కలెక్షన్ కింగ్ మోహన్ బాబు తన సమకాలీకుల్లాగా వేగంగా సినిమాలు చేయడం లేదు. వ్యక్తిగత కారణాలు, వ్యాపారాలు కారణాలు ఏమైనా ఆయన్ని రెగ్యులర్ గా స్క్రీన్ మీద చూడాలని కోరుకుంటున్న మంచు అభిమానులు ఇప్పటికీ ఉన్నారు. గత పదేళ్ల కాలంలో కొన్నింటిలో నటించారు కానీ అవేవి పెద్దగా సక్సెస్ కాలేదు.
ప్రత్యేక పాత్రలు పోషించిన కన్నప్ప, శాకుంతలం నుంచి సోలో హీరోగా నటించిన సన్నాఫ్ ఇండియా, గాయత్రి ఏవీ కమర్షియల్ గా వర్కౌట్ కాలేదు. అయితే ఆయన తాజా లైనప్ చూస్తుంటే సరైన దర్శకులతో చేతులు కలిపినట్టు కనిపిస్తోంది. వాటిలో మొదటిది.. ముందుగా ఓకే చేసింది నాని ది ప్యారడైజ్.
దర్శకుడు శ్రీకాంత్ ఓదెల ఇప్పటిదాకా ఎవరూ చూపనంత వయొలెంట్ గా మోహన్ బాబు చూపించబోతున్నట్టు ఇన్ సైడ్ టాక్. కలెక్షన్ కింగ్ విలన్ గా చేయడం కొత్త కాదు. హీరోగా పీక్స్ లో ఉన్నప్పుడే ఎం ధర్మరాజు ఎంఏ లాంటి విలక్షణ చిత్రాలు చేసి మెప్పించారు. తొంభై దశకంలో వచ్చిన అల్లుడుగారు కన్నా ముందు ఆయన చేసిన క్యారెక్టర్స్ లో అధిక శాతం విలన్ షేడ్స్ ఉన్నవే.
ఆరెక్స్ 100 ఫేమ్ అజయ్ భూపతి తీస్తున్న శ్రీనివాస మంగాపురంలో చాలా పవర్ ఫుల్ రోల్ దక్కినట్టు వినికిడి. ఫస్ట్ లుక్ పోస్టర్ చూస్తుంటే అదే అభిప్రాయం కలుగుతోంది. ఈ రెండు క్లిక్ అయితే మాత్రం ఆర్టిస్టుగా మోహన్ బాబు మళ్ళీ బిజీ అయిపోవచ్చు.
కాకపోతే పెద్దాయన్ని ఒప్పించడమే పెద్ద టాస్కట. శ్రీకాంత్, అజయ్ కన్విన్స్ చేయడం చూస్తే కంటెంట్స్ చాలా బలంగా ఉన్నట్టు అనిపిస్తోంది. ఇక అయన వారసులు మంచు విష్ణు, మంచు మనోజ్ ఇద్దరూ తమ తమ ప్రాజెక్టుల్లో బిజీగానే ఉన్నారు.
భైరవంతో రీ ఎంట్రీ ఇచ్చిన మనోజ్ కు మిరాయ్ రూపంలో మంచి హిట్ దొరికింది. డేవిడ్ రెడ్డి పెద్ద బడ్జెట్ తో రూపొందుతోంది. కన్నప్ప ఆశించిన ఫలితం ఇవ్వకపోవడంతో విష్ణు ఈసారి కొత్త జానర్లు ట్రై చేసేందుకు రెడీ అవుతున్నాడు. ప్యారడైజ్, శ్రీనివాస మంగాపురం 2026లోనే విడుదల కాబోతున్నాయి కాబట్టి మంచు ఫ్యామిలీకి మెమరబుల్ ఇయర్ గా నిలుస్తుందేమో చూడాలి.
This post was last modified on February 28, 2026 7:03 pm
ఏంటో జెన్ జీ ఆడియన్స్ మహా విచిత్రంగా ఉన్నారు. కొన్ని కొత్త సినిమాలను అస్సలు పట్టించుకోరు. కొన్ని రీ రిలీజులకేమో…
సినిమా నటులు ఎందరో రాజకీయ నాయకులయ్యారు. అయితే ప్రజల మనసులో బలమైన ముద్ర వేసిన వాళ్ళు మాత్రం కొందరే ఉంటారు.…
మూడ్ ఆఫ్ ది నేషన్ పేరుతో ఇండియా టుడే సీ ఓటర్ చేసిన సర్వే తమిళనాడు టీవీకే, కాంగ్రెస్ కాపురం…
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ( SIR ) చిక్కుముడిగా మారింది.…
కూటమిలో భాగస్వామి అయిన జనసేన పార్టీ ఎమ్మెల్యే పనితీరుపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అసంతృప్తి వ్యక్తం చేశారు. పనితీరు బాగోలేని…
ఏపీ వాసులకు బీపీ పెరిగిపోతుంది.. దాంతోపాటు మధుమేహ వ్యాధి కూడా..! రాష్ట్రంలో అసంక్రమిత వ్యాధులను ముందుగానే గుర్తించి సకాలంలో చికిత్స…