ఒకప్పుడు వంద రోజులు, సిల్వర్ జూబ్లీలు చాలా మాములు విషయం. అడవి రాముడు, ప్రేమాభిషేకం ఏడాది ఆడాయి. ఘరానా మొగుడు, సమరసింహారెడ్డిలు రిపీట్ రన్ లోనూ కలెక్షన్ల వర్షం కురిపించాయి. ఆఖరికి ఫ్లాపులు అనిపించుకున్నవి కూడా అర్ధశతదినోత్సవం చేసుకున్న దాఖలాలు చాలా ఉన్నాయి. ఇదంతా గత చరిత్ర. పైరసీ పెరిగిపోయింది. ఓటిటిలు డామినేట్ చేస్తున్నాయి. టెక్నాలజీ వల్ల ప్రేక్షకులు వినోద పరంగా బోలెడు ఆప్షన్లు దొరుకుతున్నాయి.
14 ఇంచుల టీవీలు పోయి ఇప్పుడు 100 ఇంచుల ఖరీదయిన ఓలెడ్ స్మార్ట్ తెరలు వచ్చేశాయి. ఇవన్నీ బిగ్ స్క్రీన్ బిజినెస్ మీద ప్రభావం చూపించి థియేటర్లలో లాంగ్ రన్ అనే మాట మర్చిపోయేలా చేశాయి. తాజాగా మన శంకరవరప్రసాద్ గారు చాలా గ్యాప్ తర్వాత టాలీవుడ్ కు 50 రోజుల పోస్టర్ ని చూపించింది. 109 కేంద్రాల్లో ఫిఫ్టీ డేస్ ఆడినట్టుగా నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించింది. నిజానికి ఓటిటిలో త్వరగా వచ్చేసినా కూడా పలు చోట్ల ఇంకా చెప్పుకోదగ్గ రెవిన్యూ రావడం విశేషం.
చిరంజీవిని ఆయన వింటేజ్ టైమింగ్ తో దర్శకుడు అనిల్ రావిపూడి ఆవిష్కరించిన విధానం ప్రేక్షకులతో మూడు వందల కోట్లకు పైగా వసూళ్లు వచ్చేలా చేసింది. వెంకటేష్ క్యామియో, నయనతార పాత్ర, భీమ్స్ సంగీతం, చైల్డ్ సెంటిమెంట్, సరిపడా కామెడీ లాంటి అంశాలన్నీ మన శంకరవరప్రసాద్ గారుకి ఘనవిజయం దక్కేందుకు దోహదం చేశాయి. ఇలా యాభై రోజుల మైలురాయిని అందుకున్న గత సినిమా సంక్రాంతికి వస్తున్నాం 92 సెంటర్లతో ఉండగా దాన్ని తిరిగి అనిల్ రావిపూడి సినిమానే క్రాస్ చేయడం గమనార్హం.
కంటెంట్ ప్రాపర్ గా ఉండి, స్టార్ హీరోల మద్దతు కనక దక్కితే ఇప్పటికీ బాక్సాఫీస్ దగ్గర అద్భుతాలు చేయొచ్చని మన శంకరవరప్రసాద్ గారు నిరూపించింది. ఇటీవలే శాటిలైట్ ప్రీమియర్ కూడా జరుపుకున్న నేపథ్యంలో ఫైనల్ రన్ కు దగ్గరగా వచ్చేసిందని చెప్పాలి. మొత్తానికి భోళా శంకర్ తర్వాత రెండేళ్లకు పైగా సాగిన మెగాభిమానుల నిరీక్షణకు న్యాయం చేకూరుస్తూ సూపర్ సక్సెస్ అందుకున్న చిరంజీవి వేసవిలో మెగా ఫాంటసీ మూవీ విశ్వంభరతో రాబోతున్నారు.
ఎంతవరకు నిజమో చెప్పలేం కానీ నిర్మాత నమిత మల్హోత్రా చెబుతున్న దాని ప్రకారం రామాయణకు పెడుతున్న ఖర్చు నాలుగు వేల…
ఈ నెల 24 విడుదల కాబోతున్న చెన్నై లవ్ స్టోరీ టీమ్ ఒక విషయంలో టెన్షన్ పడుతోంది. అదే రోజు…
పెద్ది, మా ఇంటి బంగారం తర్వాత ఈ సీజన్ లో బాక్సాఫీస్ కు మళ్ళీ జోష్ వచ్చింది. థియేటర్లు కళకళలాడుతున్నాయి.…
తమిళ సినిమాల్లో చాలా ఏళ్ల నుంచి తిరుగులేని ఆధిపత్యం చలాయిస్తున్నాడు అనిరుధ్ రవిచందర్. అతడి హవా తమిళానికే పరిమితం కావట్లేదు…
బూత్ స్థాయిలో బలోపేతం అయ్యే దిశగా జనసేన కసరత్తు షురూ చేసింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నాయకులు ఉన్నప్పటికీ..…
ఏపీ రాజధాని అమరావతిలో రైతుల భూములను వారి అనుమతి లేకుండానే కూటమి సర్కారు లాక్కుంటోందని శనివారం పెద్ద రచ్చే జరిగింది. రాజధాని నిర్మాణం కోసం తమ భూములను…