తెలుగు సినిమాలో పరిగెత్తడంలోనూ ప్రత్యేక స్టాండర్డ్ సెట్ చేసిన ఏకైక హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు. అతని రన్నింగ్ స్టైల్ గురించి కేవలం ఫ్యాన్స్ మాత్రమే కాదు, పెద్ద పెద్ద హీరోలు కూడా మాట్లాడుతూ ఉంటారు. మెగా బ్రదర్ నాగబాబు, ఆపకుండా గంటసేపు పరిగెత్తగలిగే ఒకేఒక్క హీరో మహేష్ బాబు అంటూ ఇచ్చిన ఎలివేషన్ గుర్తు ఉండే ఉంటుంది.
అలాంటిది ఇప్పుడు వారణాసి కోసం మహేష్ బాబు రన్నింగ్ స్టైల్ ను రాజమౌళి మార్చేశాడని మహేష్ బాబు చెప్పడం ఫాన్స్ ని ఆశ్చర్యానికి గురి చేసింది. ఐతే ఇది రాముడి పాత్ర కోసం తీసుకున్న నిర్ణయం అని తెలుస్తుంది.
సినిమాలోని కీలక ఘట్టంలో నేను చేస్తున్న రాముడి పాత్ర కోసం నా నుంచునే విధానం, నడిచే విధానంతో పాటు నేను పరిగెత్తే విధానం కూడా మార్చాలని రాజమౌళి చెప్పడంతో దానికోసం సెపరేట్ గా ఆరు నెలలు ట్రైనింగ్ తీసుకున్నట్టు మహేష్ చెప్పడు. ఐతే అది కేవలం రెండు సన్నివేశాల్లోనే ఉంటుందని చెప్పడం మరో పెద్ద షాక్.
ఇక్కడ రాజమౌళి నిర్ణయానికి ఫాన్స్ ఏకీవభించినా ఒక రిక్వెస్ట్ చేస్తున్నారు. కొత్త రన్నింగ్ స్టైల్ కేవలం రాముడి సన్నివేశాలకు ఉంచి మిగతా సాహసాల ఘట్టాలకు మహేశ్ పాత స్టైల్ ను అలానే ఉంచాలని ఫ్యాన్స్ రిక్వెస్ట్ చేస్తున్నారు. మరి జక్కన్న వారి అభ్యర్థనను స్వీకరిస్తారో లేదో వేచి చూడాలి.
ప్రస్తుత సమాచారం మేరకు రాముడి ఘట్టం వరకు మాత్రమే ఈ కొత్తదనం ఉంటుందని తెలుస్తుంది. నిజానికి అలా అయితేనే ఎక్కువ హై ఇస్తుంది. కొత్తదనం సినిమా మొత్తం కనపడితే అది ఫ్యాన్స్ ఎలా తీసుకుంటారో చెప్పలేం. అదే కీలక భాగం వరకు కొత్త మహేష్ ను చూపిస్తే వేరే లెవెల్ కిక్ ఇస్తుందని ఫ్యాన్స్ కోరిక.
లెనిన్ సినిమా ప్రమోషన్లలో హీరో అఖిల్ అక్కినేని గురించి ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశాడు నిర్మాతల్లో ఒకరైన నాగవంశీ. లెనిన్…
పిల్లలు సంపద అని సీఎం చంద్రబాబు మరోసారి స్పష్టం చేశారు. తాను చెప్పిన మాటకే కట్టుబడి ఉన్నానని తెలిపారు. దీనిని…
వియత్నాంలో విహార యాత్రకు వెళ్లిన భారతీయుల కుటుంబాల్లో విషాదం నెలకొంది. ఊహించని ప్రమాదంలో చిక్కుకుని 15 మంది భారతీయులు మృతి…
తన సినిమాకు పని చేసిన టెక్నీషియన్ను ఒక నిర్మాత సైకోగా అభివర్ణించడం ఎప్పుడైనా చూశారా? సితార ఎంటర్టైన్మెంట్స్ అధినేత నాగవంశీ…
శుక్రవారం విడుదలైన లెనిన్ దూకుడు బాక్సాఫీస్ వద్ద కొనసాగుతోంది. తొలి రోజు పదమూడు కోట్లకు పైగా వసూలు చేసి శని…
ఏపీ రాజధాని అమరావతిలో శనివారం తెల్లవారు జాము నుంచి పోలీసులు అధికారులు పెద్ద ఎత్తున మోహరించారు. ఈ ప్రాంతంలో రాజధాని…