యానిమల్ సినిమాతో బాలీవుడ్ మేకర్స్ ని సైతం ముక్కున వేలేసుకునేలా చేశాడు సందీప్ వంగ. అర్జున్ రెడ్డి రీమేక్ కబీర్ సింగ్ తోనే అక్కడ ఆడియన్స్ ని ఆకట్టుకున్న ఈ దర్శకుడు యానిమల్ తో తన బోల్డ్ సినిమాటిక్ ఎక్స్ ప్రెషన్ తో షేక్ చేశాడు. రణ్ బీర్ కపూర్ ని ఇలా మనం ఎందుకు చూపించలేకపోయాం అని బాలీవుడ్ మేకర్స్ అంతా తలలు పట్టుకునేలా చేశాడు. యానిమల్ తో సందీప్ పేరు మారుమోగిపోయింది. ఆ సినిమాతో అప్పటిదాకా అసలు లైం లైట్ లో లేని త్రిప్తి కూడా స్టార్ క్రేజ్ దక్కించుకుంది.
యానిమల్ వచ్చి రెండేళ్లు అవుతున్నా ఇంకా ఆ సినిమా తాలూకా బజ్ కొనసాగుతూనే ఉంది. లేటెస్ట్ గా ఈ సినిమాను జపాన్ లో రిలీజ్ షెడ్యూల్ చేశారు. స్వయంగా సందీప్ వంగ, రణ్ బీర్ వెళ్లి జపాన్ లో ప్రమోషన్స్ చేస్తున్నారు. ఈ క్రమంలో యానిమల్ పార్క్ గురించి హింట్ ఇచ్చాడు డైరెక్టర్ సందీప్. యానిమల్ పార్క్ మరింత బోల్డ్ అండ్ వైల్డ్ గా ఉంటుందని అక్కడ ఆడియన్స్ తో చెప్పాడు సందీప్ వంగ. యానిమల్ చూసే చాలామంది షాక్ అయ్యి సినిమాను ఇలా కూడా తీస్తారా అంటూ నానా హడావిడి చేశారు.
కానీ సందీప్ యానిమల్ పార్క్ ని యానిమల్ ని మించి అంటే డబల్ ఎక్స్ మోడ్ లో చేసే ప్లానింగ్ లో ఉన్నాడని అతని కామెంట్స్ తో తెలుస్తుంది. సో సందీప్ ఇలా చెప్పిన దగ్గర నుంచి ఆ సినిమా ఎప్పుడెప్పుడు సెట్స్ మీదకు వెళ్తుందా అన్న ఆసక్తి ఆడియన్స్ లో మొదలైంది.
ప్రస్తుతం సందీప్ వంగ ప్రభాస్ తో స్పిరిట్ చేస్తున్నాడు. ఆ సినిమా నెక్స్ట్ ఇయర్ మార్చి రిలీజ్ టార్గెట్ పెట్టుకున్నారు. అటు స్పిరిట్ రిలీజ్ అవగానే యానిమల్ పార్క్ మొదలు పెట్టి 2028లో రిలీజ్ చేసే ప్లాన్ లో ఉన్నాడు సందీప్ వంగ.
రణ్ బీర్ కపూర్ కూడా రామాయణం ప్రాజెక్ట్ తో బిజీగా ఉన్నాడు. రామాయణ్ పార్ట్ 1 ఈ ఇయర్ నవంబర్ లో రిలీజ్ షెడ్యూల్ చేశారు. సో ఆ సినిమా రిలీజ్ తర్వాత యానిమల్ పార్క్ కోసమే రణ్ బీర్ టైం కేటాయిస్తారని చెప్పొచ్చు. సందీప్ సినిమాలే కాదు స్టేట్మెంట్స్ కూడా వైరల్ అవుతాయి. యానిమల్ పార్క్ పై సందీప్ బోల్డ్ అండ్ వైల్డ్ అనే కామెంట్స్ చూసి యానిమల్ పార్క్ కచ్చితంగా ఆడియన్స్ కి బోల్డెస్ట్ ట్రీట్ ఇవ్వడం పక్కా అని ఫిక్స్ అవుతున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates