బాలీవుడ్ కమెడియన్ రాజ్పాల్ యాదవ్ చెక్ బౌన్స్ కేసులో తీహార్ జైల్లో ఉన్న విషయం తెలిసిందే. 2010 లో అడ్వాన్స్ కు సంబంధించిన కేసులో రాజ్పాల్ యాదవ్ దోషిగా ఉన్నారు. దాదాపు కొన్నేళ్లుగా సాగుతున్న ఈ కేసుకి సంబంధించిన తీర్పు ఇటీవలే వచ్చింది. ఢిల్లీ కోర్టు రాజ్పాల్ యాదవ్ ని దోషిగా నిర్దార్దించింది. తనకు కొంత సమయం కావాలని అడిగినా కూడా కోర్టు అందుకు అంగీకరించలేదు.
రాజ్పాల్ యాదవ్ ఆర్ధిక ఇబ్బందుల వల్ల తిరిగి ఆ మొత్తాన్ని చెల్లించలేని పరిస్థితి ఏర్పడింది. అందుకే ఆయనకు లొంగిపోవడం తప్ప మరో అవకాశం లేకుండా పోయింది. మరోసారి తన వాదన వినిపించేందుకు ప్రయత్నిస్తున్నారు రాజ్పాల్ యాదవ్. ఈ క్రమంలో ఢిల్లీ హైకోర్ట్ ఈ కేసుని ఫిబ్రవరి 16 కి వాయిదా వేసింది.
నేడు మరోసారి ఢిల్లీ హైకోర్టులో రాజ్పాల్ యాదవ్ కేసు విచారణ జరుగుతుంది. ఐతే ఇదే టైంలో రాజ్పాల్ యాదవ్ కు ప్రముఖ నటుడు సోనూసూద్ సోషల్ మీడియా ద్వారా సపోర్ట్ అందించారు. ఈరోజు సోదరుడు రాజ్పాల్ యాదవ్ భాయ్ కి ముఖ్యమైన రోజు. పరిస్థితులు అన్ని సరైన దిశలో జరగాలని దీని నుంచి ఆయనకు ఉపశమనం లభించాలని ప్రార్ధిస్తున్నా. ఎంతో ప్రతిభ, అద్భుతమైన వ్యక్తి ఆయన. ఆయనతో నిలబడి ఈ మొమెంటం తగ్గకుండా చూద్దాం.. అన్ని విషయాలు సరైన విధానంలో జరిగేలా చూద్దామని రాసుకొచ్చారు.
అంతకుముందే సోనూ సూద్ ఈ కేసు విషయమై రాజ్పాల్ యాదవ్ కు సాయం చేయాలని సోషల్ మీడియా ద్వారా పిలుపునిచ్చారు. సినీ పరిశ్రమలో ఎవరికి ఏ కష్టం వచ్చినా సోనూ సూద్ ముందుంటాడు. అతని సేవా గుణం, మంచి మనసు ప్రజలను అతనికి మరింత దగ్గర చేస్తుంది. ఇప్పుడు బాలీవుడ్ కమెడియన్ రాజ్పాల్ యాదవ్ కోసం సోనూ సూద్ స్టాండ్ తీసుకుని నిలబడటం కూడా అతని మంచి హృదయాన్ని తెలియచేస్తుంది.
This post was last modified on February 17, 2026 12:53 pm
గుంటూరు పశ్చిమ నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే గళ్లా మాధవి తీసుకున్న వినూత్న నిర్ణయం చర్చనీయాంశంగా మారింది. బీకాం చదువుకున్న ఓ…
ఒక హీరో చేయాల్సిన సినిమా ఇంకో హీరో చేతికి వెళ్లడం సినీ పరిశ్రమలో కామన్ వ్యవహారం. ఇలా మిస్ అయిన…
ఇరవై ఏడు సంవత్సరాల క్రితం వచ్చిన దేవి సినిమాకు టాలీవుడ్ లో ఒక ప్రత్యేక స్థానం ఉంది. అమ్మోరు లాంటి…
ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్, ఢిల్లీ మాజీముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్పై అదే పార్టీ నుంచి ఎంపీగా విజయం దక్కించుకుని.. ప్రస్తుతం…
తాము నిర్మించే సినిమాలు ఎంత నష్టం తెచ్చిపెట్టినా… తమను ఎంతగా కుదేలు చేసినా.. వాటి గురించి ఓపెన్ అవ్వడానికి నిర్మాతలు…
వైసీపీలో మరోసారి సజ్జల రామకృష్ణారెడ్డి శకం ప్రారంభం అవుతుందని పార్టీ నాయకులు చెబుతున్నారు. పార్టీ అధినేత, మాజీ సీఎం జగన్..…