ఒకప్పుడు వంద రోజులు, సిల్వర్ జూబ్లీలు చాలా మాములు విషయం. అడవి రాముడు, ప్రేమాభిషేకం ఏడాది ఆడాయి. ఘరానా మొగుడు, సమరసింహారెడ్డిలు రిపీట్ రన్ లోనూ కలెక్షన్ల వర్షం కురిపించాయి. ఆఖరికి ఫ్లాపులు అనిపించుకున్నవి కూడా అర్ధశతదినోత్సవం చేసుకున్న దాఖలాలు చాలా ఉన్నాయి. ఇదంతా గత చరిత్ర. పైరసీ పెరిగిపోయింది. ఓటిటిలు డామినేట్ చేస్తున్నాయి. టెక్నాలజీ వల్ల ప్రేక్షకులు వినోద పరంగా బోలెడు ఆప్షన్లు దొరుకుతున్నాయి.
14 ఇంచుల టీవీలు పోయి ఇప్పుడు 100 ఇంచుల ఖరీదయిన ఓలెడ్ స్మార్ట్ తెరలు వచ్చేశాయి. ఇవన్నీ బిగ్ స్క్రీన్ బిజినెస్ మీద ప్రభావం చూపించి థియేటర్లలో లాంగ్ రన్ అనే మాట మర్చిపోయేలా చేశాయి. తాజాగా మన శంకరవరప్రసాద్ గారు చాలా గ్యాప్ తర్వాత టాలీవుడ్ కు 50 రోజుల పోస్టర్ ని చూపించింది. 109 కేంద్రాల్లో ఫిఫ్టీ డేస్ ఆడినట్టుగా నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించింది. నిజానికి ఓటిటిలో త్వరగా వచ్చేసినా కూడా పలు చోట్ల ఇంకా చెప్పుకోదగ్గ రెవిన్యూ రావడం విశేషం.
చిరంజీవిని ఆయన వింటేజ్ టైమింగ్ తో దర్శకుడు అనిల్ రావిపూడి ఆవిష్కరించిన విధానం ప్రేక్షకులతో మూడు వందల కోట్లకు పైగా వసూళ్లు వచ్చేలా చేసింది. వెంకటేష్ క్యామియో, నయనతార పాత్ర, భీమ్స్ సంగీతం, చైల్డ్ సెంటిమెంట్, సరిపడా కామెడీ లాంటి అంశాలన్నీ మన శంకరవరప్రసాద్ గారుకి ఘనవిజయం దక్కేందుకు దోహదం చేశాయి. ఇలా యాభై రోజుల మైలురాయిని అందుకున్న గత సినిమా సంక్రాంతికి వస్తున్నాం 92 సెంటర్లతో ఉండగా దాన్ని తిరిగి అనిల్ రావిపూడి సినిమానే క్రాస్ చేయడం గమనార్హం.
కంటెంట్ ప్రాపర్ గా ఉండి, స్టార్ హీరోల మద్దతు కనక దక్కితే ఇప్పటికీ బాక్సాఫీస్ దగ్గర అద్భుతాలు చేయొచ్చని మన శంకరవరప్రసాద్ గారు నిరూపించింది. ఇటీవలే శాటిలైట్ ప్రీమియర్ కూడా జరుపుకున్న నేపథ్యంలో ఫైనల్ రన్ కు దగ్గరగా వచ్చేసిందని చెప్పాలి. మొత్తానికి భోళా శంకర్ తర్వాత రెండేళ్లకు పైగా సాగిన మెగాభిమానుల నిరీక్షణకు న్యాయం చేకూరుస్తూ సూపర్ సక్సెస్ అందుకున్న చిరంజీవి వేసవిలో మెగా ఫాంటసీ మూవీ విశ్వంభరతో రాబోతున్నారు.
This post was last modified on March 2, 2026 12:18 pm
ఒకప్పుడు ఇంగ్లీష్ సినిమాలకు మన దేశంలో తెగ క్రేజ్ ఉండేది. జురాసిక్ పార్క్ నుంచి ఇది విపరీతంగా పెరిగిపోయింది. దానికి…
గత వారం విడుదలైన ‘చెన్నై లవ్ స్టోరీ’ సినిమా ఫుల్ పాజిటివ్ టాకేమీ తెచ్చుకోలేదు. ప్రిమియర్స్ నుంచే డివైడ్ టాక్ మొదలైంది.…
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని విష్ణుమూర్తి అవతారంగా ప్రముఖ బాలివుడ్ నటుడు సుదేష్ బెర్రీ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో…
బలమైన కంబ్యాక్ కోసం ఎదురు చూస్తున్న మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఆశలన్నీ కొరియన్ కనకరాజు మీదే ఉన్నాయి. ఆగస్ట్…
ఏపీ దశ దిశలను మార్చేసే భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం శనివారం ఉదయం లాంఛనంగా ప్రారంబమైంది. దేశ ప్రధాని నరేంద్ర మోదీ అల్లూరి సీతారామరాజు…
జంతర్ మంతర్ ఆందోళనలో ప్రధాని మోదీపై విమర్శలు చేయడం కన్నీళ్లు తెప్పించిందని, పండ్లు కాసే చెట్టుపైకి రాళ్లేస్తారని, దేశం కోసం…