తమిళంలో నంబర్ వన్ హీరోగా ఉన్న సమయంలో రాజకీయ పార్టీ పెట్టడమే కాక.. ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తు లేకుండా ఒంటరిగా బరిలోకి దిగుతున్నాడు విజయ్. ఐతే కరూర్ విషాద ఘటన సహా అతడికి వరుసగా ఎదురు దెబ్బలు తప్పట్లేదు. ఇటీవల తన వ్యక్తిగత జీవితం తమిళనాట పెద్ద చర్చకు దారి తీసింది.
విజయ్ భార్య సంగీత విడాకుల కోసం దరఖాస్తు చేస్తూ విజయ్ మీద అనేక ఆరోపణలు చేశారు. దీనికి విజయ్ అండ్ కో నుంచి ఖండనలాంటివేమీ లేకపోయాయి. కేవలం అభిమానులు మాత్రం విజయ్ని వెనకేసుకుంటూ వచ్చారు. ఐతే వారం రోజుల గొడవ తర్వాత విజయ్.. భార్య ఆరోపణలను, రూమర్లను నిజం చేస్తూ నటి త్రిషతో కలిసి ఒక పెళ్లి వేడుకకు హాజరై అందరికీ పెద్ద షాకిచ్చారు.
సంగీత.. విజయ్ నటితో అక్రమ సంబంధం పెట్టుకున్నాడన్నట్లు పరోక్షంగా మాట్లాడారే తప్ప, పేరు చెప్పలేదు. కానీ విజయ్ మాత్రం ఆ నటి త్రిషనే అని కన్ఫమ్ చేసినట్టు తెలుస్తుంది. ఐతే ఎన్నికలు సమీపిస్తుండగా త్రిషతో కలిసి విజయ్ ఇలా పబ్లిక్ అప్పియరెన్స్ ఇవ్వడం అతడికి మంచిదేనా అనే చర్చ మొదలైంది.
కొందరేమో ఇది ఆత్మహత్యాసదృశ్యం అంటున్నారు. ఎన్నికలు అయ్యే వరకు విజయ్ మౌనం వహిస్తే బాగుండేదని.. రాజకీయాల్లో ఉన్న వాళ్లు వివాహేతర సంబంధంలో ఉన్నట్లు బయటపడితే అంత మంచిది కాదని, అందునా ఇది రైట్ టైమింగ్ కాదని అభిప్రాయపడుతున్నారు. భార్యతో సెటిల్మెంట్ జరిగి విడాకులు తీసుకున్నాక త్రిషతో కలిసి కనిపిస్తే బాగుండేదని.. ఇప్పుడు విజయ్ తొందరపడ్డాడని అంటున్నారు. కానీ అదే సమయంలో విజయ్ చేసింది కరెక్టే అంటున్న వాళ్లూ లేకపోలేదు.
విజయ్ని వ్యక్తిగతంగా టార్గెట్ చేయబోతున్నారన్నది స్పష్టం అయిపోయిందని… ఈ క్రమంలో త్రిషను కూడా ఇబ్బంది పెట్టడం ఖాయమని.. అందుకే తర్వాత జరగబోయే డ్యామేజ్ను తగ్గించి.. జనాలకు ముందే ఒక స్పష్టత ఇచ్చేస్తే వాళ్లు అర్థం చేసుకుంటారని.. రాజకీయ ప్రత్యర్థులకు ఇక ఈ టాపిక్ మీద మాట్లాడే అవకాశం లేకుండా చూడొచ్చనే ఉద్దేశంతో విజయ్ ఇలా చేసి ఉండొచ్చనే వాదన వినిపిస్తోంది.
కానీ మెజారిటీ అయితే.. విజయ్ చేసింది కరెక్ట్ కాదనే అభిప్రాయమే వ్యక్తం చేస్తున్నారు. వివాహేతర సంబంధం వల్ల ఒక మహిళకు అన్యాయం జరిగింది అనే అభిప్రాయంతో మహిళా ఓటర్లలో వ్యతిరేకత పెరుగుతుందనే మాట బలంగా వినిపిస్తోంది.
This post was last modified on March 6, 2026 10:49 am
అర్జెంటీనాలో జరిగిన ఒక విచిత్ర పరిణామం ప్రపంచ వ్యాప్తంగా తెగ వైరల్ అవుతుంది. రాత్రికి రాత్రే ఒక సముద్రం ఇంకిపోయిందని,…
ఫోల్డబుల్ ఫోన్ అంటే ముందుగా గుర్తొచ్చేది శాంసంగ్. 2019లో తొలి గెలాక్సీ ఫోల్డ్ను తీసుకొచ్చిన ఆ కంపెనీ, అప్పటి నుంచి…
ఫౌజీ వాయిదా గురించి నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నుంచి ఎలాంటి ప్రకటన రాకపోయినా పోస్ట్ పోన్ ఖాయమని…
మొబైల్ ఫోన్లు చేతిలోకి వచ్చాక రోజుకో కొత్త రకం నేరం బయట పడుతుంది. ముఖ్యంగా యువతీ యువకులు, మైనర్ బాలుల్లో…
కారణాలు లక్షా తొంభై ఉండని, టాలీవుడ్ హీరోలు చాలా నెమ్మదిగా సినిమాలు చేస్తున్నారనేది వాస్తవం. రవితేజ, శ్రీవిష్ణు లాంటి ఒకరిద్దరిని…
ప్రతి ఏడాది కొత్త ఐఫోన్ వస్తుంది. కెమెరా మారుతుంది, చిప్ వేగం పెరుగుతుంది. కానీ ఈసారి ఐఫోన్ 18 ప్రోతో…