తాను దర్శకత్వం వహించిన సినిమాలు.. ప్రొడ్యూస్ చేసిన సినిమాలు.. పరిచయం చేసిన టెక్నీషియన్లు.. సినిమాల్లో తెచ్చిన మార్పు.. ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీపై చూపిన ప్రభావం.. ఈ కోణాల్లో చూస్తే ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే అతి పెద్ద దిగ్గజాల్లో ఒకడిగా రామ్ గోపాల్ వర్మ ఉంటాడు. ఆయనకు ఈ విషయంలో ఎన్నో పురస్కారాలు కూడా ఇవ్వవచ్చు.
ఐతే తన భావజాలాన్ని బయటపెట్టకుండా సైలెంటుగా సినిమాలు తీస్తున్నంత వరకు వర్మ తిరుగులేని స్థాయిలోనే ఉన్నాడు. కానీ ఎప్పుడైతే మీడియా ముందుకొచ్చి మాట్లాడటం మొదలుపెట్టాడో.. సోషల్ మీడియా ద్వారా తన మనసులోని భావాలు బయటపెట్టడం మొదలుపెట్టాడో.. అక్కడ్నుంచి ఆయన పతనం మొదలైంది.
వర్మ ఐడియాలజీ విపరీతంగా నచ్చేవాళ్లు కూడా ఉన్నారు కానీ.. ఒక దశ దాటాక వర్మ పూర్తిగా హద్దులు దాటిపోవడం, మాటలు ఎక్కువైపోయి ఆయన చేతల్లో చేవ తగ్గడం.. సినిమాల క్వాలిటీ దారుణంగా పడిపోవడంతో వర్మను సామాన్య జనం లైట్ తీసుకునే పరిస్థితి వచ్చింది.
ఇండస్ట్రీలో ఒకప్పుడు వర్మను ఎంతో గౌరవించిన వాళ్లంతా ఇప్పుడు ఆయన్ని పట్టించుకోవడం లేదు. పూరి జగన్నాథ్ లాంటి ఆయన శిష్యులు ఒకరిద్దరు తప్పితే సోషల్ మీడియాలో వర్మను ట్యాగ్ చేసి ఏ పేరున్న సెలబ్రెటీ మాట్లాడట్లేదు. ఆయన ట్వీట్లపై స్పందించడం లేదు. బాలీవుడ్ వాళ్లు ఎప్పుడో ఆయన్ని వదిలేయగా.. టాలీవుడ్ జనాలు కూడా లైట్ తీసుకున్నారు.
ఇలాంటి సమయంలో మంచు లక్ష్మి రామ్ గోపాల్ వర్మను గుర్తించింది. భవిష్యత్ సినిమా ఎలా ఉండాలనే అంశం మీద ఆమె ఇన్స్టాగ్రామ్లో లైవ్ ప్రోగ్రాం ఒకటి చేయబోతోంది. సోమవారం సాయంత్రం ఈ ప్రోగ్రాం ఉంటుంది. దీనికి వర్మను గెస్టుగా పిలిచింది లక్ష్మి. వేరే అతిథులు కూడా వస్తారేమో తెలియదు.
ఐతే టీవీ ఛానెళ్లకు వెళ్లి వర్మ ఎలా చర్చల్ని పక్కదోవ పట్టించి నాన్ సీరియస్గా మారుస్తుంటాడో తెలిసిందే. మరి ఓ సీరియస్ ఇష్యూ మీద లక్ష్మి నడపనున్న కార్యక్రమంలోకి వచ్చి వర్మ ఏం రచ్చ చేస్తాడో చూడాలి మరి.
బీజేపీకి అత్యంత కీలకమైన ఉత్తర ప్రదేశ్లో ఎన్నికలకు ముందు చెలరేగిన అయోధ్య రామమందిర వివాదం కీలక మలుపులు తిరుగుతోంది. దేశంలోనే…
తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగా సాదించిన పార్టీగా బీఆర్ఎస్ (గతంలో టీఆర్ఎస్)కు ఓ ప్రత్యేక గుర్తుంపు అయితే ఉంది. అయినంత మాత్రాన…
మా ఇంటి బంగారం బాక్సాఫీస్ వద్ద స్ట్రాంగ్ గా ఉంది. నిజమే.ఎవరూ కాదనలేరు. అయితే ఇవాళ వైజాగ్ లో జరిగిన…
తెలుగు సినిమాలకు ఎక్కడెక్కడి నుంచో ఆర్టిస్టులు, టెక్నీషియన్లను తీసుకురావడం మామూలే. ముఖ్యంగా సినిమాటోగ్రాఫర్ల విషయంలో ఎక్కువగా వేరే ఇండస్ట్రీల మీద…
అవసరమున్నా లేకపోయినా.. సీక్వెల్స్కు లీడ్ ఇవ్వడం అన్నది ఈ రోజుల్లో మామూలైపోయింది. అలా హింట్ ఇచ్చిన సినిమాల్లో సెకండ్ పార్ట్…
పెద్ది థియేటర్ రన్ ముగింపు దిశగా వెళ్తోంది. ఈ వీకెండ్ కాస్త పికపయ్యే అవకాశాలున్నాయి. పాత రీ రిలీజులు తప్ప…