అయ్యప్పనుమ్ కోషియుమ్ చిత్రానికి రెండో హీరో లోటు తీరిపోయింది. మొదట్నుంచీ అనుకున్నట్టే రానా దగ్గుబాటి ఆ పాత్ర చేస్తున్నాడు. దీనికి సంబంధించి ఒక వీడియో బైట్ కూడా విడుదల చేసారు. పవన్, రానా హీరోలని తేలిపోయింది కానీ ఈ చిత్రానికి రచన చేస్తోన్న త్రివిక్రమ్ పేరు మాత్రం ఇంకా టెక్నీషియన్ల లిస్టులో చేర్చలేదు. ఈ చిత్రానికి త్రివిక్రమ్ మాటలు రాస్తున్నారనేది ఓపెన్ సీక్రెట్ అయినా కానీ త్రివిక్రమ్ పేరు అధికారికంగా ప్రకటించలేదు.
అయితే ఈ సినిమా ఓపెనింగ్లో దర్శకుడు సాగర్ చంద్ర కంటే త్రివిక్రమే ఫోకస్ అయ్యాడు. పవన్, రానా పేర్లు ఎలాగయితే స్పెషల్ వీడియో రూపంలో వెల్కమ్ చేస్తూ విడుదల చేసారో అలాగే త్రివిక్రమ్ కోసం కూడా వీడియోతో పాటు తమన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తో ప్రత్యేకమైన అనౌన్స్మెంట్ ఇస్తారట.
ఈ చిత్రానికి త్రివిక్రమ్ కేవలం మాటలు మాత్రమే కాదని, స్క్రీన్ప్లే రైటర్ కూడానని తెలిసింది. అందుకే అది ఘనంగా ప్రకటిస్తారట. అల వైకుంఠపురములో తర్వాత త్రివిక్రమ్ రచనలో వస్తోన్న సినిమా కనుక దీనికుండే క్రేజ్ దీనికుంటుంది. కాబట్టి త్రివిక్రమ్ పేరు ఏదో టెక్నీషియన్లు అందరితో చేర్చేయకుండా… ప్రత్యేకమైన ఎలివేషన్ ప్లాన్ చేసుకుంటున్నారన్నమాట.
This post was last modified on December 22, 2020 4:04 pm
తండ్రుల వల్ల కానిది పిల్లలు చేసి చూపిస్తే అదో ఆనందం. నాగబాబు ప్రస్తుతం ఈ స్థితిని అనుభవిస్తున్నారు. నిర్మాతగా నాగబాబు…
సీనియర్ నటుడు రాజశేఖర్కు గోలీల ఫ్యాక్టరీ ఉందని.. దాని ద్వారా ప్రతి నెలా కోట్లు సంపాదిస్తున్నాడని సోషల్ మీడియాలో వీడియోలు…
ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్దత కల్పించే బిల్లుకు పార్లమెంటు ఉభయ సభలు ఆమోదం తెలిపిన నేపథ్యంలో ఇక రాష్ట్రపతి ఆమోదమే…
తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ఎక్కడ చూసినా వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నోట నుంచి వచ్చిన మావిగన్ పైనే…
ఒకపక్క ఓవర్సీస్ అడ్వాన్స్ బుకింగ్స్ మెల్లగా మొదలైపోతున్నాయి. ట్రాకర్స్ ఒక్కొకరుగా రంగంలోకి దిగుతున్నారు. ఏపీ తెలంగాణ డిస్ట్రిబ్యూటర్లు ఏ నిమిషంలో…
భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు క్యాంపు కార్యాలయంపై శనివారం దాడి…