Movie News

రాజీ పడనున్న జన నాయకుడు

నెల రోజుల నుంచి వాయిదాల పర్వంలో ఉన్న విజయ్ జన నాయకుడు ఎట్టకేలకు రాజీ మార్గం పట్టొచ్చని చెన్నై వర్గాల కథనం. సిబిఎఫ్సి మీద నిర్మాత కేసు విత్ డ్రా చేసుకోవడం ద్వారా రివైజింగ్ కమిటీ నుంచి సెన్సార్ సర్టిఫికెట్ తెచ్చుకునే ప్రయత్నాల్లో ఉన్నారట. అధికారులు చెప్పిన మార్పులకు వీలైనంత అంగీకరించి రిలీజ్ కు మార్గం సుగమం చేసుకోవాలని నిర్ణయించుకున్నట్టు తెలిసింది.

ఒకపక్క బయ్యర్ల నుంచి ఒత్తిడి అంతకంతా ఎక్కువవుతోంది. వచ్చే నెల మార్చి 19 ఇదే కెవిఎన్ సంస్థ నిర్మించిన టాక్సిక్ పెద్దఎత్తున  విడుదలవుతుండటంతో ముందు జన నాయకుడు క్లియర్ కావడం చాలా అవసరం.

వీలైనంత వరకు జన నాయకుడుని ఫిబ్రవరి మూడో వారంలోనే థియేటర్లకు తీసుకురావాలని చూస్తున్నారట. అయితే సర్టిఫికెట్ చేతికి రానిదే అనౌన్స్ మెంట్ ఇవ్వకూడదని డిసైడ్ అయ్యారు. దీని కోసమే ఎదురు చూస్తున్న ఇతర నిర్మాతలు తమ రిలీజ్ డేట్లను పెండింగ్ లో పెట్టేశారు.

విజయ్ అభిమానులు ఒక్కసారి అధికారిక ప్రకటన వస్తే సంక్రాంతికి మించి సెలెబ్రేషన్స్ చేయాలని నిర్ణయించుకున్నారు. రాజకీయ ఉద్దేశాలతోనే జన నాయకుడుని అడ్డుకుంటున్నారని, వాటికి కలెక్షన్ల రూపంలో సమాధానం ఇస్తామని నొక్కి చెబుతున్నారు. ట్రైలర్ ఆల్రెడీ పాతదై పోయింది కాబట్టి మరో వెర్షన్ రెడీ చేస్తున్నారట.

ఒక సానుకూలాంశం ఏమిటంటే తెలుగు డబ్బింగ్ వెర్షన్ కు పెద్దగా పోటీ లేకుండా బరిలో దిగడం. ఒకవేళ సంక్రాంతికి వచ్చి ఉంటే చిరంజీవి, రవితేజ, నవీన్ పోలిశెట్టి, శర్వానంద్, ప్రభాస్ కాంపిటీషన్ తట్టుకోవడం కష్టంగా ఉండేది. కానీ ఇప్పుడా సమస్య లేదు.

భగవంత్ కేసరి రీమేక్ అని తెలిసినా సరే కీలక మార్పులు చేశారనే టాక్ బలంగా ఉండటం వల్ల ఇక్కడి అభిమానులు కూడా ఆసక్తి చూపిస్తున్నారు. అందులోనూ విజయ్ చివరి మూవీ కావడంతో రెవిన్యూ బాగానే రావొచ్చు. హెచ్ వినోత్ దర్శకత్వం వహించిన జన నాయకుడులో బాబీ డియోల్ విలన్ గా మమిత బైజు, పూజా హెగ్డే కీలక తారాగణంలో ఉన్నారు.

This post was last modified on February 10, 2026 12:20 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

భోజనంలో పురుగులు… వందేభారత్ రామానుజం ఏం చేశాడు?

వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణికులకు అందించే భోజనం నాణ్యతపై మరోసారి పెద్ద వివాదం రాజుకుంది. పాట్నా నుంచి టాటానగర్ వెళ్లే…

49 minutes ago

చిరు బాబీ మిస్… వెంకీ అనిల్ ఫిక్స్

వరసగా సినిమాలు చేస్తున్నా సక్సెస్ మాత్రం అందని ద్రాక్ష పండులా మారిపోయిన ఉప్పెన ఫేమ్ కృతి శెట్టి సరైన బ్రేక్…

1 hour ago

వెయ్యి కోట్ల విధ్వంసం వారం రోజుల్లోనే

అంచనాలకు మించి దురంధర్ ది రివెంజ్ అరాచకం చేస్తోంది. సరిగ్గా వారం రోజులు కావడం ఆలస్యం వెయ్యి కోట్ల క్లబ్బులోకి…

3 hours ago

మంగళగిరిని లోకేశ్ వీడాల్సిందేనా…?

లోక్ సభ, అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన ఖరారైన నేపథ్యంలో దేశంలోని అన్ని ప్రాంతాల ప్రజలు ఆయా పరిణామాలపై ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. ఈ…

4 hours ago

ప్రభాస్ ప్రేమిస్తే ఇంతే

నేటి తరం కుర్ర హీరోల్లో సంతోష్ శోభన్, సంగీత్ శోభన్ సోదరులకు ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది. అయితే వీరిద్దరి…

5 hours ago

ఘోర బస్సు ప్రమాదం 10 మంది సజీవదహనం

ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మార్కాపురం జిల్లాలోని రాయవరం సమీపంలో పలకల క్వారీల వద్ద ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు…

7 hours ago