గత నలభై ఏడు సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న సిల్వర్ స్క్రీన్ కాంబినేషన్ ఎట్టకేలకు ప్రారంభం కాబోతోంది. రజనీకాంత్, కమల్ హాసన్ హీరోలుగా నెల్సన్ దర్శకత్వంలో రూపొందబోయే భారీ ప్యాన్ ఇండియా మూవీ అనౌన్స్ మెంట్ ఇవాళ వీడియో రూపంలో వచ్చేసింది.
ఏదో మొక్కుబడిగా నాలుగు కట్స్, రెండు ఫోటోలు వేయడం లాంటివి కాకుండా ప్రత్యేకంగా షూటింగ్ చేసి మరీ క్లిప్ వదిలారు. సూట్లు, బూట్లు, వాచీలు ఎంచుకోవడం దగ్గరి నుంచి ఒకే కారులో ఇద్దరు ప్రయాణించే దాకా నెల్సన్, అనిరుధ్ రవిచందర్ కలిసి చేసిన మేజిక్ మాములుగా లేదు. ఆహా ఏమీ కనువిందు అనుకునేలా ప్రెజెంట్ చేశారు.
బ్యాక్ గ్రౌండ్ చూస్తుంటే ఇది రెట్రో వింటేజ్ స్టైల్ లో రూపొందే గ్యాంగ్ స్టర్ డ్రామాలా కనిపిస్తోంది. సెటప్ కూడా ఎనభై తొంభై దశకం నాటిదనే క్లూస్ ఇచ్చారు. కమల్ రజని కలిసి ఇరవైకి పైగానే సినిమాల్లో కలిసి నటించారు. కానీ 1980 తర్వాత ఇద్దరికీ స్టార్ డం వచ్చాక వీళ్ళను బాలన్స్ చేసే కథతో ఏ దర్శకుడు రాకపోవడంతో ఈ కలయిక కాస్తా కలగా మిగిలిపోయింది.
దానికి తోడు మధ్యలో ఏవో చిన్న అపార్థాలు రాజకీయ కారణాలు కొంత గ్యాప్ తెచ్చినప్పటికీ స్నేహం విషయంలో కమల్, రజని ఇద్దరూ ఒకే మాట మీద ఉంటారు. అందుకే లోక నాయకుడి స్వంత బ్యానర్ రాజ్ కమల్ లో నటించేందుకు రజని రెండు స్క్రిప్టులు ఓకే చేశారు.
ప్రస్తుతం జైలర్ 2 పూర్తి చేసే పనిలో ఉన్న నెల్సన్ దిలీప్ కుమార్ ఆ తర్వాత కమల్ రజని మల్టీస్టారర్ ని తెరకెక్కించబోతున్నారు. స్క్రిప్ట్ దాదాపుగా లాకయ్యిందని సమాచారం. దశాబ్దాల తర్వాత వస్తున్న కలయిక కావడంతో అభిమానుల అంచనాలు అప్పుడే ఎగబాకడం మొదలయ్యింది.
చివరిసారి ఈ ఇద్దరు కలిసి నటించిన మూవీ హిందీలో వచ్చిన గిరఫ్తార్. కానీ ఫుల్ లెన్త్ రోల్స్ చేసింది మాత్రం అల్లాయుద్దీన్ అద్భుతదీపంలోనే. ఇది 1978లో రిలీజ్ అయ్యింది. 2028 విడుదలని టార్గెట్ చేసుకోబోతున్న ఈ క్రేజీ మూవీకి సంబంధించిన క్యాస్టింగ్, ఇతర టెక్నికల్ టీమ్ వివరాలు త్వరలోనే ప్రకటించబోతున్నారు.
This post was last modified on February 21, 2026 1:19 pm
అయేషా మీరా. ఉమ్మడి ఏపీలో 2007లో ఓ వ్యక్తి కామ దాహానికి బలి అయిపోయిన బీఫార్మసీ విద్యార్థిని. ఈ కేసులో…
గత వారం విడుదలైన సినిమాల్లో మంచి టాక్, రివ్యూస్ తెచ్చుకుంది కపుల్ ఫ్రెండ్లీకి ఒకటే. అయితే ఆశించిన పెద్ద మొత్తంలో…
అంతా నా ఇష్టం…అంతా నా ఇష్టం…ఎడాపెడా ఏది చేసినా అడిగేదెవడ్రా నా ఇష్టం అంటూ కౌరవుడు సినిమాలో నాగబాబు మాదిరిగా…
చరిత్రలో ముందు నుంచీ మహిళా దర్శకురాళ్లు తెలుగులోనే కాదు ఏ భాషలో అయినా తక్కువే. కేవలం విజయనిర్మల గారు ఒక్కరే…
చాలాకాలంగా కాంగ్రెస్ పార్టీపై, సీఎం రేవంత్ రెడ్డిపై మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేస్తున్న సంగతి…
ఏపీ సీఎం చంద్రబాబు ఏ చిన్న అవకాశాన్నీ వదలట్లేదా? అంటే.. ఔననే సమాధానమే వస్తోంది. పెట్టుబడులకు ఎక్కడ అవకాశం ఉంటే..…