రెండు దశాబ్దాల కిందట ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సంచలనం రేపిన సినీ నటి ప్రత్యూష మృతి కేసులో సుప్రీం కోర్టు మంగళవారం తుది తీర్పును వెలువరించంది. ఈ కేసులో హైకోర్టు విధించిన జైలు శిక్షను నిందితుడు సిద్దార్థ రెడ్డి సవాలు చేస్తూ వేసిన పిటిషన్ను సర్వోన్నత న్యాయస్థానం కొట్టేసింది. నిందితుడికి హైకోర్టు విధించిన శిక్షను సమర్థించిన సుప్రీం కోర్టు.. సిద్దార్థ రెడ్డిని నాలుగు వారాల్లో లొంగిపోవాలని ఆదేశాలు జారీ చేసింది.
ప్రత్యూష కేసును విచారించిన సీబీఐ.. నిందితుడిపై ఆత్మహత్యకు ప్రయత్నించి, ఆత్మహత్యకు పురిగొల్పిన సెక్షన్ల కింద ఛార్జిషీట్ దాఖలుచేసింది. ముందుగా హైదరాబాద్ మెట్రోపాలిటిన్ కోర్టు సిద్దార్థకు ఐదేళ్ల జైలు శిక్ష విధించింది. ఈ తీర్పుపై సిద్దార్థ రెడ్డి హైకోర్టును ఆశ్రయించగా.. జైలు శిక్షను రెండేళ్లకు తగ్గిస్తూ జరిమానా విధించింది.
ఐతే ఈ తీర్పును కూడా సవాలు చేస్తూ సిద్దార్థ రెడ్డి సుప్రీం కోర్టును ఆశ్రయించగా.. ఇప్పుడు సర్వోన్నత న్యాయస్థానం హైకోర్టు తీర్పును సమర్థిస్తూ ఆదేశాలు జారీ చేసింది.
ప్రత్యూష 2000 ప్రాంతంలో తెలుగు సినిమాల్లోకి దూసుకొచ్చింది. రాయుడు, కలుసుకోవాలని లాంటి చిత్రాల్లో నటించింది. ఇంటర్ చదువుతున్నపుడే ఆమె సిద్దార్థ రెడ్డితో ప్రేమలో పడింది.
ఇంటర్ పూర్తయ్యాక ప్రత్యూష సినిమాల్లోకి వెళ్లగా.. సిద్దార్థ రెడ్డి ఇంజినీరింగ్లో చేరాడు. ఐతే 2002లో ఫిబ్రవరి 23న రాత్రి విషం తాగిన స్థితిలో ప్రత్యూష, సిద్దార్థ ఆసుపత్రిలో చేరారు. ఐతే తర్వాతి రోజు ప్రత్యూష చనిపోగా.. సిద్దార్థ ప్రాణాలతో బయటపడ్డాడు. రెండు వారాల తర్వాత అతను డిశ్చార్జి అయ్యాడు. వాళ్లిద్దరూ కూల్ డ్రింకులో పురుగుల మందు కలుపుకుని తాగినట్లు తేలింది.
ఐతే ప్రత్యూషది సాధారణ ఆత్మహత్యే అని.. ఆమెపై అంతకుముందు లైంగిక దాడి ఏమీ జరగలేదని వైద్యుల బృందం నిర్ధారించింది. ఐతే ఆమెను ఆత్మహత్యకు పురిగొల్పినందుకు సిద్దార్థను నిందితుడిగా పరిగణించి అతడిని పోలీసులు అరెస్ట్ చేసి కేసులు నమోదు చేశారు. అప్పట్లో సంచలనంరేపిన ఈ కేసును ప్రభుత్వం సీబీఐకి అప్పగించింది.
This post was last modified on February 17, 2026 12:45 pm
చాలా సెలెక్టివ్ గా సినిమాలు చేసే సాయిపల్లవి కాంబోల కన్నా ఎక్కువగా కంటెంట్ కి ప్రాధాన్యం ఇవ్వడం అందరికీ తెలిసిన…
గుంటూరు పశ్చిమ నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే గళ్లా మాధవి తీసుకున్న వినూత్న నిర్ణయం చర్చనీయాంశంగా మారింది. బీకాం చదువుకున్న ఓ…
ఒక హీరో చేయాల్సిన సినిమా ఇంకో హీరో చేతికి వెళ్లడం సినీ పరిశ్రమలో కామన్ వ్యవహారం. ఇలా మిస్ అయిన…
ఇరవై ఏడు సంవత్సరాల క్రితం వచ్చిన దేవి సినిమాకు టాలీవుడ్ లో ఒక ప్రత్యేక స్థానం ఉంది. అమ్మోరు లాంటి…
ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్, ఢిల్లీ మాజీముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్పై అదే పార్టీ నుంచి ఎంపీగా విజయం దక్కించుకుని.. ప్రస్తుతం…
తాము నిర్మించే సినిమాలు ఎంత నష్టం తెచ్చిపెట్టినా… తమను ఎంతగా కుదేలు చేసినా.. వాటి గురించి ఓపెన్ అవ్వడానికి నిర్మాతలు…