ప్రతిపక్షంలోకి వెళ్లాక వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి మాటతీరు, వ్యవహార శైలి ఎలా తయారయ్యిందో రెండేళ్లుగా చూస్తూనే ఉన్నాం. అధికారంలో ఉన్నపుడూ ఆయన తడబడే వారు కానీ.. ప్రతిపక్షంలోకి వెళ్లాక తడబాటు మరింత ఎక్కువైంది. ఎప్పుడైనా ఒక ప్రెస్ మీట్ పెట్టినా.. లేదా బయట ఏదైనా కార్యక్రమంలో మాట్లాడినా.. ట్రోల్స్కు కావాల్సిన మెటీరియల్ ఇచ్చేస్తున్నారు.
జగన్ వస్తున్నాడంటే మీమ్ మెటీరియల్ ఇస్తాడు రెడీగా ఉండాలంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తుంటారు. తాజాగా లడ్డు కల్తీ వ్యవహారం మీద జగన్ చేసిన కామెంట్.. మీమర్స్కు కంటెంట్ ఇచ్చేసింది. లడ్డు కల్తీ వ్యవహారంపై విచారణ జరిపిన దర్యాప్తు సంస్థలు నెయ్యిలో జంతు కొవ్వులు లేవని నిర్ధరించాయన్నది వైసీపీ వెర్షన్.
ఇదే విషయాన్ని చెప్పబోతూ జగన్ తడబడ్డారు. నెయ్యిలో నాన్ వెజ్ లేదు అని ఆయన వ్యాఖ్యానించారు. సరైన పదం దొరక్క ఆయన ఆ మాట వాడేశారు. తర్వాత సర్దుకుని జంతు కొవ్వులు అన్నారు. కానీ మాజీ ముఖ్యమంత్రి, ఇంత పెద్ద పార్టీ అధినేతగా ఉంటూ.. ఇలా పదాల కోసం తడుముకోవడం.. నాన్ వెజ్ అనే పదం వాడడం ఆశ్చర్యం కలిగించే విషయం.
ఇలా మాటల తడబాటుతో జగన్ గతంలో ఎన్నోసార్లు ట్రోలింగ్కు గురయ్యారు. ఇప్పుడు భక్తుల మనోభావాలతో ముడిపడ్డ అంశఃలో ఇలాంటి కామెంట్ చేయడంతో మరింతగా విమర్శల పాలవుతున్నారు ఏపీ మాజీ ముఖ్యమంత్రి. మరోవైపు నేషనల్ మీడియా లడ్డు కల్తీ వ్యవహారంలో జగన్ గాలి బాగానే తీస్తోంది.
This post was last modified on February 7, 2026 11:45 pm
మన నిర్మాతలు ఈ మధ్య బౌండరీలు దాటేసి, వేరే ఇండస్ట్రీల సూపర్ స్టార్లతో సినిమాలు చేస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్…
జంతర్ మంతర్లో కాక్రోచ్ జనతా పార్టీ చేసిన ఆందోళన విరమించినప్పటికీ అది సృష్టించిన తుఫాన్ కొనసాగుతుంది. సద్దుమణిగిందనుకున్న విషయాన్ని శుక్రవారం…
చెన్నై లవ్ స్టోరీ పోస్ట్ రిలీజ్ ప్రమోషన్లలో యూనిట్ సభ్యులు కొందరు వాడిన మాట ఒకటుంది. అదే కిరణ్ అబ్బవరం హ్యాట్రిక్…
ఆ మధ్య జరిగిన లెనిన్ సక్సెస్ మీట్ లో కింగ్ నాగార్జున ఒక మాట అన్నారు. ది ఒడిస్సి లాంటి…
భారత దేశ రాజకీయాల్లో ఎన్నో పార్టీలు పుడుతున్నాయి. ఆ వెంటనే కనుమరుగు అవుతున్నాయి. ఎక్కడో ఒకటి అరా పార్టీలు కొనసాగుతున్నా... అవన్నీ దాదాపుగా…
టాలీవుడ్లో క్యారెక్టర్ రోల్స్ తో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న నటి సురేఖా వాణి. వందల సంఖ్యలో సినిమాలు చేసిన ఆమెకు…