ఆల్ ఇండియా బ్లాక్ బస్టర్స్ లో ఒకటిగా అవతరించిన దురంధర్ తాజాగా ఓటిటిలో వచ్చాక కొత్త డిబేట్ మొదలయ్యింది. ఇంతకన్నా గొప్పగా కమల్ హాసన్ పన్నెండు సంవత్సరాల క్రితమే 2013లో విశ్వరూపం తీశాడనేది తమిళ అభిమానుల వాదన. దానికి కౌంటర్ గా బాలీవుడ్, టాలీవుడ్ మూవీ లవర్స్ వాదించుకుంటున్న వైనం ట్వీట్స్ కామెంట్స్ లో కనిపిస్తోంది.
నిజం చెప్పాలంటే అసలీ వాదోపవాదాలు అనవసరం. ఎందుకనేది అర్థం కావాలంటే కొంత విశ్లేషణ చేసుకోవాలి. విశ్వరూపంలో టెర్రరిజం ఇష్యూని టచ్ చేసిన మాట వాస్తవమే కానీ అందులో ప్రధానంగా చూపించింది ఆఫ్గనిస్తాన్ కేంద్రంగా పెరిగిపోయిన తీవ్రవాదం గురించి.
‘రా’లో పని చేసే ఒక ముస్లిం గూఢచారి ఆఫ్ఘానిస్తాన్ వెళ్ళిపోయి, అక్కడి ప్రజల్లో నమ్మకస్తుడిగా ఎదిగి, వాళ్ళ కుట్రలను భగ్నం చేసే సాహసానికి పూనుకుంటాడు. తర్వాత తన ఉనికిని మార్చుకుని డాన్స్ డైరెక్టర్ అవతారం ఎత్తి ఉగ్రవాద మూలాల గురించి వెతుకుతూ ఉంటాడు.
రెండు టైం లైన్స్ లో దర్శకుడు కమల్ హాసన్ చాలా వైవిధ్యమైన ట్రీట్ మెంట్ తో విశ్వరూపం తీశారు. అయితే డాక్యమెంటరీ తరహా స్క్రీన్ ప్లే వల్ల విశ్వరూపంలో అధిక భాగం ల్యాగ్ అనిపిస్తుంది. సన్నివేశాల్లోని ఘాడత వల్ల కనెక్ట్ అవుతాం కానీ రెగ్యులర్ ఆడియన్స్ చాలా మందికి కాన్సెప్ట్ అర్థం కాలేదు. అయినా సరే తమిళంలో బ్లాక్ బస్టర్ వసూళ్లు సాధించింది.
దురంధర్ కేసు వేరు. పాకిస్థాన్ లో పాతుకుపోయిన మాఫియాని, అక్కడి రాజకీయం ఇండియా మీద తీవ్రవాదాన్ని ఎలా ఎగదోస్తోందో కళ్ళకు కట్టినట్టు కమర్షియల్ టచ్ లో చూపించారు దర్శకుడు ఆదిత్య ధార్. మూడున్నర గంటలు కథనం పరుగులు పెడుతూనే ఉంటుంది. అందుకే విసుగు రాకుండా ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు.
విశ్వరూపం సూపర్ హిట్టే కానీ ఇంత పెద్ద రెసెప్షన్ దక్కలేదు. రెండు కాన్సెప్టులు వేరు కాబట్టి అసలు పోలిక అనవసరం. కాకపోతే అక్షయ్ ఖన్నాని పోలిన పాత్రని విశ్వరూపంలో రాహుల్ బోస్ పోషించాడు. కానీ ప్రెజెంటేషన్ లో చాలా వ్యత్యాసం ఉంటుంది. దేని ప్రత్యేకత దానిదే కానీ బాక్సాఫీస్ లెక్కల్లో చూసుకుంటే దురంధర్ దే పైచేయి. అయితే ఇక్కడ నటన విషయంలోనూ కమల్ రణ్వీర్ ఫాన్స్ మధ్య వార్ నడుస్తుంది కానీ నటనలో ఎవరిది పే చెయ్యి అనే డిబేట్ కూడా అనవసరం. దానికి సమాధానం అందరికీ తెలిసిందే.
లెనిన్ సినిమా ప్రమోషన్లలో హీరో అఖిల్ అక్కినేని గురించి ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశాడు నిర్మాతల్లో ఒకరైన నాగవంశీ. లెనిన్…
పిల్లలు సంపద అని సీఎం చంద్రబాబు మరోసారి స్పష్టం చేశారు. తాను చెప్పిన మాటకే కట్టుబడి ఉన్నానని తెలిపారు. దీనిని…
వియత్నాంలో విహార యాత్రకు వెళ్లిన భారతీయుల కుటుంబాల్లో విషాదం నెలకొంది. ఊహించని ప్రమాదంలో చిక్కుకుని 15 మంది భారతీయులు మృతి…
తన సినిమాకు పని చేసిన టెక్నీషియన్ను ఒక నిర్మాత సైకోగా అభివర్ణించడం ఎప్పుడైనా చూశారా? సితార ఎంటర్టైన్మెంట్స్ అధినేత నాగవంశీ…
శుక్రవారం విడుదలైన లెనిన్ దూకుడు బాక్సాఫీస్ వద్ద కొనసాగుతోంది. తొలి రోజు పదమూడు కోట్లకు పైగా వసూలు చేసి శని…
ఏపీ రాజధాని అమరావతిలో శనివారం తెల్లవారు జాము నుంచి పోలీసులు అధికారులు పెద్ద ఎత్తున మోహరించారు. ఈ ప్రాంతంలో రాజధాని…