Political News

బీఆర్‌ఎస్‌కు ఓటు వేయొద్దని కవిత పిలుపు

బీఆర్ ఎస్ పార్టీ మాజీ నాయకురాలు, తెలంగాణ జాగృతి సంస్థ అధ్యక్షురాలు కవిత తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం తెలంగాణలో జరుగుతున్న మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల్లో బీఆర్ ఎస్ పార్టీకి ఓటు వేయాలో వద్దో బీసీలు అందరూ ఆలోచించుకోవాలని ఆమె సూచించారు. ప్రస్తుతం బీఆర్ ఎస్ పార్టీ సుప్తచేతనావస్థలో ఉందని ఆమె వ్యాఖ్యానించారు. బీసీల విషయంపై తాను కొన్ని సూచనలు చేయాలని భావిస్తున్నట్టు కవిత పేర్కొన్నారు.

బీఆర్ ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు బీసీలకు ఏమి చేసిందని ఆమె ప్రశ్నించారు. వారిని కనీసం తమ గడప వద్దకు కూడా బీఆర్ ఎస్ అగ్ర నేతలు రానివ్వలేదన్నారు. అంతేకాదు, బీసీలు ఐక్యంగా పోరాటం చేసుకునేందుకు కూడా అవకాశం లేకుండా చేశారని విమర్శించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో బీసీ బిడ్డలు ప్రాణాలకు తెగించి పోరాడారని, కానీ వారిని ఏమాత్రం పట్టించుకోలేదన్నారు. బీసీలను గాలికి వదిలేసిన పార్టీ ఏదైనా ఉంటే అది బీఆర్ ఎస్ మాత్రమేనని కొందరు బీసీ వర్గానికి చెందిన నాయకులు తనకు చెప్పారని తెలిపారు.

బీసీ రిజర్వేషన్ అంశాన్ని కూడా బీఆర్ ఎస్ నాయకులు దాటవేస్తున్నారని, ఈ విషయంలో వారి స్టాండ్ ఏమిటో బీసీ సామాజిక వర్గానికి చెప్పాలని కవిత డిమాండ్ చేశారు. అంతేకాదు, బీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా పిటిషన్ వేసిన మాధవరెడ్డికి ఆ పార్టీ టికెట్ ఎలా కేటాయించిందని ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో బీసీలు ఇప్పుడు జరుగుతున్న మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల్లో ఎవరికీ ఓటు వేయాలన్నది కూలంకషంగా చర్చించుకుని నిర్ణయం తీసుకోవాలని కవిత సూచించారు.

ఈ నెల 11న ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆమె చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఇక త్వరలోనే తన పార్టీకి ముహూర్తం పెట్టాలని నిర్ణయించుకున్నట్టు ఆమె తెలిపారు. తమ రాజకీయ పార్టీ ఆవిర్భావానికి మంచి ముహూర్తం కోసం చూస్తున్నామని చెప్పారు. కాగా తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ పాత్రను ఎవరూ చెరిపివేయలేరని వ్యాఖ్యానిస్తూ, పరోక్షంగా ఆయన్ని జాతిపితగా పేర్కొంటున్న బీఆర్ ఎస్ నాయకులకు మద్దతుగా మాట్లాడడం గమనార్హం.

This post was last modified on February 6, 2026 6:45 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఇది.. మోడీకి ఇన్‌స‌ల్ట్ కాదా?!

“భార‌త దేశం స‌ర్వ‌స‌త్తాక సార్వ‌భౌమ దేశం. ఇత‌ర దేశాల‌కు త‌ల‌వొంచ‌దు. ఎవ‌రో చెప్పిన‌ట్టు కూడా న‌డుచుకోదు. ఎవ‌రి ఆదేశాల‌నో పాటించాల్సిన…

41 minutes ago

కూట‌మికి వెయ్యి ఏనుగుల బ‌ల‌మిస్తున్న ప‌వ‌న్ క‌ల్యాణ్‌

వ‌చ్చే 15 ఏళ్ల‌పాటు కూట‌మి అధికారంలో ఉండాల‌ని జ‌న‌సేన అధినేత‌, ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్ క‌ల్యాణ్‌ బ‌లంగా చెబుతున్న విష‌యం…

43 minutes ago

2029 ఆయుధాలు రెడీ చేసుకుంటోన్న టీడీపీ – వైసీపీ…!

2029లో జ‌రిగే ఎన్నిక‌ల‌కు సంబంధించి వైసీపీ, టీడీపీలు ఇప్ప‌టి నుంచే ఆయుధాల‌ను రెడీ చేసుకుంటు న్నాయా? వాటికి ప‌దును కూడాపెంచుకుంటున్నాయా?…

3 hours ago

సజ్జనార్ మాటలు వింటారా?

సోష‌ల్ మీడియా యావ‌లో ప‌డిన చాలా మంది యువ‌కులు, య‌వ‌తులు త‌మ ప్రాణాల‌ను కూడా బ‌లి చేసుకుంటున్నార‌న్న‌ది వాస్త‌వం. ఇలాంటి…

4 hours ago

ఆ విషయంపై నోరు విప్పిన పవన్

వైసీపీ హ‌యాంలో జరిగిన ఆర్థిక విధ్వంసంపై ఇప్ప‌టి వ‌ర‌కు సీఎం చంద్ర‌బాబు, ఇత‌ర మంత్రులు మాత్రమే మాట్లాడుతున్నారు. అయితే.. తొలిసారి..…

5 hours ago