ఎట్టకేలకు న్యాచురల్ స్టార్ నాని అభిమానులు ఎదురు చూస్తున్న అప్డేట్ వచ్చేసింది. ముందు ప్రకటించిన మార్చి 26 సాధ్యం కాదని గత రెండు నెలలుగా గట్టిగా వినిపిస్తున్నప్పటికీ టీమ్ నుంచి ఎలాంటి సౌండ్ లేకపోవడంతో ఫ్యాన్స్ వెయిట్ చేస్తూ వచ్చారు.
రామ్ చరణ్ పెద్ది కూడా వాయిదా పడి ఏప్రిల్ 30కి వెళ్లిపోవడంతో నాని ఏ స్లాట్ తీసుకుంటాడా అనే ఆసక్తి మూవీ లవర్స్ లో విపరీతంగా ఉంది. దానికి చెక్ పెడుతూ ఆగస్ట్ 21 రెండు జడలు వేసుకుని రక్తపాతం సృష్టించేందుకు నాని రెడీ అవుతున్నాడు. అఫీషియల్ గా చెప్పేశారు కాబట్టి దానికి అనుగుణంగానే షూటింగ్ వేగవంతం చేయబోతున్నారు.
అయితే ఈ తేదీ వెనుక తెలివైన ఎత్తుగడ కనిపిస్తోంది. ఆగస్ట్ లో ప్యాన్ ఇండియా కాంపిటీషన్ మరీ ఎక్కువగా లేదు. ఆగస్ట్ రెండో వారం ఇండిపెండెన్స్ డేని టార్గెట్ చేసుకున్న వాటిలో బాలీవుడ్ మూవీస్ ఎక్కువగా ఉన్నాయి. సల్మాన్ ఖాన్ బాటిల్ అఫ్ గాల్వాన్ తో పాటు సన్నీ డియోల్ లాహోర్ 1947 రానున్నాయి. హిందీ మార్కెట్లలో వీటిని ఫేస్ చేయడం కష్టం.
పైగా రజనీకాంత్ జైలర్ 2 ఇంచుమించు అదే సీజన్ లో వచ్చేలా ఉంది. సో ఆగస్ట్ మూడో వారాన్ని ప్యారడైజ్ ఎంచుకోవడం అన్నివిధాలా సేఫ్ గేమ్. ఇతర నిర్మాతలు తమ రిలీజ్ షెడ్యూల్స్ ని ప్లాన్ చేసుకోవడానికి అనుగుణంగా ఉంటుంది కాబట్టే ఈ నిర్ణయం తీసుకున్నారు.
దర్శకుడు శ్రీకాంత్ ఓదెలకు సరిపడా సమయం దొరికింది కాబట్టి మరింత బెస్ట్ అవుట్ ఫుట్ కోసం కష్టపడతారు. ఇక్కడ గమనించాల్సిన అంశం మరొకటి ఉంది. అనిరుద్ రవిచందర్ ఇంకా పూర్తి పాటలు ఇవ్వలేదు. రీ రికార్డింగ్ కి తగినంత టైం ఇవ్వాలి. ఇది చాలా ముఖ్యం.
జూన్ లేదా జూలై అనేసుకుని తర్వాత అతన్నుంచి అవుట్ ఫుట్ రాబట్టుకోలేక ఇబ్బంది పడేదాని కన్నా ఇలా కొంచెం దూరంలో పెట్టుకోవడం మంచి ఆలోచన. కయదు లోహర్ హీరోయిన్ గా నటించిన ప్యారడైజ్ లో కలెక్షన్ కింగ్ మోహన్ బాబు, రాఘవ్ జుయెల్ మెయిన్ విలన్లుగా నటించగా సంపూర్ణేష్ బాబు ఒక ముఖ్యమైన క్యారెక్టర్ చేశాడు.
This post was last modified on February 12, 2026 5:57 pm
కూటమిలో భాగస్వామి అయిన జనసేన పార్టీ ఎమ్మెల్యే పనితీరుపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అసంతృప్తి వ్యక్తం చేశారు. పనితీరు బాగోలేని…
ఏపీ వాసులకు బీపీ పెరిగిపోతుంది.. దాంతోపాటు మధుమేహ వ్యాధి కూడా..! రాష్ట్రంలో అసంక్రమిత వ్యాధులను ముందుగానే గుర్తించి సకాలంలో చికిత్స…
సినిమా షూటింగ్ లో భాగంగా ఆర్టిస్టులు కొన్నిసార్లు రిస్కీ స్టంట్లు చెయ్యాల్సి ఉంటుంది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా సరే కొన్నిసార్లు…
తెలంగాణా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒక్కొక్కరే ఢిల్లీకి చేరుకుంటున్నారు. కొండా సురేఖ కూతురు సుస్మిత కామెంట్స్ పెట్టిన చిచ్చు, చిన్నారెడ్డి…
సెన్సార్ విషయంలో నానా ఇబ్బందులు పడిన రంభ ఊర్వశి మేనక ఎట్టకేలకు అడ్డంకిని తొలగించుకుని యు/ఏ సర్టిఫికెట్ తో సెప్టెంబర్…
వందో సినిమా సంబరానికి రెడీ అవుతున్న నాగార్జున కింగ్ 100 కోసం అభిమానులు పిచ్చ వెయిటింగ్ లో ఉన్నారు. నా…