శివాజీ, లయ కాంబోలో తెరకెక్కిన సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని ముందు ప్రకటించిన ప్రకారమైతే ఇవాళ నుంచి ఓటిటిలో వచ్చేసి ఉండాలి. దానికి అనుగుణంగానే నిన్నటి దాకా ప్రమోషన్లు చేసుకుంటూ వచ్చారు. అయితే ట్రైలర్ కు వచ్చిన రెస్పాన్స్ చూశాక నిర్ణయాలు మారిపోయాయి.
డిజిటల్ లో కాకుండా మార్చ్ 6 థియేటర్లలో రిలీజ్ చేయాలని నిర్ణయం తీసుకుని ఆ మేరకు అఫీషియల్ గా అనౌన్స్ మెంట్ ఇచ్చేశారు. గతంలో ఇదే తరహాలో లిటిల్ హార్ట్స్, రాజు వెడ్స్ రాంబాయి లాంటివి థియేటర్లో సక్సెస్ అయ్యాకే ఓటిటిలో వచ్చిన నేపథ్యంలో సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని ఇదే బాట పట్టింది.
ఇది నిజంగానే అప్పటికప్పుడు అనుకుని డెసిషన్ మార్చుకున్నారా లేక ఒక ప్రణాళిక ప్రకారం మార్కెటింగ్ చేసుకుని వచ్చారా అనేది చెప్పలేం కానీ మొత్తానికి కొంత రిస్క్ అయితే తీసుకున్నారు. ఎందుకంటే శివాజీ, లయ లాంటి సీనియర్ జంటను థియేటర్లో చూసేందుకు జనం అంత ఈజీగా రారు.
కంటెంట్ ఎక్స్ ట్రాడినరిగా ఉందంటే ఆడియన్స్ ని ఎక్స్ పెక్ట్ చేయొచ్చు లేదంటే టికెట్లు తెగడం కష్టం. ఈ మధ్య డీసెంట్ టాక్ వచ్చినా సరే శ్రీ చిదంబరం గారు, విత్ లవ్ లాంటివి వర్కౌట్ చేసుకోలేకపోయాయి. కానీ యూత్ ఎలిమెంట్స్ లేకుండా ఫ్యామిలీస్ ని టార్గెట్ చేసుకున్న సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని చేసేది సాహసమే.
ఇది మంచి ఫలితం ఇస్తే మటుకు ఇకపై ఇలాంటి తక్కువ బడ్జెట్ మూవీస్ ముందు థియేటర్లోనే వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాకపోతే ప్రతిసారి హిట్టు రిజల్ట్ వస్తుందన్న గ్యారెంటీ ఉండదు. ఏదైనా తేడా కొడితే మొదటి రోజు సాయంత్రానికే హాళ్లు ఖాళీగా ఉంటాయి.
గత ఏడాది పెద్ద హంగామా చేసిన మిత్రమండలి లాంటివి దీన్ని చవిచూశాయి. 90స్ మిడిల్ క్లాస్ లో బాగా ప్రాచుర్యం పొందిన బ్యాక్ గ్రౌండ్ లైన్ ని టైటిల్ గా పెట్టుకున్న సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని థియేట్రికల్ గా ఒక రెండు మూడు కోట్లు రాబట్టుకున్నా సేఫ్ గేమ్ అవుతుంది. దీంట్లోనే పవన్ కళ్యాణ్ మీద బండ్ల గణేష్ చేసిన సాంగ్ వైరలయ్యింది.
This post was last modified on February 12, 2026 5:30 pm
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా రూపొందిస్తున్న పెద్ది సినిమాకు సంబంధించి ప్రతి ప్రోమో బ్లాక్…
తెలంగాణ కాంగ్రెస్ పార్టీపై మరోసారి తన పట్టును గట్టిగా నిలబెట్టుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి. గతంలోనూ ఆయన అనేక సందర్భాల్లో…
హఠాత్తుగా ఉస్తాద్ భగత్ సింగ్ మార్చి 19కి ప్రీ పోన్ అయ్యిందన్న వార్త ఒక్కసారిగా నిన్న సాయంత్రం సోషల్ మీడియాని…
ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా చేస్తున్న యుద్ధం.. భారత్పై తీవ్ర ప్రభావం చూపిస్తుందా? ప్రజలకు కష్టాలు ప్రారంభం కానున్నాయా? అంటే..…
ఎవడో యుద్దం చేసుకోవటం.. మరెవరో దానికి సంబంధించిన మూల్యాన్ని చెల్లించాల్సి రావటం. నిజానికి యుద్దంతో ఇదే తంటా. మనకు ఏ…
పరిమళ్ నత్వానీ. ఈ పేరు పెద్దగా పరిచయం లేదు. కానీ, ఈయన పెద్ద పారిశ్రామిక వేత్త. ఉత్తరాది రాష్ట్రాల్లో ఈయన…