తెలుగు సినిమాలో పరిగెత్తడంలోనూ ప్రత్యేక స్టాండర్డ్ సెట్ చేసిన ఏకైక హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు. అతని రన్నింగ్ స్టైల్ గురించి కేవలం ఫ్యాన్స్ మాత్రమే కాదు, పెద్ద పెద్ద హీరోలు కూడా మాట్లాడుతూ ఉంటారు. మెగా బ్రదర్ నాగబాబు, ఆపకుండా గంటసేపు పరిగెత్తగలిగే ఒకేఒక్క హీరో మహేష్ బాబు అంటూ ఇచ్చిన ఎలివేషన్ గుర్తు ఉండే ఉంటుంది.
అలాంటిది ఇప్పుడు వారణాసి కోసం మహేష్ బాబు రన్నింగ్ స్టైల్ ను రాజమౌళి మార్చేశాడని మహేష్ బాబు చెప్పడం ఫాన్స్ ని ఆశ్చర్యానికి గురి చేసింది. ఐతే ఇది రాముడి పాత్ర కోసం తీసుకున్న నిర్ణయం అని తెలుస్తుంది.
సినిమాలోని కీలక ఘట్టంలో నేను చేస్తున్న రాముడి పాత్ర కోసం నా నుంచునే విధానం, నడిచే విధానంతో పాటు నేను పరిగెత్తే విధానం కూడా మార్చాలని రాజమౌళి చెప్పడంతో దానికోసం సెపరేట్ గా ఆరు నెలలు ట్రైనింగ్ తీసుకున్నట్టు మహేష్ చెప్పడు. ఐతే అది కేవలం రెండు సన్నివేశాల్లోనే ఉంటుందని చెప్పడం మరో పెద్ద షాక్.
ఇక్కడ రాజమౌళి నిర్ణయానికి ఫాన్స్ ఏకీవభించినా ఒక రిక్వెస్ట్ చేస్తున్నారు. కొత్త రన్నింగ్ స్టైల్ కేవలం రాముడి సన్నివేశాలకు ఉంచి మిగతా సాహసాల ఘట్టాలకు మహేశ్ పాత స్టైల్ ను అలానే ఉంచాలని ఫ్యాన్స్ రిక్వెస్ట్ చేస్తున్నారు. మరి జక్కన్న వారి అభ్యర్థనను స్వీకరిస్తారో లేదో వేచి చూడాలి.
ప్రస్తుత సమాచారం మేరకు రాముడి ఘట్టం వరకు మాత్రమే ఈ కొత్తదనం ఉంటుందని తెలుస్తుంది. నిజానికి అలా అయితేనే ఎక్కువ హై ఇస్తుంది. కొత్తదనం సినిమా మొత్తం కనపడితే అది ఫ్యాన్స్ ఎలా తీసుకుంటారో చెప్పలేం. అదే కీలక భాగం వరకు కొత్త మహేష్ ను చూపిస్తే వేరే లెవెల్ కిక్ ఇస్తుందని ఫ్యాన్స్ కోరిక.
సంక్రాంతి తర్వాత వెలవెలబోయిన టాలీవుడ్ బాక్సాఫీస్లో మళ్లీ కళ తెచ్చే సినిమా అవుతుందని అందరూ ‘పెద్ది’ మీదే ఆశలు పెట్టుకున్నారు.…
మలయాళంతో పాటు తెలుగులోనూ మంచి విజయం సాధించిన మూవీ ప్రేమలు. దీంట్లో జంటగా నటించిన నస్లెన్, మమిత బైజు ఎంత…
కంటెంట్ ఉంటే చాలు ప్రేక్షకులు బడ్జెట్, స్టార్ క్యాస్టింగ్ పట్టించుకోరని ప్రతి భాషలో రుజువవుతూనే ఉంది. మన దగ్గర బలగం,…
సాంకేతికంగా మనిషి ఎన్నో అద్భుతాలను సృష్టించాడు. వాటిని తన జీవన విధానంలో భాగం చేసుకున్నాడు. సుఖమయ జీవితాన్ని కొనసాగిస్తున్నాడు. అయితే…
ఏపీలోని కూటమి సర్కారు ఇటీవలే నిర్వహించిన మెగా డీఎస్సీపై విపక్ష వైసీపీ బారీ అవినీతి ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే.…
పెద్ది ప్రీమియర్ల గురించి ఇండస్ట్రీ వర్గాల్లో, అభిమానుల్లో ఎడతెగని చర్చ జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్ లో క్లారిటీ వచ్చేసింది. రాత్రి 8…