నారని ఇన్ సైడ్ టాక్. రంగస్థలంలో పూజా హెగ్డే లాగా కాకుండా ముగ్గురు నలుగురు ఉంటే ఎలా ఉంటుందనే కోణంలో ఆలోచిస్తున్నారట. కాకపోతే ఇది అనుకున్నంత ఈజీ కాదు.
ఎందుకంటే ఎంత రామ్ చరణ్ అయినా, క్రేజ్ ఉన్న హీరోయిన్లు స్పెషల్ సాంగ్ కోసం డేట్స్ ఇవ్వడం చాలా కష్టంగా ఉంది. మృణాల్ ఠాకూర్ పేరు గట్టిగానే వినిపించింది కానీ తర్వాత ఎలాంటి సౌండ్ లేదు. హలో బ్రదర్ లో కన్నెపిట్టరో కన్నుకొట్టరో స్టైల్ ని మార్చి దాన్నే విలేజ్ బ్యాక్ డ్రాప్ లో తీసేలా బుచ్చిబాబు ఏదో డిఫరెంట్ గా ప్లాన్ చేసినట్టు ఉన్నారు. ఎక్కువ సమయం ఉంటే ఇదేమీ అసాధ్యం కాదు కానీ టైం ప్రెజర్ పెట్టుకుని డెడ్ లైన్ మీట్ కావడం పెద్ద సవాలే.
ఇంకో వారం పది రోజుల్లో దీని సంగతి తేల్చేయాలి. ఎందుకంటే కనీసం రెండు వారాల స్పేస్ పబ్లిసిటీ కోసం వాడుకోవాలి. అంటే ఏప్రిల్ మూడో వారం కల్లా బుచ్చిబాబు ఫస్ట్ కాపీ సిద్ధం చేయాలి. చివరి నిమిషం ఒత్తిళ్లు ఎలాగూ తప్పవు కానీ వీలైనంత తగ్గించుకుంటే బెటర్. వచ్చే నెల ఫస్ట్ వీక్ లోపలే ఓవర్సీస్ అడ్వాన్స్ బుకింగ్స్ మొదలుపెట్టాలి. లేదంటే పెద్ద నెంబర్లు నమోదు కావు. అందుకే ఉరుకులు పరుగులు పెట్టాల్సిందే.
బిజినెస్ వ్యవహారాలు ఒక కొలిక్కి వస్తున్నాయి. ఏరియాల వారీగా ఒక్కొక్కటిగా క్లోజ్ చేసేందుకు నిర్మాతలు చర్చలు జరుపుతున్నారు. ఎప్పుడూ వినని నాన్ రాజమౌళి నెంబర్లైతే గ్యారెంటీగా వచ్చేలా ఉన్నాయి. పుష్పని టచ్ చేయడమో లేదా దాటడమో పక్కాని ట్రేడ్ వర్గాలు బలంగా నమ్ముతున్నాయి. క్రేజ్ చూస్తుంటే అందులో ఆశ్చర్యమేమీ లేదు కానీ అభిమానులు థర్డ్ సింగల్ కోసం ఎదురు చూస్తున్నారు. చరణ్ – జాన్వీ కపూర్ మధ్య డ్యూయెట్ ఏదైనా వస్తుందేమోనని వెయిటింగ్.
తమిళ సినిమాల్లో చాలా ఏళ్ల నుంచి తిరుగులేని ఆధిపత్యం చలాయిస్తున్నాడు అనిరుధ్ రవిచందర్. అతడి హవా తమిళానికే పరిమితం కావట్లేదు…
బూత్ స్థాయిలో బలోపేతం అయ్యే దిశగా జనసేన కసరత్తు షురూ చేసింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నాయకులు ఉన్నప్పటికీ..…
ఏపీ రాజధాని అమరావతిలో రైతుల భూములను వారి అనుమతి లేకుండానే కూటమి సర్కారు లాక్కుంటోందని శనివారం పెద్ద రచ్చే జరిగింది. రాజధాని నిర్మాణం కోసం తమ భూములను…
లెనిన్ సినిమా ప్రమోషన్లలో హీరో అఖిల్ అక్కినేని గురించి ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశాడు నిర్మాతల్లో ఒకరైన నాగవంశీ. లెనిన్…
పిల్లలు సంపద అని సీఎం చంద్రబాబు మరోసారి స్పష్టం చేశారు. తాను చెప్పిన మాటకే కట్టుబడి ఉన్నానని తెలిపారు. దీనిని…
వియత్నాంలో విహార యాత్రకు వెళ్లిన భారతీయుల కుటుంబాల్లో విషాదం నెలకొంది. ఊహించని ప్రమాదంలో చిక్కుకుని 15 మంది భారతీయులు మృతి…