తెలుగు సినిమాలో పరిగెత్తడంలోనూ ప్రత్యేక స్టాండర్డ్ సెట్ చేసిన ఏకైక హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు. అతని రన్నింగ్ స్టైల్ గురించి కేవలం ఫ్యాన్స్ మాత్రమే కాదు, పెద్ద పెద్ద హీరోలు కూడా మాట్లాడుతూ ఉంటారు. మెగా బ్రదర్ నాగబాబు, ఆపకుండా గంటసేపు పరిగెత్తగలిగే ఒకేఒక్క హీరో మహేష్ బాబు అంటూ ఇచ్చిన ఎలివేషన్ గుర్తు ఉండే ఉంటుంది.
అలాంటిది ఇప్పుడు వారణాసి కోసం మహేష్ బాబు రన్నింగ్ స్టైల్ ను రాజమౌళి మార్చేశాడని మహేష్ బాబు చెప్పడం ఫాన్స్ ని ఆశ్చర్యానికి గురి చేసింది. ఐతే ఇది రాముడి పాత్ర కోసం తీసుకున్న నిర్ణయం అని తెలుస్తుంది.
సినిమాలోని కీలక ఘట్టంలో నేను చేస్తున్న రాముడి పాత్ర కోసం నా నుంచునే విధానం, నడిచే విధానంతో పాటు నేను పరిగెత్తే విధానం కూడా మార్చాలని రాజమౌళి చెప్పడంతో దానికోసం సెపరేట్ గా ఆరు నెలలు ట్రైనింగ్ తీసుకున్నట్టు మహేష్ చెప్పడు. ఐతే అది కేవలం రెండు సన్నివేశాల్లోనే ఉంటుందని చెప్పడం మరో పెద్ద షాక్.
ఇక్కడ రాజమౌళి నిర్ణయానికి ఫాన్స్ ఏకీవభించినా ఒక రిక్వెస్ట్ చేస్తున్నారు. కొత్త రన్నింగ్ స్టైల్ కేవలం రాముడి సన్నివేశాలకు ఉంచి మిగతా సాహసాల ఘట్టాలకు మహేశ్ పాత స్టైల్ ను అలానే ఉంచాలని ఫ్యాన్స్ రిక్వెస్ట్ చేస్తున్నారు. మరి జక్కన్న వారి అభ్యర్థనను స్వీకరిస్తారో లేదో వేచి చూడాలి.
ప్రస్తుత సమాచారం మేరకు రాముడి ఘట్టం వరకు మాత్రమే ఈ కొత్తదనం ఉంటుందని తెలుస్తుంది. నిజానికి అలా అయితేనే ఎక్కువ హై ఇస్తుంది. కొత్తదనం సినిమా మొత్తం కనపడితే అది ఫ్యాన్స్ ఎలా తీసుకుంటారో చెప్పలేం. అదే కీలక భాగం వరకు కొత్త మహేష్ ను చూపిస్తే వేరే లెవెల్ కిక్ ఇస్తుందని ఫ్యాన్స్ కోరిక.
This post was last modified on February 5, 2026 7:21 am
జంతర్ మంతర్ ఆందోళనలో విద్యార్థులు తనను దుషించారని ప్రధాని మోదీ శుక్రవారం రాత్రి విడుదల చేసిన వీడియో సోషల్ మీడియాలో…
నేటి తరం రాజకీయ నాయకులలో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కుమార్ స్టైలే వేరు. నిబద్దత కలిగిన నాయకుడిగా ఎదిగినప్పటికి…
గత రెండు మూడు రోజులుగా మహేష్ బాబు గురించి సోషల్ మీడియాలో పెద్ద చర్చ జరుగుతోంది. జయకృష్ణ తొలి సినిమ…
గత కొన్ని వారాలుగా టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. పెద్ది తెలుగు రాష్ట్రాల్లో బాగా ఆడితే…
కార్తీ కెరీర్ బెస్ట్ హిట్స్ గా చెప్పుకునే సినిమాల్లో ఖైదీ, నా పేరు శివ తర్వాత సర్దార్ ఉంటుంది. తెలుగులోనూ…
ఎన్నడూ లేని విధంగా ఈ మధ్య టాలీవుడ్ స్టార్లు ఒకరి తర్వాత ఒకరు గాయపడడం ఆందోళనకరంగా మారిన సంగతి తెలిసిందే.…