హిందీలోనే కాదు తెలుగుతో సహా ఇతర బాషల ఆడియన్స్ ఎదురు చూస్తున్న సినిమా దురంధర్ 2 ది రివెంజ్. మార్చి 19 విడుదల ఎంతో దూరంలో లేకపోవడంతో అభిమానులు కౌంట్ డౌన్ మొదలుపెట్టేశారు. అయితే ట్విస్ట్ ఏంటంటే ఇంకా దీని షూటింగ్ జరుగుతూనే ఉంది. బ్యాలన్స్ ఉన్న కొన్ని ఎపిసోడ్లను శరవేగంగా పూర్తి చేస్తున్నారు.
తాజాగా దురంధర్ 2 బృందం ఒక కొత్త సమస్యను తెచ్చుకున్నట్టు బాలీవుడ్ రిపోర్ట్. ముంబైలో ఉన్న చారిత్రక ఫోర్ట్ ఏరియాలో ప్రస్తుతం చిత్రీకరణ జరుగుతోంది. వాతావరణం, పర్యావరణానికి ఎలాంటి ఇబ్బందులు కలిగించమని ముంబై సిటీ కౌన్సిల్ దగ్గర అనుమతులు తీసుకున్నారు.
కానీ షూటింగ్ జరుగుతున్న టైంలో పెద్ద ఎత్తున బాణాసంచాతో పాటు నిప్పు రాజేసి ఫైట్లు చిత్రీకరించడంతో ఎంసిసికి ఫిర్యాదు వెళ్ళింది. నిషేధ వస్తువులను ఎలా వాడతారంటూ అధికారులు దురంధర్ 2 బృందానికి హెచ్చరిక జారీ చేశారట.
అయినా సరే ఫిబ్రవరి 14 అర్ధరాత్రి దాటిన తర్వాత ఫ్లడ్ లైట్లతో పాటు ప్రమాదరక వస్తువులతో తిరిగి కొనసాగించడంతో దర్శకుడు ఆదిత్య ధార్ కు చెందిన బి62 స్టూడియోస్ మీద బ్యాన్ విధించే ఆలోచనలో ముంబై సిటీ కౌన్సిల్ ఉన్నట్టు సమాచారం. అదే జరిగితే నగరంలో ఉన్న లొకేషన్లకు అనుమతులు దొరకడం అసాధ్యమవుతుంది. ఇదంతా నిబంధనలు అతిక్రమించడం వల్ల జరిగింది.
ఇప్పుడీ పరిణామాల ప్రభావం విడుదల మీద ఉండకపోవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. మార్చి 19 కేవలం నెల రోజుల దూరంలో ఉండటంతో నిర్మాణాంతర కార్యక్రమాలు ఊపందుకుంటున్నాయి. పుష్ప 2 రికార్డులను ఇది బద్దలు కొడుతుందనే రేంజ్ లో నార్త్ వర్గాలలో ఓ రేంజ్ అంచనాలున్నాయి.
యష్ టాక్సిక్ పోటీ వల్ల దక్షిణాదిలో స్క్రీన్ల సమస్య వచ్చినా దాన్ని ధీటుగా ఎదురుకునేందుకు నిర్మాణ భాగస్వామి జియో స్టూడియోస్ హైదరాబాద్ లో ఒక ఆఫీస్ తీసిందనే టాక్ ఇప్పటికే ప్రచారంలో ఉంది. ఎట్టి పరిస్థితుల్లో వాయిదా లేకుండా ఆదిత్య ధార్ డే అండ్ నైట్ దురంధర్ రివెంజ్ పనుల్లోనే తలమునకలై ఉన్నారు.
ఇటీవలే విడుదలైన బాలీవుడ్ మూవీ 'మై వాపస్ ఆవుంగా'కు తొలి రోజు రివ్యూలు ఏమంత ఆశాజనకంగా లేవు. పబ్లిక్ టాక్…
సాయిధరమ్ తేజ్ హీరోగా రెండేళ్ల ముందు మొదలైన సినిమా.. సంబరాల యేటిగట్టు. తన మార్కెట్ స్థాయికి మించి పెద్ద బడ్జెట్లో…
పెద్ది మొదటి రెండు వారాలు బాగా సందడి చేసి కలెక్షన్ల వర్షం కురిపించాక మళ్ళీ దాన్ని కొనసాగించే సినిమా ఏది…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్లో ‘ఉస్తాద్ భగత్ సింగ్’యే చివరి చిత్రం అవుతుందనే అంచనాలు కలిగాయి ఒక దశలో.…
తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు, యువ ఉద్యోగుల మరణ వార్తలు అమెరికా నుంచి వరుసగా వస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. రోడ్డు…
వైసీపీ ఆధ్వర్యంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని కోనసీమలో ఆదివారం నిర్వహించిన కాపుల సభలో మాజీ మంత్రి, ఉత్తరాంధ్రకు చెందిన బొత్స…