అదేంటో కొత్తగా సెన్సార్ బోర్డు అబ్జెక్షన్ల పర్వం టైటిల్స్ దగ్గరే మొదలు పెడుతోంది. మొన్నటికి మొన్న కపుల్ ఫ్రెండ్లి విషయంలో ఇలాగే జరిగి నిర్మాణ సంస్థ ఏ సర్టిఫికెట్ తీసుకోవడం గురించి ఇప్పటికీ చర్చ జరుగుతూనే ఉంది. దాని వల్లే కుటుంబ ప్రేక్షకులు దూరమయ్యారని డిస్ట్రిబ్యూటర్ ధీరజ్ మాటలతో పూర్తిగా ఏకీభవించలేం కానీ పేర్ల ప్రభావమైతే ఆడియన్స్ మీద ఉంటుంది.
తాజాగా సుహాస్ హీరోగా రూపొందిన ‘హే భగవాన్’కు ఇదే సమస్య రావడంతో సెన్సార్ అభ్యంతరం మేరకు దాన్ని ‘హే బలవంత్’గా మార్చేశారు. పనికి తగ్గట్టే పేరు కూడా బలవంతంగా మార్పించిన వైనం స్పష్టంగా కనిపిస్తోంది.
మొన్నటి డిసెంబర్ లో ‘వానర’ టైటిల్ ని ‘వనవీర’గా మార్చాల్సి వచ్చింది. దీంతో జనాల్లో పేరు ప్రాపర్ గా రిజిస్టర్ కాక చెప్పుకోదగ్గ క్యాస్టింగ్ ఉన్నా సరే ఓపెనింగ్స్ తెచ్చుకోవడంలో విఫలమయ్యింది. అప్పుడెప్పుడో ముప్పై సంవత్సరాల క్రితం నరేష్ ‘పోలీసోడి పెళ్ళాం’ని ‘పోలీస్ భార్య’గా మార్చినా, నాగబాబు ‘దాదర్ ఎక్స్ ప్రెస్’ పేరుని ‘సూపర్ ఎక్స్ ప్రెస్’గా ఛేంజ్ చేయాల్సి వచ్చినా అదంతా సెన్సార్ వల్లే అన్నది బహిరంగ రహస్యం.
1992లోనే నరేష్ వేరే సినిమాలు హలో డార్లింగ్ లేచిపోదామాని హలో డార్లింగ్ గా, పెళ్లి నీకు శోభనం నాకుని పెళ్లి నీకు శుభం నాకుగా మార్చినా సెన్సార్ వల్లేనని వేరే చెప్పనక్కర్లేదు.
వర్తమానానికి వస్తే ప్రమోషన్లలో ఒక టైటిల్ బాగా ప్రాచుర్యంలోకి వచ్చాక హఠాత్తుగా మార్చడం వల్ల నిర్మాతలు ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు. ముఖ్యంగా పబ్లిసిటీ పెద్ద సమస్య అయిపోయింది. దీని వల్ల వసూళ్లు దెబ్బ తింటున్నాయని వాళ్ళు వాపోతున్నారు.
పైన చెప్పిన ఉదాహరణల్లో చాలా మటుకు అసలే కాంట్రావర్సి లేని కంటెంట్లు. కానీ సున్నిత మనోభావాలను, సామజిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని అధికారులు మరీ కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నారనే కామెంట్స్ ఓపెన్ గానే వినిపిస్తున్నాయి. ట్రైలర్ తో అటెన్షన్ లోకి వచ్చిన హే భగవాన్ అలియాస్ హే బలవంత్ ఈ ఫిబ్రవరి 20 విడుదల కానుంది.
This post was last modified on February 16, 2026 12:12 pm
గుంటూరు పశ్చిమ నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే గళ్లా మాధవి తీసుకున్న వినూత్న నిర్ణయం చర్చనీయాంశంగా మారింది. బీకాం చదువుకున్న ఓ…
ఒక హీరో చేయాల్సిన సినిమా ఇంకో హీరో చేతికి వెళ్లడం సినీ పరిశ్రమలో కామన్ వ్యవహారం. ఇలా మిస్ అయిన…
ఇరవై ఏడు సంవత్సరాల క్రితం వచ్చిన దేవి సినిమాకు టాలీవుడ్ లో ఒక ప్రత్యేక స్థానం ఉంది. అమ్మోరు లాంటి…
ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్, ఢిల్లీ మాజీముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్పై అదే పార్టీ నుంచి ఎంపీగా విజయం దక్కించుకుని.. ప్రస్తుతం…
తాము నిర్మించే సినిమాలు ఎంత నష్టం తెచ్చిపెట్టినా… తమను ఎంతగా కుదేలు చేసినా.. వాటి గురించి ఓపెన్ అవ్వడానికి నిర్మాతలు…
వైసీపీలో మరోసారి సజ్జల రామకృష్ణారెడ్డి శకం ప్రారంభం అవుతుందని పార్టీ నాయకులు చెబుతున్నారు. పార్టీ అధినేత, మాజీ సీఎం జగన్..…