ఎట్టకేలకు న్యాచురల్ స్టార్ నాని అభిమానులు ఎదురు చూస్తున్న అప్డేట్ వచ్చేసింది. ముందు ప్రకటించిన మార్చి 26 సాధ్యం కాదని గత రెండు నెలలుగా గట్టిగా వినిపిస్తున్నప్పటికీ టీమ్ నుంచి ఎలాంటి సౌండ్ లేకపోవడంతో ఫ్యాన్స్ వెయిట్ చేస్తూ వచ్చారు.
రామ్ చరణ్ పెద్ది కూడా వాయిదా పడి ఏప్రిల్ 30కి వెళ్లిపోవడంతో నాని ఏ స్లాట్ తీసుకుంటాడా అనే ఆసక్తి మూవీ లవర్స్ లో విపరీతంగా ఉంది. దానికి చెక్ పెడుతూ ఆగస్ట్ 21 రెండు జడలు వేసుకుని రక్తపాతం సృష్టించేందుకు నాని రెడీ అవుతున్నాడు. అఫీషియల్ గా చెప్పేశారు కాబట్టి దానికి అనుగుణంగానే షూటింగ్ వేగవంతం చేయబోతున్నారు.
అయితే ఈ తేదీ వెనుక తెలివైన ఎత్తుగడ కనిపిస్తోంది. ఆగస్ట్ లో ప్యాన్ ఇండియా కాంపిటీషన్ మరీ ఎక్కువగా లేదు. ఆగస్ట్ రెండో వారం ఇండిపెండెన్స్ డేని టార్గెట్ చేసుకున్న వాటిలో బాలీవుడ్ మూవీస్ ఎక్కువగా ఉన్నాయి. సల్మాన్ ఖాన్ బాటిల్ అఫ్ గాల్వాన్ తో పాటు సన్నీ డియోల్ లాహోర్ 1947 రానున్నాయి. హిందీ మార్కెట్లలో వీటిని ఫేస్ చేయడం కష్టం.
పైగా రజనీకాంత్ జైలర్ 2 ఇంచుమించు అదే సీజన్ లో వచ్చేలా ఉంది. సో ఆగస్ట్ మూడో వారాన్ని ప్యారడైజ్ ఎంచుకోవడం అన్నివిధాలా సేఫ్ గేమ్. ఇతర నిర్మాతలు తమ రిలీజ్ షెడ్యూల్స్ ని ప్లాన్ చేసుకోవడానికి అనుగుణంగా ఉంటుంది కాబట్టే ఈ నిర్ణయం తీసుకున్నారు.
దర్శకుడు శ్రీకాంత్ ఓదెలకు సరిపడా సమయం దొరికింది కాబట్టి మరింత బెస్ట్ అవుట్ ఫుట్ కోసం కష్టపడతారు. ఇక్కడ గమనించాల్సిన అంశం మరొకటి ఉంది. అనిరుద్ రవిచందర్ ఇంకా పూర్తి పాటలు ఇవ్వలేదు. రీ రికార్డింగ్ కి తగినంత టైం ఇవ్వాలి. ఇది చాలా ముఖ్యం.
జూన్ లేదా జూలై అనేసుకుని తర్వాత అతన్నుంచి అవుట్ ఫుట్ రాబట్టుకోలేక ఇబ్బంది పడేదాని కన్నా ఇలా కొంచెం దూరంలో పెట్టుకోవడం మంచి ఆలోచన. కయదు లోహర్ హీరోయిన్ గా నటించిన ప్యారడైజ్ లో కలెక్షన్ కింగ్ మోహన్ బాబు, రాఘవ్ జుయెల్ మెయిన్ విలన్లుగా నటించగా సంపూర్ణేష్ బాబు ఒక ముఖ్యమైన క్యారెక్టర్ చేశాడు.
This post was last modified on February 12, 2026 5:57 pm
కొద్దిరోజుల క్రితం టాక్సిక్ తెలుగు రాష్ట్రాల హక్కులను దిల్ రాజు 120 కోట్లకు తీసుకున్నారనే వార్త మీడియాలో హాట్ టాపిక్…
సాయిధరమ్ తేజ్ టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్లలో ఒకడు. కానీ 40వ పడికి చేరువ అవుతున్నా ఇంకా అతను పెళ్లి పీటలు ఎక్కలేదు.…
పరారీలో ఉన్న వ్యాపారవేత్త విజయ్ మాల్యా పిటిషన్ను విచారించాలంటే ఆయన ముందుగా భారత్కు తిరిగి రావాల్సిన అవసరం ఉందని బాంబే…
అభ్యర్థులకు పార్టీ గుర్తు లేకుండా జరిగిన పంచాయితీ ఎన్నికల్లో తెలంగాణ అధికార పక్షం కాంగ్రెస్ కు 65 శాతానికి మించిన…
శివాజీ, లయ కాంబోలో తెరకెక్కిన సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని ముందు ప్రకటించిన ప్రకారమైతే ఇవాళ నుంచి ఓటిటిలో వచ్చేసి ఉండాలి.…
ఒక హీరో సినిమాలు రెండు ఒకే రోజు విడుదల కావడం అరుదైన విషయం. ఎప్పుడో తొంభైవ దశకంలో నందమూరి బాలకృష్ణ చిత్రాలు ‘బంగారు…