Movie News

తమిళ హీరోలు మొదలెట్టారు ప్రసాదు

టాలీవుడ్ లెజెండరీ నటుడు రాజేంద్ర ప్రసాద్.. ఈ మధ్య స్టేజ్ ఎక్కాడంటే చాలు ఏం మాట్లాడతాడో, ఏం బాంబులు పేలుస్తాడో అని అందరూ తలలు పట్టుకునే పరిస్థితి తలెత్తుతోంది. ‘రాబిన్ హుడ్’ వేడుకలో ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్‌ను దొంగనాకొడుకు వీడు అనడం.. మరో సినీ ఫంక్షన్లో కమెడియన్ ఆలీని ఉద్దేశించి పచ్చి బూతు మాట వాడడం.. ఒకప్పటి హీరోయిన్ రవళిని బాడీ షేమింగ్ చేయడం.. ఇలా పలు సందర్భాల్లో అదుపు తప్పి మాట్లాడిన ఆయన తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొన్నారు.

ఎన్ని విమర్శలు వచ్చినా ఆయన తీరు మారట్లేదు. తాజాగా తమిళ లెజెండరీ నటుడు ఎంజీఆర్ గురించి ఆయన అభ్యంతరకర వ్యాఖ్యలు చేసి సోషల్ మీడియాకు టార్గెట్ అయ్యారు. తెలుగు దిగ్గజ నటుడు కాంతారావు చేసిన జానపద చిత్రాలు చూసి ఎంజీఆర్ భయపడ్డారంటూ అసభ్య పదజాలం ఉపయోగిస్తూ ఒక వేడుకలో రాజేంద్రప్రసాద్ మాట్లాడడం వివాదాస్పదమైంది. ఆయన మాట్లాడింది తెలుగులోనే అయినా.. సోషల్ మీడియా కాలం కావడంతో తమిళ జనాలకు విషయం చేరింది.

తమిళులు ఎంజీఆర్‌ను దేవుడిలా చూస్తారు. అలాంటి వ్యక్తి గురించి రాజేంద్ర ప్రసాద్ ఇలా అనడంతో దుమారం రేగింది. దీనిపై తెలుగువాడే అయిన తమిళ హీరో విశాల్ తాజాగా స్పందించాడు. రాజేంద్ర ప్రసాద్ వ్యాఖ్యల మీద అతను అభ్యంతరం వ్యక్తం చేశాడు.

‘‘మీపై గౌరవం, మీరు చేసిన వ్యాఖ్యలపై బాధతో ఈ పోస్టు పెడుతున్నా. ఎంజీఆర్‌పై మీరు చేసిన వ్యాఖ్యలు విని బాధ పడ్డాను. దిగ్గజ నటుడు కాంతారావును పొగడ్డం మంచి విషయమే. కానీ ఈ క్రమంలో తమిళ ప్రజలు దైవంలా భావించే ఎంజీఆర్‌ను తక్కువ చేసి మాట్లాడ్డంతో నాతో పాటు ఎంతోమంది బాధ పడ్డారు. మిమ్మల్ని క్షమాపణలు చెప్పమని అడుగుతున్నందుకు నన్ను మన్నించండి. కానీ భవిష్యత్తులో ఎవరు ఇలా మాట్లాడినా నేను ఇలాగే స్పందిస్తాను. ఈ వివాదానికి ముగింపు పలకండి’’ అని విశాల్ పేర్కొన్నాడు. ఈ నేపథ్యంలో రాజేంద్ర ప్రసాద్ మరోసారి తన వ్యాఖ్యలపై సారీ చెప్పక తప్పేలా లేదు.

This post was last modified on March 12, 2026 3:18 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

సూపర్ నిర్ణయం… GO వచ్చినా పాత రేట్లే

తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…

2 hours ago

నానితో క్లాష్… మెగాస్టార్ ఒప్పుకోరేమో

అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…

2 hours ago

పెద్ది మెడకు పర్సెంటేజ్ గొడవ

తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…

4 hours ago

‘నీట్’ గా పేపర్ అమ్మేశారట!

నీట్ యూజీ పేపర్ లీక్ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా 22 మంది లక్షల విద్యార్థుల…

4 hours ago

భగీరథ్ కేసు వాదించేది వైసీపీ ఎంపీనే

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ పై పోక్సో కేసు నమోదైన సంగతి తెలిసిందే.…

5 hours ago

కేరళం ‘సీల్డ్ కవర్’ తెరచుకునేదెన్నడో..?

దేశంలో ఇటీవలే ముగిసిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎప్పుడో వెలువడ్డాయి. ఆ ఐదు రాష్ట్రాల్లో నాలుగు రాష్ట్రాల్లో…

5 hours ago