బాలీవుడ్ కమెడియన్ రాజ్పాల్ యాదవ్ చెక్ బౌన్స్ కేసులో తీహార్ జైల్లో ఉన్న విషయం తెలిసిందే. 2010 లో అడ్వాన్స్ కు సంబంధించిన కేసులో రాజ్పాల్ యాదవ్ దోషిగా ఉన్నారు. దాదాపు కొన్నేళ్లుగా సాగుతున్న ఈ కేసుకి సంబంధించిన తీర్పు ఇటీవలే వచ్చింది. ఢిల్లీ కోర్టు రాజ్పాల్ యాదవ్ ని దోషిగా నిర్దార్దించింది. తనకు కొంత సమయం కావాలని అడిగినా కూడా కోర్టు అందుకు అంగీకరించలేదు.
రాజ్పాల్ యాదవ్ ఆర్ధిక ఇబ్బందుల వల్ల తిరిగి ఆ మొత్తాన్ని చెల్లించలేని పరిస్థితి ఏర్పడింది. అందుకే ఆయనకు లొంగిపోవడం తప్ప మరో అవకాశం లేకుండా పోయింది. మరోసారి తన వాదన వినిపించేందుకు ప్రయత్నిస్తున్నారు రాజ్పాల్ యాదవ్. ఈ క్రమంలో ఢిల్లీ హైకోర్ట్ ఈ కేసుని ఫిబ్రవరి 16 కి వాయిదా వేసింది.
నేడు మరోసారి ఢిల్లీ హైకోర్టులో రాజ్పాల్ యాదవ్ కేసు విచారణ జరుగుతుంది. ఐతే ఇదే టైంలో రాజ్పాల్ యాదవ్ కు ప్రముఖ నటుడు సోనూసూద్ సోషల్ మీడియా ద్వారా సపోర్ట్ అందించారు. ఈరోజు సోదరుడు రాజ్పాల్ యాదవ్ భాయ్ కి ముఖ్యమైన రోజు. పరిస్థితులు అన్ని సరైన దిశలో జరగాలని దీని నుంచి ఆయనకు ఉపశమనం లభించాలని ప్రార్ధిస్తున్నా. ఎంతో ప్రతిభ, అద్భుతమైన వ్యక్తి ఆయన. ఆయనతో నిలబడి ఈ మొమెంటం తగ్గకుండా చూద్దాం.. అన్ని విషయాలు సరైన విధానంలో జరిగేలా చూద్దామని రాసుకొచ్చారు.
అంతకుముందే సోనూ సూద్ ఈ కేసు విషయమై రాజ్పాల్ యాదవ్ కు సాయం చేయాలని సోషల్ మీడియా ద్వారా పిలుపునిచ్చారు. సినీ పరిశ్రమలో ఎవరికి ఏ కష్టం వచ్చినా సోనూ సూద్ ముందుంటాడు. అతని సేవా గుణం, మంచి మనసు ప్రజలను అతనికి మరింత దగ్గర చేస్తుంది. ఇప్పుడు బాలీవుడ్ కమెడియన్ రాజ్పాల్ యాదవ్ కోసం సోనూ సూద్ స్టాండ్ తీసుకుని నిలబడటం కూడా అతని మంచి హృదయాన్ని తెలియచేస్తుంది.
This post was last modified on February 17, 2026 12:53 pm
ఏ బ్యాగ్రౌండ్ లేకుండా తెలుగు సినిమా పరిశ్రమలోకి అడుగు పెట్టి చాలా కష్టపడి పెద్ద స్టార్లలో ఒకడిగా ఎదిగాడు మాస్…
తెలుగులో మంచి ఫాలోయింగ్ ఉన్న మలయాళ భామ అనుపమ పరమేశ్వరన్ పదేళ్ల కెరీర్లో పెద్దగా ఎఫైర్ వార్తలేమీ వచ్చింది లేదు.…
ప్రభాస్ సినిమా అంటే చాలు.. హైప్కు ఏమీ లోటు ఉండదు. రిలీజ్ దగ్గర పడేకొద్దీ అభిమానులతో పాటు సామాన్య ప్రేక్షకుల్లోనూ…
ఇదేమీ ఊహాజనిత వార్తకాదు. కొందరు పుట్టించిన గ్యాసిప్ కూడా కాదు!. అక్షరాలా.. తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ పార్టీలో గత…
ఏపీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు.. ఎప్పటి నుంచో ఒక మాట చెబుతున్నారు. చెప్పడమే కాదు.. అంతర్జాతీయ వేదికలపైనా ఆయన తన వాణిని…
మాస్ మహారాజా రవితేజ ఇరుముడి ఆగస్ట్ 21 విడుదల కానుంది. వరస ఫ్లాపుల నుంచి బయటపడేసే సినిమాగా అభిమానులు దీని…