అయ్యప్పనుమ్ కోషియుమ్ చిత్రానికి రెండో హీరో లోటు తీరిపోయింది. మొదట్నుంచీ అనుకున్నట్టే రానా దగ్గుబాటి ఆ పాత్ర చేస్తున్నాడు. దీనికి సంబంధించి ఒక వీడియో బైట్ కూడా విడుదల చేసారు. పవన్, రానా హీరోలని తేలిపోయింది కానీ ఈ చిత్రానికి రచన చేస్తోన్న త్రివిక్రమ్ పేరు మాత్రం ఇంకా టెక్నీషియన్ల లిస్టులో చేర్చలేదు. ఈ చిత్రానికి త్రివిక్రమ్ మాటలు రాస్తున్నారనేది ఓపెన్ సీక్రెట్ అయినా కానీ త్రివిక్రమ్ పేరు అధికారికంగా ప్రకటించలేదు.
అయితే ఈ సినిమా ఓపెనింగ్లో దర్శకుడు సాగర్ చంద్ర కంటే త్రివిక్రమే ఫోకస్ అయ్యాడు. పవన్, రానా పేర్లు ఎలాగయితే స్పెషల్ వీడియో రూపంలో వెల్కమ్ చేస్తూ విడుదల చేసారో అలాగే త్రివిక్రమ్ కోసం కూడా వీడియోతో పాటు తమన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తో ప్రత్యేకమైన అనౌన్స్మెంట్ ఇస్తారట.
ఈ చిత్రానికి త్రివిక్రమ్ కేవలం మాటలు మాత్రమే కాదని, స్క్రీన్ప్లే రైటర్ కూడానని తెలిసింది. అందుకే అది ఘనంగా ప్రకటిస్తారట. అల వైకుంఠపురములో తర్వాత త్రివిక్రమ్ రచనలో వస్తోన్న సినిమా కనుక దీనికుండే క్రేజ్ దీనికుంటుంది. కాబట్టి త్రివిక్రమ్ పేరు ఏదో టెక్నీషియన్లు అందరితో చేర్చేయకుండా… ప్రత్యేకమైన ఎలివేషన్ ప్లాన్ చేసుకుంటున్నారన్నమాట.
This post was last modified on December 22, 2020 4:04 pm
టిడిపిలోనే కొందరు నాయకులకు మెజారిటీ సమస్య ఇప్పుడు కొంత గడబిడగా మారింది. గత ఎన్నికల సమయంలో భారీ స్థాయి మెజారిటీతో…
ఇటీవలే శ్వాసనాళానికి సంబంధించిన శస్త్ర చికిత్స చేయించుకున్న ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ క్రమంగా కోలుకుంటున్నారు. కొద్దిరోజుల క్రితం హైదరాబాద్…
ఎవరు ఔనన్నా కాదన్నా టాలీవుడ్ రెండు వర్గాలుగా విడిపోయింది. ఎగ్జిబిటర్లు ప్లస్ వాళ్లలోనే ఉన్న నిర్మాతలు, ప్రొడ్యూసర్లు ప్లస్ వాళ్లలోనే…
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్)కు నిజంగానే ఉచ్చు బిగుస్తోందన్న వాదనలు బలంగా వినిపిస్తున్నాయి.…
జైలు.. ఈ మాట వినగానే సామాన్యులకు వామ్మో అనిపిస్తుంది. అక్కడి పరిస్థితుల గురించి అనుభవం ఉన్న వాళ్లు చెబుతుంటే.. సినిమాల్లో…
ఏపీలో ప్రదాన ప్రతిపక్ష హోదానూ దక్కించుకోలేకపోయిన వైసీపీ… తన పునరాగమనానికి భారీ కసరత్తే చేస్తోంది. అందులో భాగంగా ఏ చిన్న…