సింగరేణి బొగ్గు టెండర్ల వ్యవహారంలో కాంగ్రెస్ పార్టీలోని కీలక నేతల మధ్య విభేదాలు వచ్చాయని మీడియాలో కథనాలు వచ్చిన సంగతి తెలిసిందే. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కల మధ్య విభేదాలు రచ్చకెక్కాయని ప్రచారం జరిగింది.
అయితే, ఆ ప్రచారం సంగతి పక్కనబెడితే..రాజకీయాలకు అతీతంగా భట్టి విక్రమార్క చేసిన పని విమర్శకుల ప్రశంసలు అందుకుంటోంది. మహా శివరాత్రి సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డితోపాటు కేబినెట్ మంత్రుల పేర్లతో భట్టి ప్రత్యేక పూజలు నిర్వహించిన వైనం హాట్ టాపిక్ గా మారింది.
శివరాత్రి సందర్భంగా ఖమ్మం జిల్లా మధిరలోని గంగా పార్వతీ సమేత మృత్యుంజయ స్వామి గర్భాలయంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సతీసమేతంగా ప్రత్యేక పూజలు చేశారు. ఆ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి, కేబినెట్ మంత్రుల పేరిట భట్టి దంపతులు గోత్ర నామాలతో అర్చన చేయించడం విశేషం.
రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్, సీతక్క, జూపల్లి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొంగులేటి శ్రీనివాస, తుమ్మల నాగేశ్వరరావు, దామోదర రాజనర్సింహ తదితరుల పేర్లతో భట్టి ప్రత్యేకంగా పూజలు నిర్వహించారు.
తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించి సుభిక్షంగా ఎదగాలని, ప్రతి కుటుంబ ఆర్థిక స్థితి మెరుగుపడాలని భట్టి ఆంకాంక్షించారు. రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని పరమశివుడిని ప్రార్థించినట్లు తెలిపారు.
ప్రస్తుతం భట్టి ప్రత్యేక పూజలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. తన సహచర మంత్రుల పేరుపేరున పూజలు నిర్వహించిన భట్టి విక్రమార్కపై సోషల్ మీడియాలో ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. విమర్శకులు సైతం భట్టిని ప్రశంసిస్తున్నారు.
పెద్ద సినిమా విడుదలవుతున్న ప్రతిసారి తెలంగాణలో టికెట్ రేట్ల పెంపు అనేది పెద్ద సమస్యగా మారిపోయింది. ప్రతిసారి ప్రభుత్వాన్ని అడగలేక,…
మాములుగా దర్శక నిర్మాతలు తమ సినిమాకు ఎంత ఖర్చు పెట్టినా బడ్జెట్ ని బాహాటంగా బయటికి చెప్పుకోరు. దానికి కారణాలు…
ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాటల్లో రాజీపడరు.. చేతల్లో ఆలస్యం చేయరు. ఇదేదో మనం చెప్పే మాట కాదు..…
తన కొత్త సినిమా పెద్ది ప్రమోషన్లలో భాగంగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఎక్కడికి వెళ్లినా… ఆయన వెంట…
ఇండస్ట్రీలో హీరోయిన్ల కెరీర్ కు ఒక ఎక్స్ పైరీ డేట్ ఉంటుందనేది ఎప్పటినుంచో వినిపించే మాటే. పాతికేళ్ల నుంచి ముప్పై…
మహారాష్ట్ర ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నాయకుడు దేవేంద్ర ఫడణవీస్తో ఏపీ మంత్రి, టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్…