ఫ్యామిలీ థ్రిల్లర్స్ లో కొత్త ఒరవడికి చుట్టిన దృశ్యం ఫ్రాంచైజ్ లో చివరి భాగం మలయాళంలో షూటింగ్ పూర్తి చేసుకుంది. మోహన్ లాల్ సహకారంతో జీతూ జోసెఫ్ చకచకా గుమ్మడికాయ కొట్టేశారు. వేసవి విడుదలకు రంగం సిద్ధమయ్యింది. డిస్ట్రిబ్యూటర్లతో అగ్రిమెంట్లు కూడా జరుగుతున్నాయి.
వేరే కథతో అజయ్ దేవగన్ హిందీ దృశ్యం 3 అక్టోబర్ రిలీజ్ కు ముస్తాబవుతోంది. కానీ తెలుగులో ఇప్పటిదాకా దీనికి సంబంధించి ఎలాంటి అప్డేట్స్ లేక అభిమానులు కన్ఫ్యూజవుతున్నారు. ఎందుకంటే అసలు షూట్ మొదలుపెట్టేనాటికే మలయాళం దృశ్యం 3 ఓటిటిలో వచ్చేలా ఉంది. దీంతో ట్విస్టులన్నీ స్పాయిలర్స్ గా బయటికి వస్తాయి.
ఈ రిస్క్ ఉండకూడదనుకుంటే వెంకటేష్ వెంటనే దృశ్యం 3 మొదలుపెట్టాలి. కానీ ఆ ఆశలు సన్నగిల్లుతున్నాయి. ఎందుకంటే ప్రస్తుతం ఆదర్శ కుటుంబం చిత్రీకరణ పద్ధతి ప్రకారం జరిగిపోతోంది. సెప్టెంబర్ లేదా అక్టోబర్ లో రిలీజ్ చేయాలనే లక్ష్యంతో దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ పక్కా ప్లానింగ్ తో ఉన్నారని సమాచారం.
ఆలోగా అనిల్ రావిపూడితో వెంకటేష్ నాలుగోసారి జట్టు కట్టబోతున్నారు. ఇది 2027 సంక్రాంతి రిలీజ్ కాబట్టి నాలుగైదు నెలలు వెంకటేష్ ని ఎవరికీ ఇవ్వకుండా లాక్ చేసుకుంటాడు రావిపూడి. అలాంటప్పుడు దృశ్యం 3కి స్లాట్ ఎక్కడ ఖాళీ ఉంది. సో తెరకెక్కే అవకాశాలు మెల్లగా తగ్గిపోవచ్చు. ఫాన్స్ టెన్షన్ అదే.
పరిస్థితి చూస్తుంటే అదే జరిగేలా ఉంది. నిర్మాత సురేష్ బాబు మాత్రం దృశ్యం 3 పట్ల సానుకూలంగానే ఉన్నారట. ఎందుకంటే ముగింపు కాబట్టి రాంబాబు స్టోరీ సంపూర్ణంగా చెబితేనే మోహన్ లాల్ తో పాటు వెంకీ ఫిల్మోగ్రఫీలో దీని స్థానం ప్రత్యేకంగా నిలిచిపోతుంది.
వెంకటేష్ మనసులో ఏముందో తెలియాలంటే ఇంకొద్ది రోజులు ఆగాల్సి ఉంటుంది. దృశ్యం 3లో ఈసారి ట్విస్టుల కన్నా ఎక్కువగా ఎమోషన్లు ఉంటాయట. ఎండింగ్ చాలా డెప్త్ గా ఉంటుందని కోచి వర్గాల కథనం. మరి వాటిని అద్భుతంగా పండించే వెంకటేష్ ని రాంబాబు క్యారెక్టర్ లో మిస్ కావడం మూవీ లవర్స్ కి లోటేగా. చూడాలి ఏం జరుగుతుందో.
This post was last modified on February 12, 2026 11:53 pm
ఒకప్పుడు అక్కినేని ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోగా సుమంత్ కు మంచి ఫాలోయింగ్ ఉండేది. సత్యం, గౌరీ, గోదావరి లాంటి…
సౌత్ ఇండియన్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్లలో ఒకడైన దేవిశ్రీ ప్రసాద్ వయసు ప్రస్తుతం 46 ఏళ్లు. కానీ ఇంతలోనే అతను 27 ఏళ్ల…
ఎట్టకేలకు ప్రశాంత్ కిషోర్ ఎన్నికల్లో గెలిచాడు. జులై 30 వ తేదీన బీహార్ ఉప ఎన్నికల్లో బంకీపూర్ నుంచి ఎన్నికల…
ఒకపెద్ద సినీ కుటుంబం నుంచి పరిచయం అయ్యే కొత్త హీరో మాస్ ఇమేజ్ కోసమే తపన పడతాడు. కానీ వరుణ్ తేజ్ మాత్రం…
భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఓ సంచలన తీర్పును వెలువరించింది. మారుతున్నకాలానికి అనుగుణంగా మనిషి జీవనయానంలోనూ మార్పులు చోటుచేసుకుంటూ వస్తోంటే... ఆ…
అదేంటో స్పైడర్ మ్యాన్ జ్వరం మనోళ్లకు ఓ రేంజ్ లో పట్టేసింది. భాషతో సంబంధం లేకుండా ముంబై నుంచి మచిలీపట్నం…