సంక్రాంతి పందెంలో విజేతగా నిలిచి మూడు వందల డెబ్భై అయిదు కోట్లకు పైగా వసూళ్లతో బ్లాక్ బస్టర్ గా నిలిచిన మన శంకరవరప్రసాద్ గారుకి ఒక్క విషయంలో మాత్రం విమర్శలు తప్పడం లేదు. నెల తిరగడం ఆలస్యం ఓటిటిలో రావడం పట్ల మెగా ఫ్యాన్స్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
బుధవారం ఫిబ్రవరి 11 నుంచి జీ ఫైవ్ లో ఈ మెగా మూవీ అందుబాటులోకి రానుంది. గత ఏడాది ఇదే ప్లాట్ ఫార్మ్ లో సంక్రాంతికి వస్తున్నాం ఇంత ఫాస్ట్ గా స్ట్రీమింగ్ చేయలేదని గుర్తు చేస్తున్నారు. నిజానికి ఈ ఆదివారం బుక్ మై షోలో తక్కువ నెంబరే అయినా కంటిన్యూ ట్రెండింగ్ లో ఉన్న స్ట్రెయిట్ తెలుగు సినిమా ఇదొక్కటే.
ఇంకో రెండు వారాలు డీసెంట్ రన్ దక్కే అవకాశాలు పుష్కలంగా ఉన్నప్పుడు ఓటిటిలో అప్పుడే ఎందుకనేది అభిమానుల ప్రశ్న. ముందే చేసుకున్న అగ్రిమెంట్ అయినా సరే కాసింత వెసులుబాటు అడిగి ఉండాల్సిందని అంటున్నారు. గతంలో హనుమాన్ లాంటివి ఈ సౌలభ్యాన్ని వాడుకుని ఓటిటిలో ఆలస్యంగా వచ్చాయి.
కానీ మన శంకరవరప్రసాద్ గారు అలాంటి మినహాయింపులు కోరలేదు. కేవలం నాలుగు వారాల గ్యాప్ కు కట్టుబడి పోయింది. ప్రాక్టికల్ గా చూస్తే వీక్ డేస్ లో ఆక్యుపెన్సీలో బాగా తగ్గిపోయాయి. ఫీడింగ్ కోసం ఆడించడమే తప్ప సీడెడ్ లాంటి ప్రాంతాల్లో ఆల్రెడీ ఫైనల్ రన్ కు దగ్గరలో ఉంది.
కొన్నేళ్లుగా ఎన్నో పెద్ద సినిమాలు నెల రోజులకే ఓటిటి డీల్స్ చేసుకోవడం గురించి ఎన్ని కామెంట్లు వస్తున్నా నిర్మాతలు పట్టించుకునే పరిస్థితి లేదు. బడ్జెట్ లు రికవరీ కావాలంటే థియేటర్ రెవిన్యూ ఒక్కటే సరిపోకపోవడంతో ఓటిటి కండీషన్లకు ఎస్ అంటున్నారు.
రాజా సాబ్, అనగనగా ఒక రాజు, భర్త మహాశయులకు విజ్ఞప్తి కూడా ఇదే బాట పట్టగా నారి నారి నడుమ మురారి మరీ విచిత్రంగా 21 రోజులకే స్మార్ట్ స్క్రీన్ల మీద ప్రత్యక్షమయింది. కార్తీ అన్నగారు వస్తారు, శివ కార్తికేయన్ పరాశక్తి డబ్బింగ్ వెర్షన్లు అసలు థియేటర్ ఊసే లేకుండా నేరుగా చిన్ని తెరలపై వచ్చాయి. ఇదంతే ఎవరేం చేసినా ఈ ట్రెండ్ ని మార్చలేరు.
This post was last modified on February 8, 2026 11:13 pm
ఏపీలో విపక్ష వైసీపీలో ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మాటే ఫైనల్ అని, పార్టీలోని ఏ ఒక్క…
తొమ్మిదేళ్ల కిందట ‘బాహుబలి: ది కంక్లూజన్’ బాక్సాఫీస్ దగ్గర మామూలు ప్రభంజనం సృష్టించలేదు. అప్పటిదాకా ఉన్న అన్ని ఇండియన్ బాక్సాఫీస్…
ఓటీటీల్లో మలయాళం సినిమాలను కొన్నేళ్లుగా విరగబడి చూస్తున్నారు తెలుగు ప్రేక్షకులు. అక్కడి సినిమాల్లో కంటెంట్ చూసి ఇలాంటివి తెలుగులో తీయరేంటి…
ఏపీ అసెంబ్లీలో శనివారం ఓ ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని సినీ కమెడియన్…
ఈ రోజు ఐపీఎల్ 19వ సీజన్ ఆరంభం కాబోతుండగా.. చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యం పెద్ద షాకే ఇచ్చింది. ఆ…
నవ్యాంధ్రప్రదేశ్ ఏకైక రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించే దిశగా శనివారం సమావేశమైన అసెంబ్లీలో విపక్షం వైసీపీకి చెందిన 11 మంది సభ్యులపై అధికార…