పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా సినిమా చేయడం కోసం మైత్రీ మూవీ మేకర్స్ అధినేతలు చాలా ఏళ్ల కిందట అడ్వాన్స్ ఇచ్చారు. ముందు ఈ బేనర్లో ‘భవదీయుడు భగత్ సింగ్’ సినిమాను అనౌన్స్ చేశారు. కానీ అది ముందుకు కదల్లేదు. తర్వాత వేరే కథ తీసుకుని ‘ఉస్తాద్ భగత్ సింగ్’ పేరుతో సినిమా మొదలుపెట్టారు. దీనికీ అడ్డంకులు తప్పలేదు.
పవన్ పొలిటికల్ జర్నీ, వేరే సినిమా కమిట్మెంట్ల వల్ల ఈ సినిమా ఆలస్యం అవుతూనే వచ్చింది. దీని వల్ల మైత్రీ మూవీ మేకర్స్ సంస్థకు ఇబ్బందులు తప్పలేదు. ఒక సినిమాను అనౌన్స్ చేశాక వీలైనంత త్వరగా పూర్తి చేస్తేనే ప్రయోజనం ఉంటుంది. ఇలా ఏళ్ల తరబడి ఒక ప్రాజెక్టు ఆలస్యం అయితే.. వడ్డీల భారం పెరిగి బడ్జెట్ అదుపు తప్పుతుంది.
‘ఉస్తాద్ భగత్ సింగ్’ మామూలు కమర్షియల్ సినిమానే అయినా.. ఒక ఈవెంట్ ఫిలింకి అయ్యేంత ఖర్చు అయిందంటే.. అది మేకింగ్ ఆలస్యం కావడం, వడ్డీల భారం పెరగడం వల్లే. ఈ మూవీ బడ్జెట్ రూ.150 కోట్లకు పైమాటే అని సమాచారం.
ఐతే ఇంత ఖర్చయినా సరే.. మైత్రీ అధినేతలు టేబుల్ ప్రాఫిట్తో సినిమాను రిలీజ్ చేస్తున్నట్లు సమాచారం. తన వల్లే సినిమా బాగా ఆలస్యం కావడం.. పైగా ‘హరిహర వీరమల్లు’ రిలీజ్ కోసం కూడా మైత్రీ అధినేతలు సాయపడడం వల్ల పవన్ తన పారితోషకాన్ని బాగా తగ్గించుకున్నట్లు తెలుస్తోంది.
ఇప్పుడు పవన్ ఒక సినిమాకు రూ.50-60 కోట్ల మధ్య అందుకుంటున్నాడు. కానీ గతంలో తీసుకున్న రూ.5 కోట్ల అడ్వాన్స్ కాకుండా రూ.25 కోట్లు మాత్రమే తీసుకున్నాడట పవన్. అంటే ఆయన ఈ చిత్రానికి పుచ్చుకున్నది రూ.30 కోట్లే.
‘ఉస్తాద్ భగత్ సింగ్’ డిజిటల్ రైట్స్ను చాలా ముందుగానే నెట్ఫ్లిక్స్ సంస్థకు రూ.80 కోట్లకు అమ్మేసినట్లు తెలుస్తోంది. థియేట్రికల్ హక్కుల ద్వారా ఈజీగా రూ.100 కోట్లకు పైగానే వచ్చే అవకాశముంది. మిగతా రైట్స్ అన్నీ కూడా కలిపితే రూ.200 కోట్లకు తక్కువ కాకుండా బిజినెస్ చేసేలా కనిపిస్తోంది ‘ఉస్తాద్ భగత్ సింగ్’. ఇలా నిర్మాతలు బాగానే లాభపడుతున్నారు. రిలీజ్ తర్వాత పరిస్థితిని బట్టి పవన్కు ఇంకొంత అదనపు పారితోషకం ఇచ్చే అవకాశమున్నట్లు తెలుస్తోంది.
This post was last modified on March 7, 2026 3:12 pm
2025 గద్దర్ అవార్డుల ప్రకటన జరిగిపోయింది. ఎప్పుడో దశాబ్దంకు పైగా ఆగిపోయిన నంది పురస్కారాలను తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేకంగా గద్దర్…
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అరెస్టై విడుదలైన సంగతి తెలిసిందే. ఆ కేసులో…
నిన్న విడుదలైన ఎస్ సర్వసతి సినిమా చుట్టూ కొత్త వివాదం నెలకొంది. దీనికి కథను అందించిన రచయిత సాయిమాధవ్ బుర్రా…
వివాదాస్పద నాయకులకు సీఎం చంద్రబాబు తనదైన శైలిలో చెక్ పెట్టారు. ఎవరికివారు తమంత వారు లేరని భావిస్తున్న నేపథ్యంలో క్షేత్రస్థాయిలో…
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో క్రమం తప్పకుండా ఎన్నో ఏళ్ల నుంచి ఇస్తూ వచ్చిన నంది అవార్డులకు.. రాష్ట్ర విభజన తర్వాత బ్రేక్…
బాహుబలి, కెజిఎఫ్, పుష్ప తర్వాత ఒక సీక్వెల్ కోసం మూవీ లవర్స్ విపరీతంగా ఎదురు చూసిన సినిమా దురంధర్ ది…