ఒకప్పుడు వంద రోజులు, సిల్వర్ జూబ్లీలు చాలా మాములు విషయం. అడవి రాముడు, ప్రేమాభిషేకం ఏడాది ఆడాయి. ఘరానా మొగుడు, సమరసింహారెడ్డిలు రిపీట్ రన్ లోనూ కలెక్షన్ల వర్షం కురిపించాయి. ఆఖరికి ఫ్లాపులు అనిపించుకున్నవి కూడా అర్ధశతదినోత్సవం చేసుకున్న దాఖలాలు చాలా ఉన్నాయి. ఇదంతా గత చరిత్ర. పైరసీ పెరిగిపోయింది. ఓటిటిలు డామినేట్ చేస్తున్నాయి. టెక్నాలజీ వల్ల ప్రేక్షకులు వినోద పరంగా బోలెడు ఆప్షన్లు దొరుకుతున్నాయి.
14 ఇంచుల టీవీలు పోయి ఇప్పుడు 100 ఇంచుల ఖరీదయిన ఓలెడ్ స్మార్ట్ తెరలు వచ్చేశాయి. ఇవన్నీ బిగ్ స్క్రీన్ బిజినెస్ మీద ప్రభావం చూపించి థియేటర్లలో లాంగ్ రన్ అనే మాట మర్చిపోయేలా చేశాయి. తాజాగా మన శంకరవరప్రసాద్ గారు చాలా గ్యాప్ తర్వాత టాలీవుడ్ కు 50 రోజుల పోస్టర్ ని చూపించింది. 109 కేంద్రాల్లో ఫిఫ్టీ డేస్ ఆడినట్టుగా నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించింది. నిజానికి ఓటిటిలో త్వరగా వచ్చేసినా కూడా పలు చోట్ల ఇంకా చెప్పుకోదగ్గ రెవిన్యూ రావడం విశేషం.
చిరంజీవిని ఆయన వింటేజ్ టైమింగ్ తో దర్శకుడు అనిల్ రావిపూడి ఆవిష్కరించిన విధానం ప్రేక్షకులతో మూడు వందల కోట్లకు పైగా వసూళ్లు వచ్చేలా చేసింది. వెంకటేష్ క్యామియో, నయనతార పాత్ర, భీమ్స్ సంగీతం, చైల్డ్ సెంటిమెంట్, సరిపడా కామెడీ లాంటి అంశాలన్నీ మన శంకరవరప్రసాద్ గారుకి ఘనవిజయం దక్కేందుకు దోహదం చేశాయి. ఇలా యాభై రోజుల మైలురాయిని అందుకున్న గత సినిమా సంక్రాంతికి వస్తున్నాం 92 సెంటర్లతో ఉండగా దాన్ని తిరిగి అనిల్ రావిపూడి సినిమానే క్రాస్ చేయడం గమనార్హం.
కంటెంట్ ప్రాపర్ గా ఉండి, స్టార్ హీరోల మద్దతు కనక దక్కితే ఇప్పటికీ బాక్సాఫీస్ దగ్గర అద్భుతాలు చేయొచ్చని మన శంకరవరప్రసాద్ గారు నిరూపించింది. ఇటీవలే శాటిలైట్ ప్రీమియర్ కూడా జరుపుకున్న నేపథ్యంలో ఫైనల్ రన్ కు దగ్గరగా వచ్చేసిందని చెప్పాలి. మొత్తానికి భోళా శంకర్ తర్వాత రెండేళ్లకు పైగా సాగిన మెగాభిమానుల నిరీక్షణకు న్యాయం చేకూరుస్తూ సూపర్ సక్సెస్ అందుకున్న చిరంజీవి వేసవిలో మెగా ఫాంటసీ మూవీ విశ్వంభరతో రాబోతున్నారు.
This post was last modified on March 2, 2026 12:18 pm
అంచనాలకు మించి దురంధర్ ది రివెంజ్ అరాచకం చేస్తోంది. సరిగ్గా వారం రోజులు కావడం ఆలస్యం వెయ్యి కోట్ల క్లబ్బులోకి…
లోక్ సభ, అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన ఖరారైన నేపథ్యంలో దేశంలోని అన్ని ప్రాంతాల ప్రజలు ఆయా పరిణామాలపై ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. ఈ…
నేటి తరం కుర్ర హీరోల్లో సంతోష్ శోభన్, సంగీత్ శోభన్ సోదరులకు ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది. అయితే వీరిద్దరి…
ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మార్కాపురం జిల్లాలోని రాయవరం సమీపంలో పలకల క్వారీల వద్ద ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు…
ఇటీవల విడుదలైన ఉస్తాద్ భగత్ సింగ్ ఫలితం విషయంలో అభిమానులు ఎంత మాత్రం హ్యాపీగా లేరన్నది వాస్తవం. వింటేజ్ పవన్…
ఓ ముప్పై ఏళ్ళు వెనక్కు వెళ్తే చిరంజీవి, బాలకృష్ణ లాంటి స్టార్ల ప్రభంజనం ఉదృతంగా ఉన్న టైంలో తెలుగు భాష…