అయ్యప్పనుమ్ కోషియుమ్ చిత్రానికి రెండో హీరో లోటు తీరిపోయింది. మొదట్నుంచీ అనుకున్నట్టే రానా దగ్గుబాటి ఆ పాత్ర చేస్తున్నాడు. దీనికి సంబంధించి ఒక వీడియో బైట్ కూడా విడుదల చేసారు. పవన్, రానా హీరోలని తేలిపోయింది కానీ ఈ చిత్రానికి రచన చేస్తోన్న త్రివిక్రమ్ పేరు మాత్రం ఇంకా టెక్నీషియన్ల లిస్టులో చేర్చలేదు. ఈ చిత్రానికి త్రివిక్రమ్ మాటలు రాస్తున్నారనేది ఓపెన్ సీక్రెట్ అయినా కానీ త్రివిక్రమ్ పేరు అధికారికంగా ప్రకటించలేదు.
అయితే ఈ సినిమా ఓపెనింగ్లో దర్శకుడు సాగర్ చంద్ర కంటే త్రివిక్రమే ఫోకస్ అయ్యాడు. పవన్, రానా పేర్లు ఎలాగయితే స్పెషల్ వీడియో రూపంలో వెల్కమ్ చేస్తూ విడుదల చేసారో అలాగే త్రివిక్రమ్ కోసం కూడా వీడియోతో పాటు తమన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తో ప్రత్యేకమైన అనౌన్స్మెంట్ ఇస్తారట.
ఈ చిత్రానికి త్రివిక్రమ్ కేవలం మాటలు మాత్రమే కాదని, స్క్రీన్ప్లే రైటర్ కూడానని తెలిసింది. అందుకే అది ఘనంగా ప్రకటిస్తారట. అల వైకుంఠపురములో తర్వాత త్రివిక్రమ్ రచనలో వస్తోన్న సినిమా కనుక దీనికుండే క్రేజ్ దీనికుంటుంది. కాబట్టి త్రివిక్రమ్ పేరు ఏదో టెక్నీషియన్లు అందరితో చేర్చేయకుండా… ప్రత్యేకమైన ఎలివేషన్ ప్లాన్ చేసుకుంటున్నారన్నమాట.
విజయ్ దేవరకొండ ప్యాన్ ఇండియా మూవీ రణబాలి సెప్టెంబర్ 11 విడుదల తేదీ ఎప్పుడో ఖరారు చేసుకుంది. అధికారిక ప్రకటన…
రీసెంట్ గా జరిగిన పద్మ అవార్డుల ప్రదానోత్సవంలో జరిగిన ఒక చిన్న ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద దుమారమే…
మహారాష్ట్రలోని పుణే సమీపంలో జరిగిన యువ వ్యాపారవేత్త అనుమానాస్పద మృతి కేసులో కళ్లు చెదిరే నిజాలు బయటపడ్డాయి. జూన్ 18వ…
అగ్రరాజ్యం అమెరికాలో శాశ్వత నివాసం కోసం గ్రీన్ కార్డ్.. అత్యంత కీలకం. దీనిని సాధించడమే మహా యజ్ఞం చేసినంత పనిగా…
ఒకప్పుడు బంగారం నిల్వల విషయంలో కేజీఎఫ్ గురించి చర్చ జరిగేదని.. కానీ, ఇప్పుడు కర్నూలు జిల్లాలోని జొన్నగిరి గురించి దేశవ్యాప్తంగా…
వైసీపీ నాయకురాలు, మాజీ మంత్రి ఆర్కే రోజా అరెస్టు తప్పదా? ఆమెపై వచ్చిన ఆరోపణలకు సంబంధించిన నివేదిక రెడీ అయిందా?…