దర్శకుడు బుచ్చిబాబు పరిస్థితి ముళ్ల మీద పరిగెత్తుతున్నట్టు ఉంది. ఆల్రెడీ పెద్ది విడుదల తేదీ మార్చి 27 నుంచి ఏప్రిల్ 30కి వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఇంకో నెల రోజులు అదనపు సమయం దొరికినా ఒత్తిడి మాత్రం అలాగే కొనసాగుతోందని యూనిట్ వర్గాల కథనం.
ప్రస్తుతం కీలక షెడ్యూల్ జరుపుకుంటున్న పెద్ది త్వరలో ఐటెం సాంగ్ షూట్ పూర్తి చేసుకోనుంది. మృణాల్ ఠాకూర్ నర్తిస్తుందనే లీక్ ఉంది కానీ నిజమా కాదానే నిర్ధారణ అఫీషియల్ గా రాలేదు. ఇదిలా ఉండగా పెద్ది మీద ఉన్న అతి పెద్ద ప్రెజర్ ఏఆర్ రెహమాన్ సంగీతం. మరి దానికి రామాయణకు లింక్ ఏమిటనుకుంటున్నారా.
నాలుగు వేల కోట్లతో తీయబడుతున్న ఈ బాలీవుడ్ విజువల్ గ్రాండియర్ కు సంగీతం అందిస్తున్నది ఏఆర్ రెహమానే. వచ్చే నెల పెద్ద ఈవెంట్ ని ప్లాన్ చేస్తున్నారు. పాత్రలను పరిచయం చేయడంతో పాటు సౌండ్ అఫ్ రామాయణ పేరుతో మ్యూజిక్ లాంచ్ చేసే ప్రోగ్రాం ఒకటి డిజైన్ చేస్తున్నారట. సో దానికి సంబంధించిన పనులు రెహమాన్ చూసుకోవాల్సి ఉంటుంది.
విడుదల దీపావళికే అయినప్పటికీ ఇప్పటి నుంచే పోస్ట్ ప్రొడక్షన్ ని పరుగులు పెట్టిస్తున్నారు దర్శకుడు నితీశ్ తివారి. దీన్ని మేనేజ్ చేసుకుంటూనే పెద్దికి రెహమాన్ రీ రికార్డింగ్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ హాఫ్ అయ్యింది కానీ బుచ్చిబాబు ఇంకా ఫైనల్ చెక్ చేసుకోలేదట.
అసలే రంజాన్ త్వరగా వచ్చేసింది. ఈ మాసంలో రెహమాన్ డిజిటల్ ప్రపంచానికి దూరంగా ఉంటారు. వృత్తికి బ్రేక్ తీసుకోరు కాని క్రియేటివ్ ప్రమోషన్లలో భాగం కావడం లాంటివి ఉండవు. కేవలం వర్క్ మాత్రమే చేయబోతున్నారు. అందుకే బుచ్చిబాబు క్రమం తప్పకుండ చెన్నై వెళ్లి వస్తూ, బీజీఎమ్ తాలూకు అప్డేట్స్ తెలుసుకుంటూ, అవుట్ ఫుట్ మీద ఆయనతో కలిసి పలు దఫాల చర్చలు చేసినట్టు సమాచారం.
క్లైమాక్స్, స్పెషల్ సాంగ్ అయ్యాక మిగిలిన భాగానికి రెహమాన్ స్కోర్ ఇవ్వాల్సి ఉంటుంది. రామాయణ లేకపోతే ఎక్కువ టైం దొరికేది కానీ ఉన్న తక్కువ సమయంలో రెహమాన్ వీటికి బెస్ట్ ఇవ్వాల్సి ఉంటుంది.
This post was last modified on February 17, 2026 11:30 am
సినిమా నటులు ఎందరో రాజకీయ నాయకులయ్యారు. అయితే ప్రజల మనసులో బలమైన ముద్ర వేసిన వాళ్ళు మాత్రం కొందరే ఉంటారు.…
మూడ్ ఆఫ్ ది నేషన్ పేరుతో ఇండియా టుడే సీ ఓటర్ చేసిన సర్వే తమిళనాడు టీవీకే, కాంగ్రెస్ కాపురం…
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ( SIR ) చిక్కుముడిగా మారింది.…
కూటమిలో భాగస్వామి అయిన జనసేన పార్టీ ఎమ్మెల్యే పనితీరుపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అసంతృప్తి వ్యక్తం చేశారు. పనితీరు బాగోలేని…
ఏపీ వాసులకు బీపీ పెరిగిపోతుంది.. దాంతోపాటు మధుమేహ వ్యాధి కూడా..! రాష్ట్రంలో అసంక్రమిత వ్యాధులను ముందుగానే గుర్తించి సకాలంలో చికిత్స…
సినిమా షూటింగ్ లో భాగంగా ఆర్టిస్టులు కొన్నిసార్లు రిస్కీ స్టంట్లు చెయ్యాల్సి ఉంటుంది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా సరే కొన్నిసార్లు…