అయ్యప్పనుమ్ కోషియుమ్ చిత్రానికి రెండో హీరో లోటు తీరిపోయింది. మొదట్నుంచీ అనుకున్నట్టే రానా దగ్గుబాటి ఆ పాత్ర చేస్తున్నాడు. దీనికి సంబంధించి ఒక వీడియో బైట్ కూడా విడుదల చేసారు. పవన్, రానా హీరోలని తేలిపోయింది కానీ ఈ చిత్రానికి రచన చేస్తోన్న త్రివిక్రమ్ పేరు మాత్రం ఇంకా టెక్నీషియన్ల లిస్టులో చేర్చలేదు. ఈ చిత్రానికి త్రివిక్రమ్ మాటలు రాస్తున్నారనేది ఓపెన్ సీక్రెట్ అయినా కానీ త్రివిక్రమ్ పేరు అధికారికంగా ప్రకటించలేదు.
అయితే ఈ సినిమా ఓపెనింగ్లో దర్శకుడు సాగర్ చంద్ర కంటే త్రివిక్రమే ఫోకస్ అయ్యాడు. పవన్, రానా పేర్లు ఎలాగయితే స్పెషల్ వీడియో రూపంలో వెల్కమ్ చేస్తూ విడుదల చేసారో అలాగే త్రివిక్రమ్ కోసం కూడా వీడియోతో పాటు తమన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తో ప్రత్యేకమైన అనౌన్స్మెంట్ ఇస్తారట.
ఈ చిత్రానికి త్రివిక్రమ్ కేవలం మాటలు మాత్రమే కాదని, స్క్రీన్ప్లే రైటర్ కూడానని తెలిసింది. అందుకే అది ఘనంగా ప్రకటిస్తారట. అల వైకుంఠపురములో తర్వాత త్రివిక్రమ్ రచనలో వస్తోన్న సినిమా కనుక దీనికుండే క్రేజ్ దీనికుంటుంది. కాబట్టి త్రివిక్రమ్ పేరు ఏదో టెక్నీషియన్లు అందరితో చేర్చేయకుండా… ప్రత్యేకమైన ఎలివేషన్ ప్లాన్ చేసుకుంటున్నారన్నమాట.
This post was last modified on December 22, 2020 4:04 pm
లెజెండరీ రైటర్, దర్శక ధీరుడు రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్.. ఒక స్టేజ్ మీద తలవంచి క్షమాపణలు చెప్పడం చర్చనీయాంశమైంది.…
భారతదేశంలో ఇంటర్నెట్ వాడకాన్ని జియో ఎలాగైతే ఊహించని స్థాయికి తీసుకెళ్లిందో, ఇప్పుడు కృత్రిమ మేధ (AI) విషయంలోనూ అదే తరహా…
వెంకటేష్ ఫిల్మోగ్రఫీలో నువ్వు నాకు నచ్చావ్ చాలా ప్రత్యేక స్థానం సంపాదించుకున్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వచ్చి పాతిక సంవత్సరాలు…
చిన్న హీరోలు వేగంగా ఎక్కువ సినిమాలు చేయడం రెమ్యునరేషన్ పరంగా సంతృప్తినిస్తుందేమో కానీ కెరీర్ పరంగా ఒక్కోసారి ఇదే పెద్ద…
స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి బీఆర్ఎస్ తరఫున గత ఎన్నికల్లో గెలిచారు. ఆ తర్వాత కాంగ్రెస్కు మద్దతుగా వ్యవహరిస్తూ…
నైజాంలో చాలా ఏళ్ల నుంచి డిస్ట్రిబ్యూషన్లో దిల్ రాజే కింగ్. ఆయన ఈ ఏరియాలో నంబర్ వన్ డిస్ట్రిబ్యూటర్గా ఎదిగాక..…