కొన్ని రోజులుగా హాట్ ఫొటో ఫొటో షూట్లు, వీడియోలతో మెగా అమ్మాయి కొణిదెల నిహారిక బాగానే వార్తల్లో నిలుస్తోంది. గ్లామర్ ఫీల్డులోకి రావడానికి కుటుంబం నుంచి అనుమతి పొందడానికి ఒకప్పుడు చాలా కష్టపడ నిహారిక.. కుటుంబాన్ని దృష్టిలో ఉంచుకునే తెరమీద ట్రెడిషనల్ క్యారెక్టర్లే చేసింది. ఫొటో షూట్లలోనూ హద్దులు దాటలేదు. కానీ ఈ మధ్య ఆమె ఆలోచన మారినట్లుంది.
ఫొటో షూట్లతో పాటు తాజాగా చేసిన ఓ డ్యాన్సింగ్ వీడియోలోనూ హాట్ హాట్గా కనిపించింది. దీంతో పరోక్షంగా తాను గ్లామర్ క్యారెక్టర్లు చేయడానికి రెడీ అని చెబుతున్నట్లే ఉందింది. కానీ తెలుగులో ఆమె చేసిన మూడు సినిమాలూ డిజాస్టర్లే అయ్యాయి. ముఖ్యంగా ఆమె నుంచి వచ్చిన చివరి సినిమా ‘సూర్య కాంతం’ దారుణమైన ఫలితాన్నందుకుంది. దీంతో మెగా అమ్మాయికి తెలుగులో మరో అవకాశం దక్కడం సందేహంగానే ఉంది.
కానీ ఆశ్చర్యకరంగా ఆమెకు తమిళంలో ఓ మంచి అవకాశం దక్కడం విశేషం. అశోక్ సెల్వన్ అనే కాస్త పేరున్న హీరోతోనే ఆమె జోడీ కట్టనుంది. ఇటీవలే అశోక్ ‘ఓ మై కడవులే’ సినిమాతో కెరీర్లో పెద్ద హిట్టు కొట్టాడు. ఈ సినిమాతో అతడికి క్రేజ్ పెరిగింది. ఓ కొత్త దర్శకురాలు రూపొందించబోయే సినిమాలో అశోక్, నిహారిక జంటగా నటించబోతున్నారని వార్తలొచ్చాయి. ఈ ప్రచారంపై నిహారిక స్పందించింది. ఆ వార్త నిజమే అని.. లాక్ డౌన్ పూర్తయి ఆ సినిమాలో ఎప్పుడెప్పుడు నటిద్దామా అని ఆత్రుతగా ఉందని చెప్పింది.
తమిళంలో నిహారిక ఇంతకుముందే ఓ పేరున్న సినిమాలో నటించింది. అందులో విజయ్ సేతుపతి కీలక పాత్ర చేశాడు. ఆ కామెడీ ఫాంటసీ మూవీ అక్కడ ఆశించిన ఫలితాన్నివ్వలేదు. దీంతో తమిళంలో కూడా నిహారికది ఫ్లాప్ ఎంట్రీనే అయింది. ఐతే తెలుగులో ఇంత బ్యాగ్రౌండ్ ఉండి సినిమాలు లేని నిహారికకు తమిళంలో రెండో అవకాశం రావడం ఆశ్చర్యమే.
This post was last modified on May 4, 2020 10:16 am
పాలన అంటే కార్యాలయాల్లో కూర్చుని సమీక్షలు చేయడమే కాదు. ప్రజల మధ్యకు వెళ్లి వారి సమస్యలను ప్రత్యక్షంగా చూడడమే నిజమైన…
తనపై విమర్శలు చేసే వారిని సహజంగా ఎవరైనా ప్రతివిమర్శలతో ఎదుర్కొంటారు. మాటకు మాట అంటారు. ఇక రాజకీయాల్లో అయితే ఈ…
ఇరు తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న జల వివాదాలపై యాగీ చేసుకోకుండా కూర్చుని మాట్లాడుకుంటే సమస్యలు పరిష్కారం అవుతాయని తెలంగాణ…
టీమ్ ఇండియా సీనియర్ పేసర్ మహమ్మద్ షమీ ఇంటర్నేషనల్ కెరీర్ దాదాపు ముగింపు దశకు చేరుకున్నట్లే కనిపిస్తోంది. గతేడాది జరిగిన…
రెండు రాష్ట్రాల మధ్య జల వివాదాలపై ఏపీ సీఎం చంద్రబాబు మరోసారి స్పందించారు. నీళ్లు వద్దు, గొడవలే కావాలని కొందరు…
సాధారణంగా ఏదైనా ఆర్డర్ ఇస్తే డెలివరీ బాయ్స్ వెంటనే ఇచ్చేసి వెళ్ళిపోతుంటారు. కానీ తమిళనాడులో జరిగిన ఒక ఘటన మాత్రం…