ప్రతిపక్షంలోకి వెళ్లాక వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి మాటతీరు, వ్యవహార శైలి ఎలా తయారయ్యిందో రెండేళ్లుగా చూస్తూనే ఉన్నాం. అధికారంలో ఉన్నపుడూ ఆయన తడబడే వారు కానీ.. ప్రతిపక్షంలోకి వెళ్లాక తడబాటు మరింత ఎక్కువైంది. ఎప్పుడైనా ఒక ప్రెస్ మీట్ పెట్టినా.. లేదా బయట ఏదైనా కార్యక్రమంలో మాట్లాడినా.. ట్రోల్స్కు కావాల్సిన మెటీరియల్ ఇచ్చేస్తున్నారు.
జగన్ వస్తున్నాడంటే మీమ్ మెటీరియల్ ఇస్తాడు రెడీగా ఉండాలంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తుంటారు. తాజాగా లడ్డు కల్తీ వ్యవహారం మీద జగన్ చేసిన కామెంట్.. మీమర్స్కు కంటెంట్ ఇచ్చేసింది. లడ్డు కల్తీ వ్యవహారంపై విచారణ జరిపిన దర్యాప్తు సంస్థలు నెయ్యిలో జంతు కొవ్వులు లేవని నిర్ధరించాయన్నది వైసీపీ వెర్షన్.
ఇదే విషయాన్ని చెప్పబోతూ జగన్ తడబడ్డారు. నెయ్యిలో నాన్ వెజ్ లేదు అని ఆయన వ్యాఖ్యానించారు. సరైన పదం దొరక్క ఆయన ఆ మాట వాడేశారు. తర్వాత సర్దుకుని జంతు కొవ్వులు అన్నారు. కానీ మాజీ ముఖ్యమంత్రి, ఇంత పెద్ద పార్టీ అధినేతగా ఉంటూ.. ఇలా పదాల కోసం తడుముకోవడం.. నాన్ వెజ్ అనే పదం వాడడం ఆశ్చర్యం కలిగించే విషయం.
ఇలా మాటల తడబాటుతో జగన్ గతంలో ఎన్నోసార్లు ట్రోలింగ్కు గురయ్యారు. ఇప్పుడు భక్తుల మనోభావాలతో ముడిపడ్డ అంశఃలో ఇలాంటి కామెంట్ చేయడంతో మరింతగా విమర్శల పాలవుతున్నారు ఏపీ మాజీ ముఖ్యమంత్రి. మరోవైపు నేషనల్ మీడియా లడ్డు కల్తీ వ్యవహారంలో జగన్ గాలి బాగానే తీస్తోంది.
This post was last modified on February 7, 2026 11:45 pm
అట్లీ దర్శకత్వంలో అల్లు అర్జున్ కొత్త సినిమా ‘రాకా’ మొదలైనపుడే అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. సన్ పిక్చర్స్ ప్రొడక్షన్లో…
విశాఖపట్నంలో విద్యార్థులు చెలరేగిపోయారు. ప్రేమ వ్యవహారంలో రెండు గ్రూపులుగా విడిపోయి కర్రలు, రాడ్లు పట్టుకొని రోడ్డెక్కారు. సినిమా తరహాలో నడి…
మాస్ రాజా రవితేజ నుంచి సరైన సినిమా వస్తే.. పరిస్థితులు కూడా అనుకూలిస్తే బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి అద్భుతాలు జరుగుతాయో…
ప్రభాస్, సందీప్ రెడ్డి వంగల క్రేజీ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘స్పిరిట్’ సినిమా నుంచి దీపికా పదుకొనేను తప్పించడం మీద ఎప్పుడో…
ఏదో ఈవెంట్కు వెళ్లి ఏదో మాట్లాడుతూ.. తన కొత్త సినిమాల విశేషాలను లీక్ చేసేయడం మెగాస్టార్ చిరంజీవికి అలవాటు. కొన్నిసార్లు…
టాలీవుడ్ థియేటర్ల దగ్గర ఇరుముడి సందడి ఓ రేంజ్ లో ఉంది. సెకండ్ షోలు సైతం టికెట్ ముక్క దొరకనంతగా…