సెన్సార్ వివాదం వల్ల మూడు నెలలుగా వాయిదా పర్వంలో నలిగిపోతున్న జన నాయకుడు విడుదల కోసం నిర్మాత శతవిధాలా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఆయనే తీసిన టాక్సిక్ ఎలాగూ జూన్ కి వెళ్లిపోవడంతో ఇప్పుడు ఫోకస్ మొత్తం విజయ్ మూవీ మీదే పెడుతున్నారు. కోలీవుడ్ టాక్ ప్రకారం ఇవాళ చెన్నైలో రివైజింగ్ కమిటీ జన నాయకుడు ఎడిటింగ్ వెర్షన్ చూడాల్సి ఉందట.
ఆ మేరకు ప్రొడ్యూసర్ కు మెయిల్ కూడా వెళ్లిందట. అయితే సభ్యుల్లో ఒకరికి హఠాత్తుగా అనారోగ్యం కలగడంతో మరో డేట్ రావొచ్చని అంటున్నారు. ఒకవేళ కమిటీ కనక జన నాయకుడు చూసి ఆల్ ఓకే అంటే మార్చి 19 రిలీజ్ చేసే అవకాశాలు పరిశీలిస్తున్నట్టు సమాచారం. టైం చాలా తక్కువగా ఉన్నప్పటికీ డిస్ట్రిబ్యూటర్లతో మాట్లాడి యుద్ధప్రాతిపదికన విడుదల వస్తే ఎలా ఉంటుందనే దాని మీద చర్చలు జరుగున్నాయని వినికిడి.
ఇప్పుడు మిస్ అయితే మాత్రం వేసవి కన్నా ముందు వచ్చే ఛాన్స్ ఉండదు. అంటే జూన్ లేదా జూలై దాకా ఎదురు చూడాల్సి ఉంటుంది. తమిళ వర్గాల కథనాల ప్రకారం నిజంగా జన నాయకుడు కనక ఉగాదికి వచ్చే పనైతే బెస్ట్ స్క్రీన్ కౌంట్ వచ్చే బాధ్యత తాము చూసుకుంటామని తమిళ బయ్యర్లు హామీ ఇస్తున్నారట. దురంధర్ రివెంజ్ తాకిడి ఎంత ఉన్నప్పటికీ విజయ్ సినిమా వస్తోందంటే జనాలు ఇంకేవి పట్టించుకోరనే ధీమాలో ఉన్నారట.
ఇదంతా తేలడానికి ఇంకో రెండు మూడు రోజులు పట్టేలా ఉంది. ఒకవేళ మార్చి 19 కనక జన నాయకుడు వచ్చే పనైతే ఓవర్సీస్, ఇతర రాష్ట్రాల్లో స్క్రీన్ల సర్దుబాటు కొంచెం కష్టమవుతుంది. ఎందుకంటే దురంధర్ రివెంజ్ తో పాటు ఉస్తాద్ భగత్ సింగ్, మరికొన్ని హాలీవుడ్ మూవీస్ రేస్ లో ఉన్నాయి. సో దొరికిన వాటితో సర్దుకుని పోవడం తప్ప వేరే ఆప్షన్ ఉండదు. కాకపోతే టాక్సిక్ నిర్మాణ సంస్థగా కెవిఎన్ కు ఎంతో కొంత బెటర్ సపోర్ట్ అయితే దొరుకుతుంది.
కాకపోతే విజయ్ ఈసారి తెలుగు మార్కెట్ మీద ఎక్కువ ఆశలు పెట్టుకోవడానికి ఉండదు. ఎందుకంటే భగవంత్ కేసరి రీమేక్ అని క్లారిటీ రావడం, రన్బీర్ పవన్ సినిమాల నుంచి ఎదురవుతున్న కాంపిటీషన్ దృష్ట్యా గతంలోలా చెప్పుకోదగ్గ రెవిన్యూస్ రాకపోవచ్చు. అసలే రాజకీయంగా తీవ్రమైన వేడిని ఎదురుకుంటున్న విజయ్ కు జన నాయకుడు బయటికి వచ్చి హిట్ అయితే కాస్త రిలీఫ్ దక్కుతుంది.
This post was last modified on March 9, 2026 11:25 am
సూర్యకుమార్ యాదవ్ ఎందుకు ఉన్నాడు? శ్రేయస్ అయ్యర్ ఎందుకు లేడు? భారత టీ20 జట్టు విషయంలో చాలా రోజులుగా అభిమానులను…
తమిళనాడు రాజకీయాల్లో ఏర్పడ్డ కొత్త సమీకరణాలు దేశ రాజకీయాల్లో పెను మార్పునకు దారి తీశాయని చెప్పక తప్పదు. మరో మూడేళ్లలో…
బతుకుదెరువు కోసం విదేశం వెళ్లిన ఏపీకి చెందిన ముస్లిం మహిళ అక్కడ విష వలయంలో చిక్కుకుంది. ఆ ఉచ్చు నుంచి…
ఇటీవలే కిరణ్ అబ్బవరం నిర్మాతగా మారి తిమ్మరాజుపల్లి టీవీ తీశారు. మొదటి మూడు రోజులు తెగ హడావిడి చేశారు. గొప్ప…
దేవిశ్రీ ప్రసాద్ ని హీరోగా పరిచయం చేస్తూ నిర్మాత దిల్ రాజు ప్రకటించిన ఎల్లమ్మ ఇప్పటికీ రెగ్యులర్ షూటింగ్ కు…
సంగీత దర్శకులు హీరోలు కావడం తమిళ ఇండస్ట్రీలో ఇప్పటికే చూశాం. విజయ్ ఆంటోనీ, జి.వి.ప్రకాష్ కుమార్ లాంటి వాళ్లు సినీ…