శివాజీ, లయ కాంబోలో తెరకెక్కిన సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని ముందు ప్రకటించిన ప్రకారమైతే ఇవాళ నుంచి ఓటిటిలో వచ్చేసి ఉండాలి. దానికి అనుగుణంగానే నిన్నటి దాకా ప్రమోషన్లు చేసుకుంటూ వచ్చారు. అయితే ట్రైలర్ కు వచ్చిన రెస్పాన్స్ చూశాక నిర్ణయాలు మారిపోయాయి.
డిజిటల్ లో కాకుండా మార్చ్ 6 థియేటర్లలో రిలీజ్ చేయాలని నిర్ణయం తీసుకుని ఆ మేరకు అఫీషియల్ గా అనౌన్స్ మెంట్ ఇచ్చేశారు. గతంలో ఇదే తరహాలో లిటిల్ హార్ట్స్, రాజు వెడ్స్ రాంబాయి లాంటివి థియేటర్లో సక్సెస్ అయ్యాకే ఓటిటిలో వచ్చిన నేపథ్యంలో సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని ఇదే బాట పట్టింది.
ఇది నిజంగానే అప్పటికప్పుడు అనుకుని డెసిషన్ మార్చుకున్నారా లేక ఒక ప్రణాళిక ప్రకారం మార్కెటింగ్ చేసుకుని వచ్చారా అనేది చెప్పలేం కానీ మొత్తానికి కొంత రిస్క్ అయితే తీసుకున్నారు. ఎందుకంటే శివాజీ, లయ లాంటి సీనియర్ జంటను థియేటర్లో చూసేందుకు జనం అంత ఈజీగా రారు.
కంటెంట్ ఎక్స్ ట్రాడినరిగా ఉందంటే ఆడియన్స్ ని ఎక్స్ పెక్ట్ చేయొచ్చు లేదంటే టికెట్లు తెగడం కష్టం. ఈ మధ్య డీసెంట్ టాక్ వచ్చినా సరే శ్రీ చిదంబరం గారు, విత్ లవ్ లాంటివి వర్కౌట్ చేసుకోలేకపోయాయి. కానీ యూత్ ఎలిమెంట్స్ లేకుండా ఫ్యామిలీస్ ని టార్గెట్ చేసుకున్న సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని చేసేది సాహసమే.
ఇది మంచి ఫలితం ఇస్తే మటుకు ఇకపై ఇలాంటి తక్కువ బడ్జెట్ మూవీస్ ముందు థియేటర్లోనే వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాకపోతే ప్రతిసారి హిట్టు రిజల్ట్ వస్తుందన్న గ్యారెంటీ ఉండదు. ఏదైనా తేడా కొడితే మొదటి రోజు సాయంత్రానికే హాళ్లు ఖాళీగా ఉంటాయి.
గత ఏడాది పెద్ద హంగామా చేసిన మిత్రమండలి లాంటివి దీన్ని చవిచూశాయి. 90స్ మిడిల్ క్లాస్ లో బాగా ప్రాచుర్యం పొందిన బ్యాక్ గ్రౌండ్ లైన్ ని టైటిల్ గా పెట్టుకున్న సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని థియేట్రికల్ గా ఒక రెండు మూడు కోట్లు రాబట్టుకున్నా సేఫ్ గేమ్ అవుతుంది. దీంట్లోనే పవన్ కళ్యాణ్ మీద బండ్ల గణేష్ చేసిన సాంగ్ వైరలయ్యింది.
ఆంధ్రుల హక్కు-విశాఖ ఉక్కు నినాదంతో ఊరూవాడలను ఏకం చేసిన ఉద్యమం నుంచి పుట్టిన విశాఖ ఉక్కు కర్మాగారం.. గత రెండు…
విడుదల తేదీ కోసం ఎదురు చూస్తున్న కొరియన్ కనకరాజుకి మోక్షం దొరికేసింది. ఆగస్ట్ 7 రిలీజ్ కు రంగం సిద్ధం…
గత వారం భారీ అంచనాల మధ్య ప్రేక్షెకుల ముందుకు వచ్చిన పెద్ది సినిమా తొలి వీకెండ్లో అంచనాలకు తగ్గట్లే భారీ…
జాతీయ పార్టీలు కాంగ్రెస్, బీజేపీల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంత పరిస్థితి. అలాంటిది కాంగ్రెస్ మంత్రితో బీజేపీ ఎంపీ భేటీ…
ఏపీలో కూటమి సర్కారు కొలువుదీరి రెండేల్లు అవుతోంది. మూడు పార్టీల కలయికతో ఏర్పడిన కూటమి… 2024 ఎన్నికల్లో అత్యంత కష్టతరమైన…
గత ఎన్నికల సమయంలో కొందరు నాయకులు పోటీ చేసిన నియోజకవర్గాల్లో వారు ఓడిపోయారు. అయితే.. ఆ తర్వాత పలువురు నేతలు..…