Movie News

లెజెండ్ పోయాడు… లీడర్ వస్తున్నాడు

నాలుగేళ్ల క్రితం తమిళ హీరోగా మనకూ పరిచయమైన శరవణన్ ‘ది లెజెండ్’తో డెబ్యూ చేసి తెరంగేట్రంతోనే ట్రోలింగ్ చవి చూడాల్సి వచ్చింది. వందల వేల కోట్ల వ్యాపార సామ్రాజ్యానికి అధిపతి అయినా నటుడిగా తన తృష్ణను తీర్చుకునే ఉద్దేశంతో ఎంత నష్టమైనా సరే డబ్బుని మంచి నీళ్లలా ఖర్చు పెట్టి 2022లో హీరోగా ఎంట్రీ ఇచ్చారు శరవణన్.

భారీ పారితోషికాలు ఇవ్వడంతో పెద్ద క్యాస్టింగ్ తో పాటు జెడి జెర్రీ లాంటి అనుభవమున్న దర్శకుడితో పరిచయం చేయించుకున్నాడు. సరే అది డిజాస్టర్ అయ్యింది, ఇక మనోడు రాడనుకుని మూవీ లవర్స్ రిలాక్స్ అయ్యారు. కానీ శరవణన్ ఆ టైపు కాదు. తిరిగి లీడర్ గా వస్తున్నాడు.

ఏప్రిల్ లో విడుదల కానున్న లీడర్ తాలూకు టీజర్ ఇవాళ రిలీజ్ చేశారు. రజినీకాంత్ రేంజ్ లో ఒక భీభత్సమైన ఫైట్ ఎపిసోడ్ ద్వారా శరవణన్ ని పరిచయం చేసి కథలో పాప సెంటిమెంట్ కీలకంగా ఉన్న విషయాన్ని బయట పెట్టారు. దీనికి దర్శకుడు ఆర్ ఎస్ దురై సెంథిల్ కుమార్.

శివ కార్తికేయన్, ధనుష్, శశికుమార్ లాంటి స్టార్లను డీల్ చేసిన ఈ డైరెక్టర్ ఈసారి శరవణన్ ని ప్రమోట్ చేసే బాధ్యతను తీసుకున్నారు. రెగ్యులర్ కమర్షియల్ హీరోని ఏ రేంజ్ లో ప్రెజెంట్ చేస్తారో అచ్చం అలాగే లీడర్ ని డిజైన్ చేయడం గమనార్హం. చూస్తుంటే ఈసారి కూడా బడ్జెట్ గట్టిగానే పెట్టినట్టు కనిపిస్తోంది.

ఒక విషయంలో శరవణన్ ని మెచ్చుకోవాలి. ఎంత డబ్బున్నా ప్రేక్షకుల మద్దతు లేకుండా స్క్రీన్ మీద నెట్టుకురావడం అసాధ్యం. అయితే మొదటిసారి తిరస్కారానికి గురైనా రెండో ప్రయత్నానికి పూనుకోవడం ఆశ్చర్యపరుస్తుంది. అది కూడా ఇంత గ్యాప్ తర్వాత.

గిబ్రాన్ సంగీతం సమకూరుస్తున్న లీడర్ ని ఏప్రిల్ లో విడుదల చేయబోతున్నారు. తమిళంతో పాటు తెలుగులోనూ సమాంతరంగా రిలీజ్ కానుంది. ఒరిజినల్ భాషలో ఆయనకు వ్యాపారాలు, ఉద్యోగులు ఉన్నారు కాబట్టి ఏదో అనుకోవచ్చు. అసలు సంబంధమే లేని తెలుగు ప్రేక్షకులతో కనెక్ట్ కావాలని శరవణన్ ప్రయత్నించడం నిజంగా ఆశ్చర్యం.

Kumar

Recent Posts

పవన్ పేరు ఎందుకు మారింది?

ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తన పేరు వెనుక ఉన్న ఆసక్తికరమైన కథను వెల్లడించారు. జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో…

4 hours ago

ఏపీ పాఠ‌శాల‌ల్లో చాగంటి పాఠ్యాంశాలు..!

ఏపీ ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల్లో ప్ర‌ముఖ ప్ర‌వ‌చ క‌ర్త చాగంటి కోటేశ్వ‌ర‌రావు ప్ర‌సంగాల‌ను పాఠ్యాంశాలుగా ప్ర‌వేశ పెడుతున్నట్టు ప్ర‌క‌టించింది. దీనికి సంబంధించి…

5 hours ago

జ‌న‌’సేన’ జాగ్ర‌త్త ప‌డాలా?

ఏపీలో కూటమిగా ఏర్పడిన టిడిపి, జనసేన, బిజెపిలు అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు పూర్తయింది. ఈ క్రమంలో కూటమికి నేతృత్వం…

7 hours ago

మీనాక్షి ఇష్యూ కాంగ్రెస్ ను ‘హర్ట్’ చేసింది!

ఓ రాజకీయ పార్టీ తనను వేధించిన విషయంపై అలుపెరగని పోరాటం చేసి తీరుతుంది. అలా చేయకుంటే… అది రాజకీయ పార్టీ…

9 hours ago

మోదీ రికార్డును బద్దలుకొట్టడం కష్టమే!

భారత దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ బుధవారం ఓ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు. దేశానికి అత్యధిక కాలం…

9 hours ago

పవన్ నోట మరోమారు ‘తెలంగాణ’ మాట

జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మరోమారు తెలంగాణ అంశం మీద నోరు విప్పారు. భారత దేశంలో…

10 hours ago