ఒకప్పటి డిజాస్టర్లు ఇప్పుడు రీ రిలీజ్ ట్రెండ్ లో బాగా ఆడటం గమనిస్తున్నాం. ఆరెంజ్ మూడుసార్లు వచ్చినా కలెక్షన్లు కుమ్మరించింది. తమిళంలో బాబాని పెద్ద ఎత్తున పునః విడుదల చేస్తే వసూళ్లు బాగానే నమోదయ్యాయి. కానీ అన్నింటికి ఇదే ఫలితం రాదు. కొన్ని ఎన్నిసార్లు రుద్దినా జనాలు రిజెక్ట్ చేస్తూనే ఉంటారు.
రజనీకాంత్ ఫ్యాన్స్ అంత సులభంగా మర్చిపోలేని మూవీ కొచ్చడయాన్. తెలుగులో విక్రమసింహ పేరుతో డబ్బింగ్ చేసి వదిలారు. అన్ని భాషల్లో యనానిమస్ గా డిజాస్టర్ అయ్యింది. యానిమేషన్ మూవీని ఏదో రియల్ అన్నంత రేంజ్ లో ఓవర్ పబ్లిసిటీ చేయడం విపరీతమైన నెగటివిటీ తీసుకొచ్చింది.
ఇదంతా పన్నెండు సంవత్సరాల వెనుకటి మాట. అందరూ ఆ సినిమాని మర్చిపోయారు. కట్ చేస్తే ఇప్పుడీ విక్రమసింహని రిపేర్లు చేసి, ఏఐ టెక్నాలజీ వాడి, కొత్త కలర్లు అద్ది న్యూ వెర్షన్ సిద్ధం చేశారు. తాజాగా చిన్న ట్రైలర్ వదిలారు. బెటర్ అనిపించే తేడాలు ఉన్నాయి కానీ మరీ ఇప్పటికిప్పుడు చూసేయాలన్నంత ఎగ్జైట్ మెంట్ ఇచ్చేలా కూడా లేదు.
రజని కూతురు సౌందర్య దర్శకత్వం వహించిన ఈ పీరియాడిక్ డ్రామాలో బొమ్మల రూపంలో దీపికా పదుకునే హీరోయిన్ గా నటించింది. ఏఆర్ రెహమాన్ సంగీతం సైతం ఈ బ్యాడ్ ప్రోడక్ట్ ని కాపాడలేకపోయింది. ఇంత ఘనమైన చరిత్ర కొచ్చడయాన్ ది.
ఎంత రజని మేనియాని క్యాష్ చేసుకునే ప్రయత్నమైనా మరీ ఇంతగా వాడుకోవాలా అంటూ ఫ్యాన్స్ విమర్శలు గుప్పిస్తున్నారు. పడయప్పా, బాషా, అన్నామలై లాంటివి రీ రిలీజ్ చేసినా అర్థముంది కానీ 5జి జనరేషన్ లో ఇప్పుడు కొచ్చడయాన్ వదిలి మళ్ళీ ట్రోలింగ్ కు అవకాశం ఇస్తారా అంటూ అభిమానులే కామెంట్ చేస్తున్నారు.
విడుదల తేదీ గట్రా నిర్మాణ సంస్థ ప్రకటించలేదు కానీ జనాల రియాక్షన్లు తెలుసుకోవడానికి శాంపిల్ వదిలినట్టు కనిపిస్తోంది. కన్నబిడ్డ డైరెక్షన్ కాబట్టి రజని మరోసారి కెమెరా ముందుకు వచ్చి కొచ్చడయాన్ కోసం ప్రమోషన్లు చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఫ్యాన్స్ వద్దని కోరుకుంటున్నది ఇదే.
This post was last modified on February 17, 2026 10:29 pm
టాలీవుడ్లో ఘన చరిత్ర ఉన్న బేనర్లో లక్ష్మీప్రసన్న పిక్చర్స్ ఒకటి. ఈ బేనర్ మీద పదుల సంఖ్యలో సినిమాలు తీశారు…
‘యమదొంగ’ చిత్రంతో టాలీవుడ్లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది మలయాళ భామ మమతా మోహన్ దాస్. ఆ చిత్రంలో చలాకీ పాత్ర…
ఇరు తెలుగు రాష్ట్రాలకు చెందిన రాజకీయ నాయకుల్లో చాలామంది పెద్దగా భావోద్వేగాలకు లోను కారు. మిన్ను విరిగి మీద పడ్డా…ఎన్నికల…
మన శంకరవరప్రసాద్ గారు రూపంలో చిరంజీవికి బ్లాక్ బస్టర్ కానుక ఇచ్చి రెమ్యునరేషన్ తో పాటు రేంజ్ రోవర్ కారు…
24 ఏళ్ల కిందట ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే కాక దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయిన నటి ప్రత్యూష మృతి వ్యవహారంలో సుప్రీం కోర్టు…
ఇమేజ్, మార్కెట్ ఉన్న హీరో సినిమాలు రెండు కేవలం ఒకే రోజు గ్యాప్ తో విడుదల కావడం చాలా ఇబ్బందికరమైన…