బాలీవుడ్ కమెడియన్ రాజ్పాల్ యాదవ్ చెక్ బౌన్స్ కేసులో తీహార్ జైల్లో ఉన్న విషయం తెలిసిందే. 2010 లో అడ్వాన్స్ కు సంబంధించిన కేసులో రాజ్పాల్ యాదవ్ దోషిగా ఉన్నారు. దాదాపు కొన్నేళ్లుగా సాగుతున్న ఈ కేసుకి సంబంధించిన తీర్పు ఇటీవలే వచ్చింది. ఢిల్లీ కోర్టు రాజ్పాల్ యాదవ్ ని దోషిగా నిర్దార్దించింది. తనకు కొంత సమయం కావాలని అడిగినా కూడా కోర్టు అందుకు అంగీకరించలేదు.
రాజ్పాల్ యాదవ్ ఆర్ధిక ఇబ్బందుల వల్ల తిరిగి ఆ మొత్తాన్ని చెల్లించలేని పరిస్థితి ఏర్పడింది. అందుకే ఆయనకు లొంగిపోవడం తప్ప మరో అవకాశం లేకుండా పోయింది. మరోసారి తన వాదన వినిపించేందుకు ప్రయత్నిస్తున్నారు రాజ్పాల్ యాదవ్. ఈ క్రమంలో ఢిల్లీ హైకోర్ట్ ఈ కేసుని ఫిబ్రవరి 16 కి వాయిదా వేసింది.
నేడు మరోసారి ఢిల్లీ హైకోర్టులో రాజ్పాల్ యాదవ్ కేసు విచారణ జరుగుతుంది. ఐతే ఇదే టైంలో రాజ్పాల్ యాదవ్ కు ప్రముఖ నటుడు సోనూసూద్ సోషల్ మీడియా ద్వారా సపోర్ట్ అందించారు. ఈరోజు సోదరుడు రాజ్పాల్ యాదవ్ భాయ్ కి ముఖ్యమైన రోజు. పరిస్థితులు అన్ని సరైన దిశలో జరగాలని దీని నుంచి ఆయనకు ఉపశమనం లభించాలని ప్రార్ధిస్తున్నా. ఎంతో ప్రతిభ, అద్భుతమైన వ్యక్తి ఆయన. ఆయనతో నిలబడి ఈ మొమెంటం తగ్గకుండా చూద్దాం.. అన్ని విషయాలు సరైన విధానంలో జరిగేలా చూద్దామని రాసుకొచ్చారు.
అంతకుముందే సోనూ సూద్ ఈ కేసు విషయమై రాజ్పాల్ యాదవ్ కు సాయం చేయాలని సోషల్ మీడియా ద్వారా పిలుపునిచ్చారు. సినీ పరిశ్రమలో ఎవరికి ఏ కష్టం వచ్చినా సోనూ సూద్ ముందుంటాడు. అతని సేవా గుణం, మంచి మనసు ప్రజలను అతనికి మరింత దగ్గర చేస్తుంది. ఇప్పుడు బాలీవుడ్ కమెడియన్ రాజ్పాల్ యాదవ్ కోసం సోనూ సూద్ స్టాండ్ తీసుకుని నిలబడటం కూడా అతని మంచి హృదయాన్ని తెలియచేస్తుంది.
This post was last modified on February 17, 2026 12:53 pm
`క్యాసినో కింగ్`గా గుర్తింపు తెచ్చుకుని వందల కోట్ల రూపాయలను అక్రమంగా ఆర్జించారన్న కేసులు ఎదుర్కొంటున్న చీకోటి ప్రవీణ్కు బీజేపీ కీలక…
ప్రభాస్ కెరీర్లో ‘బాహుబలి-2’ తర్వాత అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచిన ‘కల్కి’ మెజారిటీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. కేవలం రెండు…
గత ఏడాది కుంభమేళా సందర్భంగా కెమెరాల కళ్లలో పడి విపరీతమైన పాపులారిటీ సంపాదించిన అమ్మాయి.. మోనాలిసా. మధ్యప్రదేశ్లోని ఇండోర్కు చెందిన…
ఇరాన్తో యుద్ధం విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రాంగ్ స్టెప్ వేశారా? నాణేనికి ఒక వైపే చూశారా? అంటే..…
దేశంలో గతంలో ఎన్నడూ లేని విధంగా పలు కీలక అంశాలు చోటు చేసుకుంటున్నాయి. ఏకంగా ప్రధాని పైనే గత ఐదేళ్లలో…
ఏపీలో కడుపేదల కోసం పీ 4 ఫార్ములాను రూపొందించి దానిని అమలు చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పుడు కలెక్టర్ల…