బాలీవుడ్ కమెడియన్ రాజ్పాల్ యాదవ్ చెక్ బౌన్స్ కేసులో తీహార్ జైల్లో ఉన్న విషయం తెలిసిందే. 2010 లో అడ్వాన్స్ కు సంబంధించిన కేసులో రాజ్పాల్ యాదవ్ దోషిగా ఉన్నారు. దాదాపు కొన్నేళ్లుగా సాగుతున్న ఈ కేసుకి సంబంధించిన తీర్పు ఇటీవలే వచ్చింది. ఢిల్లీ కోర్టు రాజ్పాల్ యాదవ్ ని దోషిగా నిర్దార్దించింది. తనకు కొంత సమయం కావాలని అడిగినా కూడా కోర్టు అందుకు అంగీకరించలేదు.
రాజ్పాల్ యాదవ్ ఆర్ధిక ఇబ్బందుల వల్ల తిరిగి ఆ మొత్తాన్ని చెల్లించలేని పరిస్థితి ఏర్పడింది. అందుకే ఆయనకు లొంగిపోవడం తప్ప మరో అవకాశం లేకుండా పోయింది. మరోసారి తన వాదన వినిపించేందుకు ప్రయత్నిస్తున్నారు రాజ్పాల్ యాదవ్. ఈ క్రమంలో ఢిల్లీ హైకోర్ట్ ఈ కేసుని ఫిబ్రవరి 16 కి వాయిదా వేసింది.
నేడు మరోసారి ఢిల్లీ హైకోర్టులో రాజ్పాల్ యాదవ్ కేసు విచారణ జరుగుతుంది. ఐతే ఇదే టైంలో రాజ్పాల్ యాదవ్ కు ప్రముఖ నటుడు సోనూసూద్ సోషల్ మీడియా ద్వారా సపోర్ట్ అందించారు. ఈరోజు సోదరుడు రాజ్పాల్ యాదవ్ భాయ్ కి ముఖ్యమైన రోజు. పరిస్థితులు అన్ని సరైన దిశలో జరగాలని దీని నుంచి ఆయనకు ఉపశమనం లభించాలని ప్రార్ధిస్తున్నా. ఎంతో ప్రతిభ, అద్భుతమైన వ్యక్తి ఆయన. ఆయనతో నిలబడి ఈ మొమెంటం తగ్గకుండా చూద్దాం.. అన్ని విషయాలు సరైన విధానంలో జరిగేలా చూద్దామని రాసుకొచ్చారు.
అంతకుముందే సోనూ సూద్ ఈ కేసు విషయమై రాజ్పాల్ యాదవ్ కు సాయం చేయాలని సోషల్ మీడియా ద్వారా పిలుపునిచ్చారు. సినీ పరిశ్రమలో ఎవరికి ఏ కష్టం వచ్చినా సోనూ సూద్ ముందుంటాడు. అతని సేవా గుణం, మంచి మనసు ప్రజలను అతనికి మరింత దగ్గర చేస్తుంది. ఇప్పుడు బాలీవుడ్ కమెడియన్ రాజ్పాల్ యాదవ్ కోసం సోనూ సూద్ స్టాండ్ తీసుకుని నిలబడటం కూడా అతని మంచి హృదయాన్ని తెలియచేస్తుంది.
సీనియర్లలో ఎక్కువ వేగంగా సినిమాలు చేస్తున్న హీరోల్లో మొదటి స్థానం బాలకృష్ణకే ఇవ్వాలి. ఎందుకంటే భోళాశంకర్ తర్వాత చిరంజీవి ఏకంగా…
ఇప్పటి వరకు ఒక లెక్క.. ఇక నుంచి మరో లెక్క.. అన్నట్టుగా వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ పరిస్థితి…
పెద్ది మొదటి వారం పూర్తి చేసుకుని సెకండ్ వీక్ లో అడుగు పెట్టింది. మూడు వందల యాభై కోట్ల వైపు…
ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తన పేరు వెనుక ఉన్న ఆసక్తికరమైన కథను వెల్లడించారు. జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో…
పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం నేపథ్యంలో ఇందన పొదుపు దిశగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కీలక సూచనలు చేశాక… మన…
ఏపీ ప్రభుత్వ పాఠశాలల్లో ప్రముఖ ప్రవచ కర్త చాగంటి కోటేశ్వరరావు ప్రసంగాలను పాఠ్యాంశాలుగా ప్రవేశ పెడుతున్నట్టు ప్రకటించింది. దీనికి సంబంధించి…