ఇళయరాజా సంగీతం అంటే చెవికోసుకునే సంగీత ప్రియులు దక్షిణాదిన కోట్లల్లో ఉన్నారు. దశాబ్దాలుగా ఆయన పాటలను వింటూ వాళ్లు పొందుతున్న అనుభూతి గురించి మాటల్లో వర్ణించడం కష్టం. తర్వాతి తరానికి కూడా ఆయన పాటల మాధుర్యమేంటో తెలియాలన్నది ఆయన అభిమానుల కోరిక. కానీ ఇళయరాజా తీరుతో ఏదైనా సినిమాల్లో ఇళయరాజా పాటనో, బీజీఎంనో ఉపయోగించాలన్నా భయపడే పరిస్థితి. లీగల్ నోటీసులు, కేసులతో రాజా బెంబేలెత్తించేస్తున్నారు.
అనుమతి తీసుకుని, డబ్బులు చెల్లిస్తే తప్ప ఆయన పాటలు, బీజీఎంను ఉపయోగించడానికి వీల్లేని పరిస్థితి. ఇంత తతంగం ఎందుకని క్రమంగా ఆయన పాటల జోలికి వెళ్లడం మానేస్తున్నారు. పాటకు సంబంధించి ప్రథమ హక్కు సంగీత దర్శకుడిదే కదా, ఎవరు ఆ వర్క్ వాడుకున్నా రాయల్టీ ఇవ్వాలి కదా అనే చర్చ ఓవైపు ఉన్నప్పటికీ.. ఇళయరాజా తీరు అలా ఉండట్లేదన్నది మెజారిటీ వాదన.
కమర్షియల్గా వాడుకోవడం కంటే.. ఆయన మీద తమ ప్రేమను చాటుతున్నా, ఆయన సంగీతాన్ని సెలబ్రేట్ చేస్తున్నా ఆయన ఊరుకోవడం లేదు. దీంతో ఇళయరాజా మరీ కమర్షియల్ అయిపోతున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఐతే కాపీ రైట్ కేసులతో సినిమా బృందాలను, ఆడియో సంస్థలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న ఇళయరాజాకు ఇప్పుడు రివర్స్ షాక్ తగిలింది. ‘సరిగమ’ సంస్థ తమకు హక్కులున్న సినిమాల పాటలను ఇళయరాజా వాడుకోవడం, వేరే సంస్థలకు రైట్స్ రాసి ఇవ్వడం మీద కోర్టును ఆశ్రయించింది. ఈ కేసులో ఇళయరాజాకు కోర్టు షాకిచ్చింది.
దీంతో తాను సంగీతం అందించిన పలు చిత్రాల పాటలు, బీజీఎంను ఉపయోగించుకోలేని పరిస్థితి తలెత్తింది. తన మ్యూజికల్ కన్సర్ట్స్లో కూడా ఆయన ఈ పాటలను వాడుకోవడానికి వీల్లేదట. ఇది ఇళయరాజాకు తీవ్ర ఇబ్బంది కలిగించే విషయమే.
చాలామంది దీన్ని ‘టిట్ ఫర్ ట్యాట్’ అంటున్నారు. ఐతే ఈ అనుభవం తర్వాత అయినా ఇళయరాజాలో మార్పు రావాలని.. తన పాటలు, బీజీఎం విషయంలో ఆంక్షలకు బ్రేక్ వేస్తే మంచిది అని ఆయన అభిమానులే అభిప్రాయపడుతున్నారు.
This post was last modified on February 18, 2026 10:25 am
బీఆర్ ఎస్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అరెస్టు నేపథ్యంలో తెలంగాణ రాజకీయాలు మరో సారి నిప్పు రాజుకున్నాయి.…
ఎట్టకేలకు మాజీ మంత్రి అంబటి రాంబాబు రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విడుదలయ్యారు.అంబటి రాంబాబుపై ఉన్న అన్ని కేసుల్లోనూ ఆయనకు…
ఒకప్పుడు నిర్మాతలకు విపరీతమైన గౌరవం ఉండేది. పరిశ్రమను పోషించేది వాళ్లే కాబట్టి హీరో హీరోయిన్ దగ్గర నుంచి సాంకేతిక నిపుణులు,…
తెలంగాణలోని జగిత్యాల జిల్లా కోరుట్ల బస్టాండ్లో ఒక వింత సంఘటన స్థానికులను, ప్రయాణికులను ఆశ్చర్యానికి గురిచేసింది. బుర్ఖా వేసుకుని మహిళల…
తాజాగా రాజ్యసభలో ఖాళీ అవుతున్న 37 స్థానాలకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికలు నిర్వహించేందుకు రెడీ అయింది. దీనికి…
ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్.. గత ఆదివారం కొలంబోకు వెళ్లి ఇండియా, పాకిస్థాన్ మధ్య టీ20 ప్రపంచకప్ మ్యాచ్ను వీక్షించడం…